Skip to main content

Posts

Showing posts from July, 2016

వాసిష్ట చెప్పిన ఆంద్ర మహావిష్ణువు చారిత్రిక గాధ --సత్యప్రభ 24 :బాపు వేసిన బొమ్మలతో సహా : (అత్యద్భుతమైన ముగింపుతో)

రాయబారం చర్చ ప్రసన్న వాతావరణంలో జరిగింది. “కళింగులపై మాకు ద్వేషం లేదు! రాజ్యాక్రమణ చేయాలనే ఉద్దేశం కూడ లేదు! కుమార భోగనాథాదులు రాజ ద్రోహులు! మా దేశానికి ప్రబల శతృవు నిశుంభునితో చేతులు కలిపి కుండిన వంశాన్ని చిన్నాభిన్నం  చేయా లని తలచాడు కుమార భోగనాథుడు. అటువంటి రాజద్రోహులకు మీ ప్రభుత్వం ఆశ్రయం ఇచ్చి, ఆదరించి, సైనిక చాలనాదికారం కూడా ఇచ్చింది! కాబట్టి మా ప్రభుత్వం ఉపేక్ష వహించడం ప్రమాదకరమని యుద్ధం ప్రకటించింది! మీరు రాజద్రోహులను ససైన్యంగా మా వశం కావించితే, మన రాష్ట్రాలకు అనుకూలమైన సంధి విధానాన్ని చర్చించుకో వచ్చు” అని చెప్పాడు చిత్రకూట రాష్ట్ర సర్వ సేనాధిపతి, ఆంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి అయిన ప్రమథనాథుడు!  “కుమార భోగనాథునికి మేము ఆశ్రయం ఇవ్వమని మా ప్రభుత్వం తరఫున నేను చెప్పగలను! వారిని మీరు పట్టుకోవడానికి ఎట్టి చర్యలనైనా చేయవచ్చు! మా ప్రభుత్వం ఒకమారు ఆశ్రయం ఇచ్చిన దోషం వలన వారిని స్వయంగా పట్టి ఇవ్వడానికి సందేహించ వచ్చు. ప్రస్తుతం మనం సంధి విషయాలను ప్రస్తావించుకొని ఇరు పక్షాల సైన్యాలనూ ఉప సంహరించు కొందాము” అన్నాడు వినయ చంద్రుడు. ప్రమథనాథుడు కొన్ని క్షణాలు గంభీర మౌనముద్ర వహించ

వాసిష్ట చెప్పిన ఆంద్ర మహావిష్ణువు చారిత్రిక గాధ-- సత్యప్రభ 23 : బాపు వేసిన బొమ్మలతో సహా:

దండనాయకుల సభ ముగిసిన కొన్ని ఘడియల్లో ఉప సేనాధిపతి భార్గవ సోమదత్తుడు రథ, గజ, తురగ, పదాతి దళాలతో కూడిన ఐదువేల సైన్యంతో దేవవాటికా దుర్గాభిముఖంగా కదిలాడు. భేరీ భాంక్రుతులతో కదలి వెళ్తున్న ఆ సేనావాహినికి పట్టణ ప్రజలు జయనాదంతో వీడ్కోలు ఇచ్చారు. మరునాడు గోధూళి సమయంలో సర్వ సేనాధిపతి కాంకోల భీమనాథుడు రాజధానిని విడచి తన సేనతో సరిహద్దు ప్రాంతాలకు వెళ్ళుతాడని పట్టణమంతా ఉద్ఘాటించ బడింది. ఆ సమయం వచ్చింది. అరుణ వర్ణం చేత ప్రకృతి రాగరంజితమై శోభాయమానమై ఉంది. మహానందిపురమంతా దీపావళులతో జాజ్జల్యమానంగా ఉంది. రాజవీధి పొడుగునా కళ్ళాపి చల్లబడి, చిత్ర విచిత్రంగా ముగ్గులు వేయ బడ్డాయి. పట్టణ ప్రజలు ఆబాల గోపాలం తమ దేశ సైన్యం తరలి వెళ్ళే దృశ్యం చూచే నిమిత్తం వీధి  అరుగుల మీదా, డాబాలమీదా గుమికూడారు. రాజప్రాసాదం దీప మాలికలతో అలంకరింపబడింది. కోట వాకిలి డాబాపై మంగళ తూర్యారావం వీనుల విందు చేస్తోంది. రాజ ప్రాసాదానికి ఎదురుగా ఉన్న మైదానంలో సేనలు బారులు తీరి నిలబడి ఉన్నాయి. సర్వ సేనాధిపతి ఆయుధ శాలకు కవచ ధారణ నిమిత్తం వెళ్ళాడు. ద్వార పాలకులు అభివాదన చేసి అతనికి దారి ఇచ్చారు. భీమనాథుని ఎదుర్కొంటూ వచ్చింది కుమారి

