Skip to main content

Posts

Showing posts from December, 2009

నారి కేళం--'నారీ కేళి' నుండి ఫలించిన ఫలం.

కుబేరుని రాజధాని అయిన అలకాపురిలో రాకుమారుడు నలకుబేరుని మందిరం. ఆ మందిరంలోని శయన కక్ష్యం, అత్యంత సుందరం. ఆ కక్ష్యానికి నలుదిశలా నాలుగు ప్రధాన ద్వారాలు. ద్వారములు. ద్వారబంధములు, తలుపులు.సర్వమూ ,సువర్ణఖచితములు. సుమశోభిత అలంకారాలతో సుసజ్జితములు. గవాక్షములు సరేసరి! వృత్తాకారంలో అలంకరింపబడి, పూలదండలలా కన్పడుతున్నాయి. ఆ ప్రాసాద మధ్యంలో పెద్దపడవలాంటి పందిరిమంచం, వాటి పైన స్వర్ణకాంతులీనే పట్టు ఆవరణముల మధ్య మృదువైన హంసతూలికా తల్పము, దిండ్లు అమర్చబడి ఉన్నాయి. పారిజాత, సౌగంధికా పుష్పసౌరభాలు ఆ ప్రదేశాన్నంతా ఆవరించి మత్తు గొలుపుతున్నాయి. పర్యంకము పైన నలకుబేరుడు కూర్చొని ఉన్నాడు.ఇంద్రునితో, చంద్రునితో,మన్మధునితో సరి తూగే సుందర యువకుడతడు. సాక్షాత్తు రంభయే భార్యయైనను, అతడు నిత్యనూతన యక్షిణీ కాంతల పరిష్వంగమూ కోరువాడు. రాజ్యము అతనిది, యక్షులు అతని పరిపాలిత ప్రజలు. సుందరులైన యక్షిణీ కాంతలు కనుసన్నలలో మెలగువారు. అదుపాజ్ఞలు వర్తించని, సర్వస్వతంత్ర సుందర మధుకరుడయిన అతనికి, సౌందర్య సుమ నివాళులిచ్చే స్త్రీలకు

భాగ్య తంత్రం - 1

భాగ్య తంత్రం అంటే భాగ్యాన్ని మార్చుకోవడానికి చేసే ఒక త్రాంత్రిక క్రియ. తంత్రం అంటే ఏవేవో క్షుద్ర పూజలు, బలులు అనుకోకండి. నేను చెప్పేది చాలా సులువైన ప్రక్రియే, కాదు చాల తక్కువ ఖర్చుతో చేయగలిగే క్రియ! ఇలాంటి తంత్రాలు చాల నిరపాయకరమైనవే కాక ఎంతో సులభమైనవి కూడ! వాటిలో ఒకటి నేను ఆచరించి లబ్ధి పొందినదే కాక ఇతరులతో చేయించి బాగుందనే ప్రశంశలు పొందింది, దీని పేరు నవగ్రహ కలశ స్థాపనా తంత్రం! కావలసిన సామగ్రి_ చంద్రుని కోసం ఒక జత వేండితో చేయంచిన నాగుపాములు. వీటిని చాల చిన్నవిగా ఒక సెంటీమీటరు సైజులో చేయిస్తే చాలు. వెండి వైరుతో ఒక దానితో ఒకటి పెనవేసుకొన్నట్లు చేయిస్తే చాలు. కుజుని కోసం నవ రంధ్రాలు గల రాగి రేకు. కేవలం ఒక స్క్వేరు ఇంచి సైజు రాగి రేకు చాలు. ఆ రేకు మీద తొమ్మిది కన్నాలు పొధిపిస్తే చాలు. బుధుని కోసం అయిదు గవ్వలు కొద్దిగా పసుపు రంగులో ఉన్నవయితే మంచిది. గురుని కోసం మూడు ఇత్తడితో చేయించిన త్రిభుజాకారపు రేకులు చిన్న ఇత్తడి రేకుతో చేయించవచ్చు. ఒక సెంటీమీటరు సైజు చాలు. శుక్రుని కోసం ఆ

