Skip to main content

Posts

Showing posts from August, 2010

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన 21

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన 21 ( దృశ్యము ౯౧ ) ( వేంకటాచలం పైన ఒక రావి చెట్టు ) ( శ్రీనివాసుడు, బ్రహ్మ, శివుడు ఉంటారు ) బ్రహ్మ ---- తండ్రీ ! తల్లి లక్ష్మీ దేవి సూర్యనారాయణునితో పాటు వచ్చి, విడిది చేరినది. రేపు ప్రాతః కాలమున ( శ్రీనివాసుడు బదులివ్వడు ! దిగులుగా ఉంటాడు ) శివుడు -- ప్రభూ ! శ్రీనివాసా !. లక్ష్మి వచ్చిన వార్త తెలిసినను, మీ ముఖము కళా విహీనమై యున్నది, కారణ మేమి ? శ్రీనివాస --- పరమేశ్వరా ! లక్ష్మి ఈ కార్యమునకు, కేవలము సాక్షి రూపమున వచ్చినదే గాని, తన పూర్వ వైభవముతో రాలేదు ! ఆహ్వానితులైన దేవతలు, భూలోకమును చేరుట వలన, అన్నగత ప్రాణులయిరి. నేను రిక్తుడను ! నా ధనమంతయు పోయినది. నే నెట్లు వారికి భోజనము పెట్టగలను ? శివుడు --- శ్రీనివాసా ! పెళ్లి చేయుటకు , ఇల్లు కట్టుటకు ప్రారంభించిన వాడు, అంతము వరకు తన ప్రయత్నము మానుకోకూడదు ! శుభ కార్యములలో, సమస్త సంభారములు సమకూర్చుకోవలసినదే గాని, విడనాడ కూడదు ! దనము లేనిచో ఋణము చేసి అయినను కార్యము నడిపింప వలయును ! శ్రీనివాస -- లెస్స

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన 20

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన 20 ( దృశ్యము 90 ) ( కరివీర పురము—కొల్హాపూరు ) ( శ్రీ మహాలక్ష్మి ఒక సంపెంగ చెట్టు దగ్గర తిన్నె మీద కూర్చొని ఉంటుంది. ఆమె పాదాల మీద సూర్య కిరణాలు పడతాయి ఆ తరువాత ఒక శ్లోకం వినబడుతుంది ) శ్లోకం-- లక్ష్మీం క్షీర సముద్ర రాజ తనయాం, శ్రీ రంగ ధామేశ్వరీం, దాసీ భూత సమస్త దేవ వనితాం, లోకైక దీపాంకురాం, శ్రీ మన్మంద కటాక్ష లబ్ధ విభవ, బ్రహ్మేంద్ర గంగాధరాం, త్వాం, త్రైలోక్య కుటుంబినీం, సరసిజాం, వందే ముకుంద ప్రియాం ! ( లక్ష్మి కళ్లు తెరిచి, తన పాదాల చెంత, పడిన సూర్యకిరణాలని చూసి, చిరునవ్వు నవ్వుతుంది ) లక్ష్మి--- సూర్య నారాయణా ! ఈ స్తోత్రము నీ నోట కడు రమ్యముగా నున్నది ! వచ్చిన కారణమేమి ? ( సూర్యుడు ప్రత్యక్ష్యమవుతాడు ) సూర్య ---- తల్లీ ! నీ కొరకు సప్తాశ్వ రథమును తెచ్చాను. లక్ష్మి ---- సప్తాశ్వ రథమా ! అది ఏల సూర్యనారాయణా ? సూర్య ----మాతా ! నేడు వైశాఖ శుద్ధ సప్తమి, సోమవారము--- లక్ష్మి --- విళంబినామ సంవత్సరం, ఉత్తరాయనం, అయితే ఏమంటావు ? సూర్య --- అది కాదు తల్లీ ! రాబోయే