వాసిష్ట చెప్పిన ఆంద్ర మహావిష్ణువు చారిత్రిక గాథ--23: బాపు వేసిన బొమ్మలతో సహా

శ్రీశైల మహామండలేశ్వరుని ఏకైక పుత్రిక ‘రత్నప్రభా కుమారి’ బుద్దిసాగర, భీమనాథులని  తన అభ్యంతర మందిరంలో కలుసుకొంది. చేటీ జనాధ్యక్షురాలు వసుంధరా దేవి కూడా ఆ సమావేశంలో సన్నిహితురాలు అయింది. భీమనాథుడు రత్నప్రభా కుమారిని చూడడం అదే మొదటిసారి! ఆ మహోత్కృష్ట సుందరిని కంచి అతడు తన కన్నులు సార్థకత పొందినట్లు తలచాడు! ఆమె సుకుమారాంగాల నిరుపమానం! చంద్రునికి వంక  పెట్టే ఆమె ముఖ మండలం అత్యుజ్వల కమనీయం! ఆమె తనూలత లావణ్యం పావన తరంగ రమణీయం! ఆమె అవయవాల వంపు సొంపులు నయన మాదకాలు! ధీరుడైన భీమనాథుడు తన జీవితంలో మొదటి సారిగా చలించాడు! భీమనాథుని మేఘ గంభీర సుందరాక్రుతి  రత్నప్రభా  రాకుమారి  హృదయంలో నూతన స్పందం పుట్టించింది. ఆమె చూపులు  రాగార్ద్రాలై తళుక్కుమని  మెరిసాయి.ఆమె నును చెక్కిళ్ళపై సిందూర ప్రభ భాసించింది! “తాతగారూ! తమ దర్శనం నాకు లభించి చాల దినాలు అయింది. మనుమరాలి మీద  ఈనాటి కైనా మీకు దయ పుట్టినందుకు సంతోషం! వసుంధర ఏమేమో చెప్పింది. నాకు ఏమీ బోధ పడడం లేదు! “ అని చెప్పి రత్నప్రభ తన కడగంటి  చూపుతో భీమ నాథుని చూసింది. వృద్ధుడైన బుద్ది సాగరుడు వారిద్దరి భావ కల్లోలాన్ని గమనించనట్లు  నటించి, “కుమార

వాసిష్ట చెప్పిన ఆంద్ర మహావిష్ణువు చారిత్రిక గాధ--సత్యప్రభ- 22 : బాపు వేసిన బొమ్మలతో సహా

43 వ ప్రకరణం: భారద్వాజ బుద్దిసాగరుడు మహానందిపురంలో పేరు ప్రతిష్టలు కల పెద్ద మనిషి. అరవై అయుదు  సంవత్సరాలు నిండిన వృద్ధుడు. శస్త్ర శాస్త్రాలు రెండింటి లోనూ, నిష్ణాతుడు. బుద్దిసాగరుడు రెండు సంవత్సరాల క్రిందటి వరకు శ్రీశైల మహామండల మహామంత్రిగా ఉండేవాడు! అతని కాలంలో దేశం శాంతి భద్రతలతో కళ కళలాడుతూ ఉండేది ! మహామండలేశ్వరునుకీ, అతనికీ సేనాధిపత్య పదవిని గురించి తీవ్రమైన బేదాభిప్రాయాలు కలిగినందు వలన , అతడు తన పదవికి రాజీనామా ఇచ్చి తప్పుకొన్నాడు. ‘కారవేలుడనే’ యువకుడు కుంతల దేశం నుండి వచ్చి రాజాశ్రయం సంపాదించి క్రమక్రమంగా సేనలో శతపతి పదవిని పొందాడు. ఆ సుందర యువకుడు రాజుగారికి ప్రీతి పాత్రుడై ఆయన అంగ రక్షసేనకు దండనాయకుడు అయ్యాడు. కారవేలుడు స్ఫురద్రూపి! ఆకర్షకమైన ముఖ వర్చస్సు కలవాడు. ఆయుధ విద్యలలో ఆరితేరిన వీరుడు. యుద్ధ నీతిలో కన్నా రాజనీతిలో మంచి ప్రావీణ్యం కలవాడు!  వృద్ధ సేనాపతి సాలంకాయన యజ్ఞమిత్రుడు కాలధర్మం చెందినందున శ్రీశైల మహామండల సైన్యాధ్యక్షుని నియమన సమస్య వచ్చింది. మహామంత్రి బుద్దిసాగరుడు ఉప సేనాపతి భార్గవ సోమదత్తుడిని నియమించ వలసినదిగా మహామండలేశ్వరున్ని కోరాడు. కాని

