Skip to main content

Posts

Showing posts from June, 2016

వాసిష్ట చెప్పిన ఆంద్ర మహావిష్ణువు చారిత్రిక గాధ--సత్య ప్రభ 18: బాపు వేసిన బొమ్మలతో సహా

  “వెంటనే ప్రవేశపెట్టు.” అన్నాడు మహారాజు. వీరభద్రుడు ప్రమథనాథ బాబుని పడక గది లోపలి తీసుకొని వచ్చి అక్కడ వదలి వెళ్ళిపోయాడు. ప్రమథనాథుడు రాజుకి నమస్కరించి ఆసనం పైన కూర్చొన్నాడు. ఆ మేచక మూర్తిని చూసి మహారాజు అంత  ఆందోళన లోనూ మందహాసం చేసి ఇలా అన్నాడు, “ప్రమథనాథా! ఏమిటి విశేషం?” అని. “మహాప్రభో! నేను రాష్ట్రీయ ఘనేంద్ర బాబుతో కలసి మహామంత్రి సదనానికి వెళ్లాను.నేను వచ్చిన పని గురించి మహామంత్రికి విన్నవించాను. వారు దీర్ఘంగా ఆలోచించి శ్రీవారిని వెంటనే కలుసుకో వలసిందిగా  నాకు ఆజ్ఞ దయచేశారు. కాబట్టి ఇక్కడకి వచ్చాను. శ్రీవారికి నిద్రా భంగం చేయవలసి వచ్చింది.” “ఈ రోజు సాయంకాలం మహామంత్రి నాతో  నీ విన్నపాన్ని గురించి వివరంగా ప్రస్తావించాడు. అది మొదలుకొని నాకు నిద్ర పట్టే అవకాశం తప్పి పోయింది. ఇక నాకు నిద్ర పట్టే రోజులు కాలగర్భంలో సుదీర్ఘమై దాగి ఉన్నాయనే చెప్ప వచ్చు. నీ రాజు ముందర ఎట్టి సంకోచం లేకుండా అన్ని విషయాలూ చెప్పవచ్చు. నేను సావధానంగానే ఉన్నాను.” “మహాప్రభో! నేను శ్రీవారిని ఒక ప్రశ్న వేయవలసి ఉంది.”        “ప్రమథనాథా ! సందేహించ వద్దు. ధారాళంగా ప్రశ్నించ వచ్చు.” “శ్రీవారు మంజులా దేవి

వాసిష్ట చెప్పిన ఆంద్ర మహావిష్ణువు చారిత్రిక గాధ --సత్యప్రభ -17: బాపు వేసిన బొమ్మలతో సహా

  మహారాజు జాబుని రథినీ కుమారికి ఇచ్చి చదవమన్నాడు. దానిని రథిని ఈ ప్రకారం చదివింది. ప్రియ మిత్రమా! శ్రీ శైలం మంచు కంటె దట్టమైన దూమంతో ఆవృతమై ఉంది. వాతావరణం అనుకూలంగా లేదు. నాలుగు వందల చేతులు ఉన్నా మానవునికి ఇక్కడ సుఖంగా ఉండదనే నా తలంపు. అయోధ్రుడము లైన నా రెండు చేతులు వ్యక్తిగతంగా సరి పోవచ్చు. కాని నాతొ కలసి ఉన్న యాత్రికుల సదుపాయాన్ని కూడ చూడాలి కదా? గ్రహించ వలెను. వ్రాయడానికి ఏముంది? ఏమీ లేదు. నీవు నాకు ఉత్తరం వ్రాయాలంటే ఈ క్రింది విలాసానికి వ్రాయవచ్చు. శివదత్త శర్మ; చందన వాటిక; శ్రీశైల మండలం. భగిని ధరణిని చాలా అడిగినట్లు చెప్పు, భవదీయుడు కంకోల భీమనాథుడు వ్రాలు.  “కుమారీ! నీ అన్న భాష దక్షిణా మూర్తి భాషలాగ ఉంది!” అని నవ్వాడు రాజు. “నాన్నగారూ! అన్నయ్య చాల నేర్పుగా వ్రాశాడు. ధూమం అంటే శత్రువుల సంచలనం అని అర్థం. చిట్టపులులు అంటే పరంతప సంఘం వారు. నాలుగు వందల బాహువుల్లోనే అన్నయ్య గొప్ప తెలివిని చూపెట్టాడు. నా అభి ప్రాయంలో అన్నయ్యకు రెండు వందల మంది సైనికులు సహాయం నిమిత్తమై కావాలి కాబోలు! “ అని చెప్పింది రథినీ కుమారి.  “భర్త్రుదారిక బుద్ది చాల నిశితమైనది! ఇప్పటి వరకు మా బుర్రలు ఆ అద్భుత