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన 19

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన 19 ( దృశ్యము 87 ) ( ధరణీ దేవి అభ్యంతర మందిరం ) ( ధరణీ దేవి, ఆకాశ రాజు కూర్చొని ఉంటారు ) ధరణీ దేవి -- ప్రభూ ! వివరంగా చెప్తాను వినండి. గత ఉగాది నాడు , రాజ సభలో దైవఙ్ఞులు, మన పద్మావతికి, పురుషోత్తముడైన వరుడు లభిస్తాడనీ, దేవతలే ఆమె పెళ్లికి పెద్దలవుతారనీ, చెప్పారు కదా ! ఆకాశ రాజు --- అవును, దైవఙ్ఞులు, అలాగే చెప్పారు ! ధరణీ దేవి--- ఆ పైన మన ఉద్యాన వనమున, ఒక వృద్ధ బ్రాహ్మణుడు, పద్మావతి చేయి చూసి, అదే విధముగా జోస్యముగా చెప్పినాడు. ఆకాశ రాజు--- నిజమే ! ఈ విషయము మీరు ఇదివరకే తెలియజేసినారు ! ధరణీ దేవి-- అవును ప్రభూ ! ఆ తరువాత అదే ఉద్యాన వనమున, మన పద్మావతి ఒక సుందర పురుషుని సంధించి, అతని మీద మనసు పడి, బయటికి చెప్పలేక, లోన దాచుకోలేక జ్వరపడింది.. ఇదంతా ఒక ఎరుకల సాని తన సోదెలో చెప్పింది. ఆకాశ రాజు -- దేవీ ! పద్మావతి సఖులు--- ధరణీ దేవి---- ఆ విషయమును ధృవ పర్చినారు ప్రభూ ! ఆకాశ రాజు --- మీరు మన అమ్మాయిని -- ధరణీ దేవి—అడిగి తెలుసుకొన్నాను మహారాజా ! ఆమె అతనిని ప్రే

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన 18

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన 18 ( దృశ్యము- ౮౫ ) ( ధరణీ దేవి అంతఃపురం ) ( ఎరుకల సాని , దాని కొడుకు మన్మథుడు, పద్మావతి, చెలికత్తెలు ముగ్గురు, దరణీదేవి, ఆమె పరిచారిక ఉంటారు ) ఎరుకత-- విన్నావమ్మా,చిన్న దొరసానీ ! స్వామి పుష్కరణిలో తానమాడి, ఒక మహారాజు రాజ్యం పొందితే, మరొక మారాజు పిశాచ జనమ నుంచి, బయట పడి, తిరిగి తన రాజరికం, ఏలికొన్నాడమ్మా ! పద్మావతి-- ఎరుకా ! ఎవరే ఆ మహారాజు ? పిశాచ జన్మం ఎందుకు ఎత్తాల్సి వచ్చింది ? ఎరుకత --- అదేటి చిన దొరసానమ్మా ! ఆ మహారాజు ఇంకెవరో కాదమ్మా ! మీ చోళ దేశపు మారాజేనమ్మా ! శ్రీ మహాలక్ష్మికి ఇచ్చిన మాట తప్పినందువల్ల, విష్ణుదేవుని మీద నింద వేసినందువల్ల, పిశాచ జనమ ఎత్తవలసి వచ్చింది తల్లీ ! ధరణీదేవి -- అవునమ్మా పద్మావతీ ! అతనే మన వంశ మూలపురుషులు శ్రీశ్రీశ్రీ సువీర చక్రవర్తులవారు ! మీ తాతగారైన సుధర్మ మహారాజుగారికి స్వయానా తండ్రిగారు !--- ఈ ఎరుకల సాని సోది ఎలా చెప్తుందో గాని, వేంకటాచలం పైన కథలు మాత్రం మా బాగా చెప్తోంది ! --- ఆన్నిటి కన్న ముందు నీ మనోరంజన చెసి

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన 17

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన 17 ( ద్రుశ్యము 81 ) ( సాంకాశ్యమనే రాజ్యము ) ( చక్రవర్తి శంఖణుడు, మంత్రి రూపచంద్రుడు, రాజగురువు మాధవాచార్యుడు ఉంటారు. చక్రవర్తి సింహాసనానికి వెనుక పరిచారికలు వింజామరలు వీస్తూ ఉంటారు. ) ( ప్రవేశం-- కోశాధికారి స్వర్ణగుప్తుడు ) స్వర్ణగుప్తుడు--- సాంకాశ్య నరేంద్రులు, శంఖణ చక్రవర్తులకు జయమగుగాక ! -- కోశాధికారి స్వర్ణగుప్తుడు నమస్కరిస్తున్నాడు. ( ఆని నమస్కరిస్తాడు ) రూపచంద్రుడు--- స్వర్ణగుప్తా ! చక్రవర్తుల వారు మీ కోసమే ఎదురు చూస్తున్నారు. మన కోశాగారంలో నిల్వలు ఎలా ఉన్నాయి ? సాలీనా జరిగే జమా, ఖర్చులు ఎంత ? ఈ వివరాలను ప్రభువులవారికి తెలియజేయండి. స్వర్ణగుప్త--- మహామంత్రి రూపచంద్రుల వారికి, రాజగురువు మాధవాచార్యుల వారికి, నా నమస్కారములు ! మన సాంఖాశ్య రాజ్యం లోని సాలీనా ఖర్చు ఒకటిన్నర సంఖ్యల శ్రీరామ ముద్ర నిష్కములు అవుతుంది. సాలీనా రాబడి, రెండు సంఖ్యల శ్రీరామముద్ర నిష్కములు. పోగా మిగులు అర సంఖ్య శ్రీరామ ముద్ర నిష్కములు. కాని--- ఈ మధ్య సామంత రాజులైన విక్రమవర్మ, తేజసిం