వాసిష్ట చెప్పిన ఆంద్ర మహావిష్ణువు చారిత్రిక గాధ --సత్యప్రభ --21: బాపు వేసిన బొమ్మలతో సహా

  42 వ ప్రకరణము       మహానంది పురానికి ఈశాన్య దిశలో ఒక పెద్ద కోనేరు ఉంది. దానిలోని నీరు తామరాకులచే కప్పబడి బయటికి కన్పించదు ! కోనేరుకు నిండుగా తామర పువ్వులు, మొగ్గలు ఉన్నాయి.కోనేరు ఒడ్డున ఒక విశాలమైన పదహారు స్తంభాల మంటపం ఉన్నది. రాత్రి మొదటి యామంలో చాలావరకు దాటింది. ప్రక్రుతి చీకటి తెరలో మాటు మణిగి ఉంది. చీరండల నాదం, నక్కల ఊళలు తప్ప వేరే అలికిడి లేదు! తామరకొలను అవతల ఆవలిగట్టు ప్రక్కగా శ్మశానవాటిక ఉంది. పట్టణం అంతటికీ అదే శ్మశానవాటిక. ఆ మంటపంలో ఇద్దరు మనుష్యులు కూర్చొని మాట్లాడు కొంటున్నారు. వారిద్దరూ నల్లని ఉడుపులు ధరించి చీకటితో ఐక్యం చెంది ఉన్నారు. “వీరమల్లూ! నీవు చుట్టు ప్రక్కల బాగా పరికించి రా! అప్పుడు గాని అమనం మాట్లడుకోరాదు!” “దొరా! ఎవరూ లేరు. చూసే వచ్చాను.” “సరే! ఇప్పుడు నీవు విషయాన్ని సన్నని స్వరంతో వెల్లడించు.” “దొరా! వారందరూ ఎల్లుండి అర్థరాత్రి వేళ దొడ్డి ద్వారంలో నుంచి కోటలోకి ప్రవేశించడానికి నిశ్చయించారు.” “మొత్తం ఎంతమంది ఉంటారు?” “నూరు మంది దొరా! వాందరికీ నాగసేనుడు నాయకుడు.” “ నాగసేనుడా! మంచి గడుసువాడే, సాధారణంగా లొంగే రకం కాదు, ఆ తరువాత?” “ ఆ నూ

వాసిష్ట చెప్పిన చారిత్రిక గాధ --సత్యప్రభ 20: బాపు వేసిన బొమ్మలతో సహా

ఆంద్ర రాష్ట్ర రాజధాని శ్రీకాకుళ వాతావరణంలో ఉష్ణోగ్రత హెచ్చింది. ఆబాల గోపాలం ఆ ఉష్ణోగ్రతకు గురి అయ్యారు. ఎక్కడ చూచినా ‘యుద్ధం’ అనే నాదం బయలుదేరింది. ఆ ఉష్ణోగ్రతకు ప్రతీ ఆంద్ర యువకుని రక్తం పొంగి సుళ్ళు తిరిగింది. తండోపతండాలుగా యువకులు సేనలోచేరుతున్నారు   రైతులు విరివిగా వ్యవసాయం కొనసాగించి ధన్యాదులు ప్రభుత్వానికి ఇవ్వడానికి కంకణం కట్టుకొన్నారు. రాజధానిలో ధనిక వర్గం వారు యాభై కోట్ల మొహరీలు ప్రభుత్వానికి యుద్ధ నిదిగా సమకూర్చడానికి నడుం కట్టారు. కాందులు తమ కుటుంబాలకు సరిపోయే సాలుసరి పంటను కేటాయించుకొని మిగులు పంటను విరాళంగా ప్రభుత్వ పరం కావిస్తున్నారు. మహిళా సంఘ పర్యవేక్షణ క్రింద యక్షగాన బృందాలు, వీధి భాగవత దళాలు, నాట్య ప్రదర్శన సంఘాలు, సంగీత కచ్చేరీలు, తయారు అవుతున్నాయి. ఇవన్నీ సైనికులకు వినోదం, ఉత్సాహం  కలిగించడానికి ఉద్దేశింప బడ్డాయి. ఇవి రణ రంగాలకు సైన్య దళాలతో సహా పయనం కావడానికి సిద్ధంగా ఉన్నాయి. అక్షోభ్యముని ఆధ్వర్యాన క్షతగాత్ర చికిత్సాదళం ఏర్పాటయింది. మహిళా వర్గానికి అధ్యక్షురాలు వ్రణ చికిత్సా నిపుణురాలు కాత్యాయని. సుమారి ఐదువేల మంది స్త్రీ పురుషులతో కూడిన ఈ శాంతిసేన రాత్రి