వాసిష్ట చెప్పిన ఆంధ్ర మహావిష్ణువు చారిత్రిక గాధ--సత్యప్రభ 16 :బాపు వేసిన బొమ్మలతో సహా

33 వ ప్రకరణం:       “పెద్దనాగూ!” అని ఎవరో పిలిచినట్లు అయింది! కర్ణి ధ్యానం భగ్నమయింది. ఆమె దిగ్గని సంభ్రమంతో లేచి వీధి తలుపు తీసింది. ఎదురుగా ఆజానుబాహుడైన జడధారి!! అతని నిడుపాటి సగం నెరసిన గడ్డం బొడ్డు వరకు వ్యాపించి ఉంది. అతని పింగళమైన జటలు పృష్ట భాగాన్ని ఆవరించి ఉన్నాయి. అతని శరీరం శుష్కించి ఉన్నా చాల పటుత్వంగా కనపడుతూంది! అతని ఫాలం అర్థ భాను బింబం వలె తేజోపూరితంగా ఉంది. అతని కండ్ల లోని తేజస్సు దుర్నిరీక్ష్యంగా ఉంది! అతని ఉన్నత నాసిక ముఖానికి గంభీరత ప్రసాదిస్తూంది. అతని దేహప్రభ ధవళం, ఉత్తి ధవళమే కాదు, కాంతివంతం. అతడే పెను జడధారి జటాముని. అతని కుడి చేతిలో పెద్ద కమండలం ఉంది. ఎడమ చేతిలో నిడుపాటి చేతి కర్ర ఉంది. అతడు కాషాయ వస్త్రాలు దరించి ఉన్నాడు. ‘నాథా, ధన్యురాలిని!” అని కర్ణి మొదలు నరికిన అరటి చెట్టు లాగ అతని కాళ్ళపైన పడిపోయింది! పడిపోవడం తోనే కర్ణి మూర్చితురాలయింది. సంతోషాదిక్యంచే ఆమె శరీరం లోని వాయువు స్తంభించి పోయింది! జడధారి గారాబంతో ఆమెను తన రెండు చేతులతో ఎత్తాడు! ఎడమ చేతితో ఆమెను పట్టుకొని తన గుండెలకి ఆనించు కొని, తన కుడి చేతి కమండలోదకాన్ని ఆమెపై జల్లాడు.రెండు క్షణా

వాసిష్ట చెప్పిన ఆంద్ర మహావిష్ణువు చారిత్రిక గాధ : సత్యప్రభ -15 :బాపు వేసిన బొమ్మలతో సహా