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన 16

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన 16 (ద్ర్రుశ్యము ౭౯ ) ( వేంకటాచలం. నారాయణ వరం మధ్యనున్న అరణ్యం. శ్రీనివాసుడు, గుర్రం మీద స్వారీ చేస్తూ ఉంటాడు. ) ( దారిలో రెండు పులులు, ఒకదానితో ఒకటి దెబ్బలాడుకొంటూ ఉంటాయి. గుర్రం ఆ ద్రుశ్యం చూసి, ముందుకి వెళ్లడానికి, మొరాయిస్తుంది. ) ( శ్రీనివాసుడు గుర్రం ఆపి, ఆ ద్రుశ్యాన్ని చూస్తాడు. వెంటనే క్రిందకి దిగి, ఒకే ఒక బాణంతో, పులులు రెండింటినీ హతమారుస్తాడు. ఆ తరువాత శ్రీనివాసుడు తిరిగి గుర్రం మీద స్వారీ చేస్తూ వెళ్తాడు ) ( దారిలో కొన్ని జింకలు పరుగెడుతూ కనిపిస్తాయి. ఆ జింకలను తరుముతూ , ఒక మత్తగజం వస్తుంది. ) ( శ్రీనివాసుడు జింకలను రక్షించే నిమిత్తం గుర్రాన్ని, మత్తగజం వెనుక పరుగెత్తిస్తాడు. ముందుగా ఏనుగు, దాని వెనుక శ్రీనివాసుడు, ఆకాశరాజు ఉపవనం లోకి ప్రవేశిస్తారు . చిత్రంగా ఏనుగు మాయమవుతుంది !) ( ఉపవనంలో, ఒక పూల చెట్టు గట్టుపైన, పద్మావతి ఒంటరిగా కూర్చొని ఉంటుంది. శ్రీనివాసుడు గుర్రం దిగుతాడు. పద్మావతి అతనిని చూస్తుంది. శ్రీనివాసుడు ఆమెను తదేకంగా చూస్తాడు. పద

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన 15

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన 15 ( దృశ్యము 75 ) ( అగ్ని లోకం ) ( వేదవతి తపస్సులో ఉంటుంది. ప్రవేశం, అగ్ని దేవుడు ) అగ్ని --- అమ్మా, వేదవతీ ! నీవు నిరంతరం స్మరించే శ్రీహరి సేవ చేసే భాగ్యం లభ్యమయింది ! ( వేదవతి కళ్లు తెరచి చూస్తుంది. ఆమె కళ్లల్లో కాంతులు చోటు చేసుకొంటాయి ) వేదవతి--- నిజంగానా, తండ్రీ ? అగ్ని ---అవును, ముందు నిస్వార్థ భావంతో నీ సేవలందించి, నీ జీవితాశయాన్ని తరువాత తెలియజేసి, అర్థించడం మంచిదని నా అభిప్రాయం, నీవేమంటావు ? వేదవతి--- హరిసేవా భాగ్యాన్ని మించిన తపస్సేముంది తండ్రీ ! ఇంతకీ నేను చేయాల్సిన సేవ ఏమిటి ? అగ్ని ---- శ్రీమహావిష్ణవు యీ త్రేతాయుగమున, శ్రీరామచంద్రునిగా అవతరించుట , నీకు తెలిసినదే కదా ? వేదవతి--- అవును, అతను తన అవతార లీలా విశేషం వల్ల, పంచవటిలో వాసం చేస్తున్నారనీ, అక్కడే ‘ ఖర-దూషణాదులను’ సంహరించారనీ, రావణుని సోదరి, శూర్పణఖ , అతనిని కామించి, లక్ష్మణుని చేత పరాభవం చెందిందనీ విన్నాను. అగ్ని ---- వేదవతీ ! శూర్పణఖ తన పగ తీర్చ

