Skip to main content

అళియ అరాళీయము--౫

దృశ్యము 5

( సుల్తాన్ కులీ దర్బారు)

( తెల్లని తెరలో దర్బారు ఛాయారూపాన్ని కనిపిస్తుంది)

(లైట్లు రాగానే సుల్తాను కులీ ఎత్తైన ఆసనం మీద కూర్చొని కనిపిస్తాడు. వెనక ఇద్దరు సేవకులు వింజామరలు వీస్తూ ఉంటారు. సుల్తానుకి ఎడమ వైపు రహీంఖాన్ నిల్చొని ఉంటాడు. సుల్తాను కుడివైపు ప్రవేశ ద్వారం మీద అందరి చూపులు ఉంటాయి)

సుల్తాన్:
    రహీంఖాన్ ! ఈ రామరాజు హింకా రాలేదేమి ?

రహీంఖాన్:
    వస్తూనే ఉంటాడు జహాపనాహ్ ! గుస్తాకీ మాఫ్ జహాపనాహ్ ! మీరు ఆ కాఫిర్’ని చాల ఎక్కువగా నమ్మారు.

సుల్తాన్:
    నీకీ అలా అన్పించిందా ?

రహీంఖాన్:
    అవును హుజూర్ !

సుల్తాన్:
    దుష్మన్;కీ  కోట అప్పగించి వచ్చినందుకు అలా అన్పించిందా ?

రహీంఖాన్:
    జహాపనాహ్ ! రామరాజు ఎలాంటి ప్రతిఘాటన చెయ్యలేదు. తననీ, తన సైనికులనీ, కోట వదిలి పారిపోయి రక్షించుకొన్నాడు. హిది లడాయికి భయపడడం కాదంటారా హుజూర్ ?

సుల్తాన్:
    రహీంఖాన్ నువ్వు తప్పుగా సోచాయిస్తున్నావ్ ! కోటలో సంపదని సైనికుల సహాయంతో తెచ్చి, ఖజానాకి చేర్చాడు కదా ?

రహీంఖాన్:
    నిజమే జహాపనాహ్ ! సంపదా తెచ్చాడు మంచిదే ! కాని ప్రజల మాట హేమిటి ? దుష్మన్  సిపాయిలు మన ప్రజల ధన, మాన ప్రాణాలను దోచుకొని హుంటే హేం జరిగేది ? మీకు బద్;నామీ అవదా హుజూర్ !

సుల్తాన్:
    యా అల్లా ! నిజమే ! రహీంఖాన్ నేను హిది హెంద్కు సోచాయించ లేదు ! మంఛి మాట చెప్పావ్, హిది వాడిని అడగాల్సిందే !

(ప్రవేశం రామరాజు సుల్తానుకి కుడివైపు నుంచి)

రామరాజు:
    ( వస్తూనే సలాం చేస్తాడు) కుతుబ్ షాహీ వంశ్ కీ చాంద్ ! దిగ్గజ్ రాజావోంకీ స్వప్నోంకీ షేర్ !! జరూరత్ మందోంకీ రెహమాన్ !!! సుల్తాన్ కులీ కుతుబ్ షాకీ జయహో ! సుల్తాన్ కులీ కుతుబ్ షాకీ జయహో ! సుల్తాన్ కులీ కుతుబ్ షాకీ జయహో !

సుల్తాన్ :
    రామరాజూ, జయవాదాలు అవతల పెట్టు, సంపద ఖజానాకి చేర్చావా ?

రామరాజు:
    జీ జహునాహ్ ! ఖజానాకీ లెక్కలతో సహా అప్పజెప్పాను హుజూర్ !

సుల్తాన్:
    నువ్వు చేసిన పనీ మాకీ నచ్చాలేదు రామారాజూ, ప్రజా రక్షణని గాలికి వదిలేసి, పారిపోయి వచ్చావ్ ! ఇదీ మాకీ బద్’నామీ కాదా ?

రామరాజు:
    (ఖంగు తింటాడు) జహాపనాహ్ ! నేను కోట మీద తెల్ల జండాని ఎగురవేసి వచ్చాను. విజయనగర ప్రభువులకి ఆ కోట, ఆ కోటలోని ప్రజలు కొత్తకారు జహాపనాహ్! వారు నిర్దోషులైన ప్రజల మీదకి అత్యాచారానికి దిగరు జహాపనాహ్ ! ఇదివరకు జరిగిన ఎన్నెన్నో యుధ్ధాలు ఆ విషయాన్ని ఋజువు చేసాయి. ఇపుడు కూడా అదే జరిగింది జహాపనాహ్ ! ప్రజలు సురక్షితంగానే ఉన్నారు. కేవలం దుర్గం మీద జండా మారింది!

రహీంఖాన్:
    ( కలుగ జేసుకొని) అలాగని విజయనగర రాజు నీతో సంధి చేసుకొన్నాడా ? నువ్వు లాలూచీ పడలేదా ? ఎలాంటి సూచనా లేకుండా , ఆ దుష్మన్ రాజు నీ పైకి దండయాత్ర ఎందుకు చేసాడు ?గుట్టూ చప్పుడూ లేకుండా ఆ దండాయాత్ర  చేసీ హుంటే ఆ విషయం నీకీ హెల్లా తెలిసింది ?

