Skip to main content

Posts

Showing posts from May, 2011

యుగధర్మం 2

గతించిన ఏడేళ్లలో జగన్నాధం రైలు స్టేషనుకి రావడం అదే ముదటి సారిగా చూసిన పోర్టర్ దాలయ్య .“ బండికేనా బాబూ ?” అని ప్రశ్నించాడు అపనమ్మకంతో. “ అవును.” “ ఎక్కడికి బాబూ ?” “ చిన్న పనుండి బయలుదేరాను పట్నానికి.” “ ఏ పట్నానికి బాబూ ?” అని దాలయ్య అడగనూ లేదు, జగన్నాధం చెప్పనూ లేదు. ‘ ఈ స్టేషన్లో కూడా ఆగవలసి వచ్చింది కదా’ అని నిట్టూర్చి గట్టిగా కూత వేసి, ఆగింది రైలుబండి. జగన్నాధం తోలు సంచీ దాలయ్య చేతికిచ్చి బండీలో ఎక్కాడు. దాలయ్య అతి కష్టం మీద జగన్నాధాన్ని, సంచీని ఒక పెట్టెలో కూరి, “ బాబూ !” అంటూ చేయి చాపాడు. జగన్నాధం అదేదీ గమనించకుండా ప్రయాణీకుల మధ్య తలదాచుకొన్నాడు రైలుబండి ఆలస్యాన్ని భరించలేని దానిలా కదిలింది. కనీసం టీ డబ్బులన్నా దొరుకుతాయని ఆశించిన దాలయ్య నిరాశతో వెనుతిరిగాడు. ‘ ఏం చేస్తాం ! యుగధర్మం, ఇకమీదెప్పుడూ తెలిసిన వాళ్లకి సాయం చేయకూడదు’ అనుకొంటూ. జగన్నాధం కూర్చొన్న రైలు దిగవలసిన పట్నం చేరుకొంది. స్టేషన్లోనే దిగి, పరిచయస్థులెవరైనా కనబడతారేమోనని చుట్టూ కలయ జూసాడు..దూరంగా ఒక పోర్టర్’తో మాట్ళాడుతూ నిల్చొన్న ‘సర్వాయి ’ కనబడగానే, జగన్నాధం అతనిని ఆశ్చర్యంతోనూ, కుతూహలంతోనూ బిగ్గరగా పిలిచాడ

యుగధర్మం 1

‘కొక్కొరొకో’ ఉషస్సు రాకకు స్వాగతం చెప్పింది కుక్కుట ధ్వని. ఇష్ట దేవతా స్మరణ చేసుకొంటూ పక్క దిగాడు జగన్నాధం. అతడు నా అన్నవారెవ్వరూ లేని ఒంటరి . ఏ ఊరి వాడో, ఎక్కడి నుండి వచ్చాడో గాని, దాదాపు ఏడేళ్లు కావస్తూంది, అతడా ‘వీరన్న పాలెం’ చేరుకొని. అంతకాలం ఆ ఊరిలో స్థిరంగా అతనికే ఆశ్చర్యంగా కలిగిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు మనస్సును ప్రశ్నిస్తూ ఉంటాడు కూడా, ‘ నువ్వీ ఊరిలో ఇంతకాలం ఉండడానికి కారణమేమిటి ?’ అని. ఒకటి ఊరిలోని ప్రశాంతత, రెండు ‘గుండాల చెరువు’,మూడవది---- మూడవది --- అతని హృదయం చెప్పడానికి సంశయిస్తుంది. గుండాల చెరువు ఆ ఊరి ఉత్తర సరిహద్దు. పంటల వేళే గాని, మామూలు దినాలలో దాని వైపు ఎవరూ తేరి చూడరు, కాని జగన్నాధానికి, అది ప్రాతః స్నానానికి కలిగించిన సౌకర్యం మరే ఊరిలోని సరస్సూ కలిగించ లేదంటే అతిశయోక్తి లేదు ! ఇదంతా విని జగన్నాధం మూడు కాళ్ల ముదుసలి అని మీరు అనుకొంటే మీదే తప్పు. అతడు పదహారణాల పడుచు వాడు. అయినా వివాహమంటే విముఖత చూపించేవాడు. ‘ గత జీవితంలో ఎన్ని దెబ్బలు తిన్నాడో, అలాంటి నిర్ణయం తీసుకోడానికి’, అనుకొంటారు ఆ గ్రామ ప్రజలంతా ! తను ఆ ఊరిలో స్థిరత్వం పొందడానికి రెండవ కా

ఆత్మ సాక్షాత్కారం

అదొక డాక్ బంగళా. దానికి దగ్గరలో ఉన్న గ్రామం, దరిద్రానికి కూడా దగ్గరగానే ఉంది. అయినా బక్క చిక్కిన శల్య పంజరాల లాంటి ప్రాణులు, ముఖ్యంగా మనుష్యులు, కుక్కలతో మాత్రం సుసంపన్నంగా ఉంది. కుక్కల్ని మినహాయించినా, ఇంకా ఎంతో ప్రాణ శక్తి నిండిన ఆ గ్రామంతో సహజంగానే ఒక మంత్రిగారికి పని పడింది. అలా అవసరపడి వచ్చిన మంత్రిగారు, అంతకన్న అవసరపడి వచ్చిన చీకటి వల్ల, ఆ రోజు రాత్రికి, పాపం డాక్ బంగళా లోనే విశ్రమించారు. మంత్రిగారి రాక ఆ ఊరి ప్రాణికోటికి, కనీసం కాకైనా చెప్పలేదు ! వార్తా పత్రికలు చెప్పాయి గాని, అవి ఆ ఊరి పొలిమేరలకి కూడా రావు. అందుచేత వాటిని చదివే పాటి మనుష్యులకి గాని, చించి తూర్పారబెట్టే కుక్కలికి గాని, అతని రాక తెలియలేదు. అయినా అవి ( కుక్కలు ) బారులు తీరి, డాక్ బంగళా చేరుకొన్నాయి. కారణం వాటి పసిగట్టే స్వభావం వల్ల కాదు, చీకటి పడే సరికి అక్కడికి చేరుకొనే అలవాటు వల్ల ! అలా చేరుకొన్న ఆ కుక్కలు ప్రసన్న గంభిరమైన ఆ వాతావరణంలో బంగళా గచ్చు మీద తీరుబడిగా విశ్రమించి వంతుల వారీగా ఆనంద భైరవిని ఆలాపించ సాగాయి. భొవ్, వ్, వ్, వ్, వ్--- భౌవ్ కేంవ్, వేవ్, వేవ్, వేవ్, వేవ్ --- కేంవ్ గుర్, క