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన 14

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన 14 ( దృశ్యము 72 ) ( నైమిశారణ్యము ) ( సూత మహర్షి, శౌనకాది మునులు ఉంటారు ) సూత --- శౌనకాది మునులారా ! శుక మహర్షి చెప్పిన విధమున, పుత్ర కామేష్టి యాగము చేసి, నాగలి పట్టి దున్నిన ఆకాశ రాజున కొక పెద్ద మందసము కనిపించెను. ఆ మందసమందు, వికసించిన పహ్ముల మధ్య, పూర్ణ చంద్రుని ధిక్కరించు శరీర కాంతిగల చక్కని పసిపాప కన్పించినది ! ఆ పాపకు పద్మావతి యని నామకరణము చేసి, రాజదంపతులు ఆనందముతో పెంచసాగిరి ! శౌనక --- మహర్షీ ! ఆ ఆకాశరాజునకు పుత్రోదయము ఎట్లయ్యెను ? సూత --- ఆరేళ్ల ప్రాయమున, పద్మావతి తన చిలుక పలుకులతో, “ అమ్మా ! నాకు తమ్ముడు కావాలే ! “ అని అనినంతనే ధరణీదేవి గర్భము ధరించి, వసుధానుడను పుత్రుని బడసినది ! 1 ఋషి --- సూత మహర్షీ ! జనక మహారాజునకు సీత వలె, ఆకాశరాజునకు పద్మావతి లభించడం, యాదృచ్ఛికమా ? లేక ---- 2 ఋషి --- ఆ సీతా - పద్మావతుల మధ్య జన్మ సామ్యములకు, కారణమేదైన కలదా ? సూత --- మంచి ప్రశ్నయే వేసితిరి ! సీతా పద్మావతుల సంబంధము త్

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన—13

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన—13 ( దృశ్యము 68 ) ( స్వామి పుష్కరిణి ) ( విష్ణువు తన నుడుటి మీద గాయాన్ని, నీటితో తుడుచుకొంటూ ఉంటాడు ) ( అతని వెనుక నుండి శ్రీ వరాహ స్వామి వస్తాడు. వచ్చి శ్రీనివాసుని భుజము మీద తన చెయ్యి వేస్తాడు . విష్ణువు అతనిని వెను తిరిగి చూస్తాడు ) వరాహ-- నీ వెవరవు ? విష్ణు -- నేను వైకుంఠ వాసుడను ! వైకుంఠమున నా పేరు విష్ణుమూర్తి ! నా భార్య యగు లక్ష్మి నన్ను వీడిపోవుట వలన ఆమెను వెదకుచు, భూలోకమున అనేక పుణ్యక్షేత్రములు తిరిగి, చివరికు యీ వేంకటాచలమునకు నా తండ్రియగు ‘కశ్యప మహర్షి’ ఆదేశము వలన , వచ్చితిని ! ఇక్కడ నున్న చింతచెట్టు మూలమున నున్న పుట్టలో తపము నాచరించుచున్నాడను ! నా తండ్రి నాకు పెట్టిన పేరు ‘ శ్రీనివాసుడు’ ! ఇంకొక భక్తుడు పెట్టిన పేరు ‘బాలాజి’! స్వామీ మీరెవరు ? వరాహ --- నేనును ఒకప్పుడు వైకుంఠవాసినే ! హిరణ్యాక్షుడను దానవుడు, వర గర్వముచే, అహంకరించి భూమి నంతయు తన బాహు మూలమున బంధించి, సముద్రమున ముంచివేయ ప్రయత

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన—12

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన—12 ( దృశ్యము 57 ) ( చోళరాజు సువీరుని ఉద్యాన వనం ) ( మహారాజు సువీరుడు, రాణితో పాటు కూర్చొని ఉంటాడు. ఇద్దరు రాజభటులు ముందు దారి చూపుతూ ఉండగా లక్ష్మి ఆవు దూడలను తోలుకొంటూ వస్తుంది. లక్ష్మి మహారాజుకి నమస్కరిస్తుంది ) లక్ష్మి -- మహారాజులకు జయమగు గాక ! మహారాణులకు మంగళమగు గాక ! సువీరుడు--- యాదవ వనితా ! లక్ష్మి -- మహారాజా ! నా పేరు రుక్మిణి ! సువీరుడు--- రుక్మిణీ ! నీ గురించి, యీ గోవత్సముల గురించి, మా భటులు చాల విషయాలు చెప్పారు ! అవన్నీ నిజమేనా ? లక్ష్మి --- మహారాజా ! మీ భటులు ఏం చెప్పారో నాకు తెలియదు ! ఈ ఆవు దూడలు మాత్రము సామాన్యమయినవి కావని చెప్పగలను ! రాణి --- రుక్మిణీ ! నీ ఆవు జ్యోతిషం చెప్తుందట కదా ! లక్ష్మి ---- జోస్యం చెప్పదు మహారాణీ ! ధర్మ సందేహాలు తీరుస్తుంది. సువీరుడు--- అవి మాకెలా తెలుస్తాయి ? ఈ గోవు వ్రాసే వ్రాత మేము చదువలేము కదా ! లక్ష్మి --- నుదుటి వ్రాత చదివే దైవజ్ఞులు, యీ గోవు వ్రాతలు చదవగలరు