సుల్తాన్:
    చెప్పు రామరాజూ, రహీంఖాన్ ప్రశ్నలకి జవాబు చెప్పు.

రామరాజు:
    విజయనగర రాజు, తాను ఇది వరకు పోగొట్టుకొన్న దుర్గాన్ని తిరిగి పొందడానికి ఎలాంటి సూచనా ఇవ్వకుండా దాడి చేసాడు. శతృరాజుల రణనీతి ఉచితానుచితాలు నేనెలా చెప్పగలను ? అతని దాడి గురించి నాకు గూడచారుల ద్వారా తెలిసింది. మీకు సూచన ఇచ్చి, యుధ్దానికి అనుమతి పొందే సమయం మించిపోయింది. కేవలం పదిహేను వందల మంది సిపాయిలు, రెండు వందల ఆశ్వికులు గల నేను , వారి చతురంగ సేనని ఎదుర్కోవడం ,‘ గొర్రె కొండతో తలపడడం లాంటిది కాదా హుజూర్ ? మీరు నాకు ఆనతి నివ్వండి జహాపనాహ్ ! నేను సైన్యాన్ని తీసుకెళ్లి ఆ కోటని ముట్టడి చేసి, శతృవులని పరాజితులని చేస్తాను. విజయనగర రాజు చేసిన మెరుపు దాడికి సరైన శిక్ష వేస్తాను.

రహీం ఖాన్:
    (తనలో) ఈ రామరాజు తన మాటలతో సుల్తాన్’ని పడగొట్టేలా హున్నాడు. అలా జరగ కూడదు. ( ప్రకాశంగా) రామారాజూ ! చేసిన తప్పుని సమర్థించుకోవాలని చూడాకు. చేతనున్న కోటని విడిచి పెట్టి, తిరిగి దానినే ముట్టడించడానికి  సైన్యబలం కావాలంటావా ? నువ్వు లడాయికి భయపడ్డావు, ఆ సంగతి చెప్పు.

సుల్తాన్
    రామారాజూ ! రహీంఖాన్ చెప్పినది బాగు. నువ్వు చేసినదీ నాకూ నచ్చాలేదు. అయినా ఒకసారి నా ప్రాణాలని కాపాడావు. ఇప్పుడు సంపదని తెచ్చావు. అందూకని నీకీ దేశ బహిష్కార శిక్ష వేస్తున్నాను. రేపు సూర్యోదయం లోగా, నా రాజ్యం సరిహద్దులు దాటి పారిపో ! పట్టుబడితే శిరచ్ఛేదమే శిక్ష ! సమఝ్ అయిందా ?

( సుల్తాను కోపంతో అక్కడనుంచి నిష్క్రమిస్తాడు)

( రామరాజు నిరుత్తరుడై , విషాద వదనంతో వెళ్లిపోతాడు)

రహీంఖాన్:
    ఈ రామరాజుకు రేపటి సూర్యోదయం వరకు సమయం ఇస్తే పారిపోతాడు. అలాగయితే నా పగ హెల్లా చల్లారుతుంది ? కాపలా సిపాయిగా వచ్చి, నా మోదే పెత్తనం చేస్తాడా ? వీణ్ని బంధించి రాత్రంతా చెరలో పెట్టి, తెల్లావారాక పట్టుకొని తల నరుకుతాను. వాడు పారిపోకూడదు.

( అంటూ హడావుడిగా వెళ్తాడు)

( లైట్లు ఆరుతాయి)

Comments

Popular posts from this blog

వాశిష్ఠ చెప్పిన వేదంలో కథలు---౩—ఛిన్నమస్త

{ కీ.శే. వాశిష్ట ( అయల సోమయాజుల మహాదేవ శాస్త్రి గారు) ౧౯౬౦వ దశకంలో పేరెన్నిక గన్న రచయిత. వేదాలలో కథలని కొన్ని వరుసగా వ్రాసి ,వాటిని చుక్కాని, ఆంధ్రప్రభ, జాగృతి, ఆంధ్ర పత్రికలలో ప్రచురించారు. ప్రస్తుత కథ ‘ చుక్కాని పక్ష పత్రిక ౧౫ మార్చి ౧౯౬౩ సంచికలో ప్రచురించారు. ఆ కథలని  ‘క్షీరగంగలో’ పరిచయం చేయడానికి సంకల్పించాను.} అది పడైవీడు క్షేత్రం ! రేణుకాలయం కొండల మధ్యన ఉన్న విశాలమైన మైదానమందు నిర్మింపబడి ఉంది ! దానికి కొంత దూరంలో ‘ ‘కమండలు’ నది ప్రవహిస్తూంది. ఆలయాంతర్భాగంలో ఒక మంటపంపై ఇద్దరు వ్యక్తులు కూర్చొని ఉన్నారు. వారిలో ఒకడు వయస్సు చెల్లిన వాడు. రెండవ వాడు యువకుడు, పేరు ‘ధనంజయ శర్మ’. “ ఈ ప్రశాంతమైన స్థలంలో కొన్ని రోజులుండి యోగ సాధన చేసుకోవాలని తీర్మానించాను.” అన్నాడు సగం నెరసిన గడ్డాన్ని సర్దుకొంటూ ‘ రామానంద యోగి’.   “ గురుదేవా ! నాకూ అలాంటి ఉద్దేశమే కలిగింది. ఇదివరలో అనేక క్షేత్రాలు చూచాం,కాని ఎక్కడ కూడ ‘శిరస్సు’ మాత్రమే మూల విగ్రహంగా కల క్షేత్రాన్ని చూడలేదు ! దీని ఆంతర్యమేమో గురుపాదులు సెలవియ్యాలని ప్రార్థిస్తున్నాను. ” అని అన్నాడు ధనంజయ శర్మ. “ శర్మా ! స్మరణ మాత్రం చేతనే సమస్త...