32 వ ప్రకరణం: “దొడ్డమ్మా! క్షేమమా! పెద్దావు కోడెదూడ సుఖంగా ఉందా?” “కన్నతల్లీ! కోడెదూడ సొండై కూర్చొంది, పొడుపు కూడ నేర్చుకొంది. చెబితే వినడే తల్లీ! నీవైనా పిలిపించి నాలుగు చీవాట్లు పెట్టమ్మా !” “వత్స కుడుపు మానేసిందని బొత్తిగా మరచి పోవడమేనా?” “అయ్యో, కన్న తల్లీ! నిన్ను మరువగలనా? నీ జ్ఞాపకం నా రక్తంలో మిళితమై పోయిందమ్మా. పెద్ద గడపలు తొక్కడమంటే నాకు వల్లమాలిన జంకు.” కర్ణి భీమనాథుని తల్లి. ఆమె సంపూర్ణ నామధేయం నాగ కర్ణి. అందరూ ఆమెను ‘కర్ణి’ అనే పిలుస్తారు ఒక రాత్రి మాత్రం ఒక మహాపురుషునికి కళత్రమై, తదనంతరం నిత్య బ్రహ్మచారిణిగా దీక్ష వహించిన ఉత్తమ జాతి స్త్రీ రత్నం ఆమె! ఆమె ఇప్పుడు సేనాపతి ఇంటికి రథినీ కుమారిని చూడడానికి వచ్చింది. కర్ణి మంచి ఒడ్డూ పొడుగూ కలిగిన భారీ మనిషి. కొలిమిలో పుటం పెట్టి మెరుగుపరచిన రాగిలాగ ఆమె శరీర ప్రభ, ఔషసీ శోభను మించి పవిత్ర భీషణంగా కనబడుతుంది. ఆమె అంగాల లోని పటుత్వం నిరుపమానం. ఆమె వినీల కచభరం స్త్రీజన ఈర్ష్యా జనకం! బ్రహ్మచర్యం చేత కలిగిన ఆమె కండ్ల లోని తేజస్సు పరమాద్భుతం! నలభయ్యవ పడిని దాటినా, ఆమె శరీరలత లావణ్య తరంగ వారిచే పరిపూర్ణమై ప్రౌఢ యువతులను మించి కనపడుతూం

వాసిష్ట చెప్పిన ఆంద్ర మహావిష్ణువు చారిత్రిక గాధ --సత్యప్రభ--14 :బాపు వేసిన బొమ్మలతో సహా

30 వ ప్రకరణము: రహస్య సమావేశానంతరం మరునాడు రాత్రి సుచంద్ర భట్టారకుడు అంతఃపురం ప్రవేశించాడు. పూర్ణ చంద్రుని క్షీరాబ్ది వీచిక వలె ‘భ్రుంగాలక’ అతనిని ఎదుర్కొని సామ్రాజ్ఞి దగ్గరకి తీసుకొని వెళ్లింది. మహారాణి ప్రత్యుత్థానం చేసి, తన వల్లభుని రెండు చేతులను గ్రహించి హంస తూలికా తల్పం పైన కూర్చొన బెట్టింది. భ్రుంగాలక వారి ఎదుట వేత్రాసనం పైన కూర్చొన్నది.రాష్ట్ర  సౌందర్యమంతా శ్రీకాకుళ నగరియందు కేంద్రీకరింపబడినది! శ్రీకాకుళ నగర రామణీయక మంతా ప్రాసాదంలో  సంగ్రహింప బడింది. ప్రాసాద కమనీయ సారమంతా రాజ దంపతుల శయన శాలలో ఇమడ్చ బడింది. ఆ సుందరమైన ఏకాంత శాలలో రాజ దంపతుల  సన్నిధిలో భ్రుంగాలకకు మాత్రమే ప్రవేశముంది! అధికార రీత్యా చేటీ జనాధ్యక్షురాలుగా ఉన్నా, ఈమె హస్తక్షేపం చేయని రాజకార్యమే ఉండదు! చక్కదనంలో ఈమె లీలావతీ దేవికి సమానురాలు, గడుసుదనంలో అధికురాలు! కొన్ని విషయాలు లీలావతీ దేవి ప్రసక్తి లేకుండానే ప్రభువుకు చెప్పుకొనే చొరవ ఈమెకి ఉంది! ఈమె కుమారుడు వీరసింహుడు, కాలనాథాదుల కంటె ఏంటో తక్కువవాడైనా, పథమంగానే రాజకీయ సేనలో సహస్రపతిగా నియమింపబడ్డాడు. అధికార వర్గం వారందరూ ఈమె దగ్గర వినయం గానే ఉంటారు! ఈమె హేమ

వాసిష్ట చెప్పిన ఆంద్ర మహావిష్ణువు చారిత్రిక గాధ -- సత్యప్రభ 13:బాపు వేసిన బొమ్మలతో సహా