చిలక రథంలో సరదా షికారు—( పెద్దలకు, పెళ్లైన వారికి మాత్రమే)

     ( ఈ బ్లాగులోనే టపా కొట్టిన కొన్ని సరస శృంగార కథల సమాహారం )     స్వస్తి శ్రీ చాంద్రమాన విరోధి నామ సంవత్సర జ్యేష్ట అమావాస్య , మృగశిరా నక్షత్ర యుత , సోమవార పర్వదినం, రోమన్ కేలండర్ ప్రకారం ఆ రోజు తేదీ 22.06.2009.     రాత్రి రెండు ఝాములు దాటి , ఒంటి గంట అయింది !     రుద్రాభిషేకం జరుగుతోంది.!     అది క్షీరారామ క్షేత్రంగా ప్రసిధ్ధికి ఎక్కిన ‘శ్రీరామ లింగేశ్వర స్వామి వారి ఆలయం. శివుడు తన త్రిశూలపు మొనని, నేలపై ఆనించగా, అక్కడ నుండి, ‘క్షీర ధార’ పైకి ఉబికి,‘ పాలకొలను’ ఏర్పడిందట ! ఆ కొలను గట్టున శ్రీమహా విష్ణువు పూర్ణావతారమైన, శ్రీరామ చంద్ర మూర్తి , సీతమ్మ వారితో కలసి, తమ స్వహస్తాలతో , ‘శ్రీ రామ లింగేశ్వర’ప్రతిష్ట చేసారట !     ఆ విధంగా శివ-  కేశవుల పవిత్ర స్పర్శతో పునీతమయిన క్షేత్ర రాజం అది !     ‘పినాక పాణి’ , అతని కుటుంబ సభ్యులు, శ్రీ రామ లింగేశ్వర స్వామి వారి, అభిషేక కార్యక్రమం ముగించుకొని, మూడవ గంట కల్లా, తనతో పాటు తెచ్చుకొన్న ‘మినీ బస్సులో’ తిరుగు ముఖం పట్టారు.   ...

శ్రీ రంగ నీతులు. (మరచిపోయిన జానపద కళ)

 శ్రీ రంగ నీతులు. (శ్యామలా ఆర్ట్స్’ వారి ప్రస్తుతి!  “శ్రీరంగ నీతులు ‘ అనే ‘జానపద కళా ప్రదర్శన’  అని వ్రాసి ఉంటుంది) (వాద్య బృందం, స్టేజి పైనే కూర్చొని ఉంటారు. రాజా-రాం అనే యువకుడు చెంచు యువకుని వేషంలో కనిపిస్తాడు. వాద్య బృందం లోని  వారి సహకారంతో రాజా రాం పాట అందుకొంటాడు) రాజా రాం : ఒహోయ్ ! చెంచులూ ! చెంచు పెద్ద చెప్పే శ్రీ రంగ నీతులు వినడానికి ఎంత మంది వచ్చారో చూసార్రా? అందరూ : చూసాము ,చూసాము నాయకా ! [[నందానా]] రాజా రాం : అదేమర్రా? మర్యాదలు మర్సిపోయారా? అందరూ : ఏం సేయమంటావు నాయకా! [[నందానా]] రాజా రాం : పదం అందు కొండి చెంచులూ! అందరూ : ----[[అవునవును ]] రాజా రాం:  కార్య నిర్వాహక సభ్యులకి నెనర్లు! అందరూ: ----[[అవునవును, నెనర్లు ]] రాజారాం :  పెద్దవారికి ఐదు పది సేతలు! (రెండు చేతులూ జోడిస్తాడు) అందరూ : ----[[అవునవును, చేతులు జోడిస్తారు ]] రాజారాం : సమ వయస్కు లయిన స్త్రీ పురుషులందరికీ వెన్నెల! అందరూ : ---[[అవునవును, వెన్నెల--]] రాజారాం :   ఔత్సహకులయిన యువతీ యువకులకి డింగిడీలు! అందరూ : ----[[అవునవును,...