28 వ ప్రకరణము:                           సమావేశం ముగిసిందని ఊహించి కాలనాథుడు రాజాజ్ఞ పొంది సప్త భూమికా విమానం వదలి వెళ్ళడానికి నిశ్చయించుకొన్నాడు. ఆ భావాన్ని పార్థివుడు కనిపెట్టి ఇలా అన్నాడు. “కాలనాథ బాబూ! వ్యవహార కాండ ముగిసింది. కాని నీ రాజు నీవు మరికొంతసేపు కూర్చోవాలని కోరుతున్నాడు. కొంత లోకాభిరామాయణం ముచ్చటించుకొందామని తలస్తున్నాను. “చిత్తం మహాప్రభో!” “కొసకు నీ తల్లి తండ్రులు శ్యామలా సులోచనులు కారని నీ మనస్సాక్షికి స్ఫురించిందా?” “సూటిగా మహారాజు వేసిన ప్రశ్న కాలనాథుని చకితునిగా చేసింది. ఏదో ఆపదలో పడిపోతున్నట్లు ఒక భావం వానికి పుట్టింది! ఆ భావోద్రేకం వల్ల వాణి శరీరం కించిత్తు వణికింది. తన్ను బాగా సమాళించుకొని పార్థివుని చూసి ఇలా అన్నాడు. “ నిజమే ప్రభో!” “తిరిగి అసలు తల్లి తండ్రులను శోధించడానికి ప్రయత్నిస్తావా?” కాలనాథుడు గతుక్కుమన్నాడు! తన్ను తాను  సమాధాన పరచుకొని “మహాప్రభో! విస్తారం శోధన అక్కర లేకుండానే నా తల్లి తండ్రులు ...నాకు ..తెలిసి ..పోయారు!” “కాలనాథ బాబూ! వారి పేర్లు వినవచ్చునా?” అంతట కాలనాథుడు సిద్ధ కవీశ్వరి రాజకాళి పాడిన పాటలను మంద్ర స్వరంతో

వాసిష్ట చెప్పిన ఆంద్ర మహావిష్ణువు చారిత్రిక గాధ - సత్యప్రభ 12 :బాపు వేసిన బొమ్మలతో సహా

                                                                                                      రాజాజ్ఞ వినగానే వీరనందుడు కంపిస్తున్న హస్తంతో   తన     రాష్ట్రీయాదికార చిహ్నమైన మహాఖడ్గాన్ని ఘనేంద్రుని చేతికి అందించాడు. ఘనేంద్రుడు దానిని వినయంతో ముట్టికాలు వేసుకొని స్వీకరించి, వీరమర్యాదని అనుసరించి మహారాజుకి నమస్కరించాడు. ప్రతీహారులంతా ఈ దృశ్యాన్ని చూసి ఆశ్చర్య పడ్డారు, సుచంద్ర భట్టారకుడు మహామంత్రికి కబురు పెట్టాడు. ఘోరకుని కనుసంజ్ఞను  గ్రహించి ప్రతీహారులు ఆసనాలు తెచ్చి సింహద్వారం ముందర వేసారు. అందరూ ఉపవిష్టులయారు. ఘోరకుడు మాత్రం నిలిచే ఉన్నాడు! మహామంత్రి సునందుడు అక్కడకి వచ్చాడు. రాష్ట్రియుని ఖడ్గం ఘనేంద్రుని చేతిలో ఉంది! మహారాజు పాదాల వద్ద ఘోరకుని మహాఖడ్గం  పడి ఉంది! ఆ ప్రదేశమంతా కళేబరాలతో భీభత్సంగా ఉంది. ప్రతెహారులందరూ కాగడాలు పట్టుకొని నిలుచుని ఉన్నారు. ఈ దృశ్యాన్ని చూసి ప్రథాన మంత్రి చకితుడై మహారాజుకు అభివాదన చేసాడు! రాజ ప్రేరితుడయిన  ప్రతీహారి మహామంత్రికి జరిగిన సంఘటనని క్లుప్తంగా నివేదించాడు. మహామంత్రి మహారాజుచే  అనుజ్ఞాతుడై ఆసనం అలంకరించాడు. అనంతరం సింహద్వారం దగ్గ