ఖర్జూరం - శృంగారానికి సరియైన నిర్వచనం

ప్రభవ నామ సంవత్సరం.( క్రీస్తు పూర్వం—907 ) రాత్రి రెండవ ఝాము ముగిసింనే దానికి సంకేతంగా---- గొల్లకావిడి, పడమట వాలింది. సప్తర్షి మండలం నభో మధ్యానికి చేరుకుంది. పూర్ణ చంద్రుడు జేగీయ మానంగా తన శీతల కిరణాలను వెదజల్లుతున్నాడు. ఆకాశం,నిర్మలమైన నక్షత్రకాంతులతో చూడ ముచ్చటగా ఉంది. ఆరాత్రి! “వైశాఖ పూర్ణమి! భారత దేశపు వజ్రాల గని అయిన, “పన్నా” కి చేరువగా నున్న ప్రదేశంలో, నలువైపులా వృక్ష పరివేష్టితమైన, విశాలమైన సరోవరంలో____ విశ్వమానవ జనావళికి, శృంగార రస భరిత సందేశాన్ని ఇవ్వడానికా! అన్నట్లు- ఒక చరిత్రాత్మిక ఘటన ప్రాదుర్భవించింది. అదే! “హేమావతీ—సోమదేవుల” కలయిక!! *********************************************************************************************************** హేమావతి అపురూప సౌందర్యవతి. స్దిరయై భూమిపై సంచరించే విద్యుల్లత ప్రాణాలతో వెలసిన బంగారు బొమ్మ! బంగారానికి కాఠిన్యమనే దుర్గుణం ఉంది. ఈ కొత్త బంగారం అత్యంత సుకుమారం. ఆమెనే గాని శశాంకుడు ఒకసారి ఆలోకించే పక్షంలో రోహిణీ కాంతపై శీత కన్ను వేయక మాన

కదళి

అతడు.ఈశ్వరాంశ సంభూతుడు. అతని పుట్టుక , తనకి మృత్యువు అని తెలిసిన ఒక రాక్షసైడు మాతృగర్భంలోఉండగానే , తల్లిని బంధిస్తే, వారం రోజులలోనే గర్భం నుండి బయటపడి, తన తేజంతో ఆ రాక్షసుని భస్మీపటలం చేసిన అపర రుద్రుడు! దత్తాత్రేయునికి తమ్ముడు.! అత్రి అనసూయల పుత్రుడు ۔ అతని పేరు “దూర్వాసుడు”. పుట్టుక తోనే కోపిష్టి.! అతని మనస్సు ఆ రోజు అతలాకుతలంగాఉంది. “బధరిలో’ అలకనందని దాటి, గోవిందఘట్టం వైపు,ఉన్మత్తుడిలా అడుగులు వేస్తు న్నాడతను, తనకి తొలిసారి కనిపించిన ఋషి కన్యని వివాహమాడి గార్హ్యస్ద్య జీవితాన్ని ప్రారంభించడానికి!! కఠోరతపాన్ని విడిఃచి పెట్టి , అతనలా కన్యకాన్వేషణలో పడడానికి ప్రబల కారణాలున్నాయి. వాటిలో మొదటిది “వపువ” సౌందర్యం.! అతని తపోభంగం కలిగించి, అప్సరసల లోతన ఆధిక్యతని నిరూపించుకోవాలనే పట్టుదలతో, అతని మనసుని రాగరంజితం చేయాలని తలచిందామె! కోపంతో పక్షివి కమ్మని శపించినా, ఆమె రూపం మాత్రం అతని మనసులో ముద్రించుకుపోయింది. అందుకే కాస్త మెత్తబఢి, ఆమె శాపవిమోచనాన్నిఅర్దించిన మీదట “ అంద చందాలు అవివేకులనే ఆకర్షిస్తాయి. నీవు నీ

భావజాలానికి స్వాగతం...

“క్షీర గంగ” అనే శీర్షిక పెట్టి , దాని క్రిందన “”విరిసిన హరి విల్లు” అని ప్రశీర్షిక పెట్టడం ఏమైనా బాగుందా ఆనే సందేహం రావచ్చు! దానికి నా సమాధానం ఏమిటంటే---“కామధేనువు” అనేది, ఈ సమాజం లోని 97 శాతం ప్రజలకు ప్రతినిధి అయితే తక్కిన 3శాతం ఎవరు? అన్న ప్రశ్న సహజంగానే వస్తుంది. దానికి ఈ క్రింది విధంగా వివరించ వచ్చు.  పాడినిచ్చే స్తన్య జీవులు  ఇంధ్రియ సుఖాన్నిచ్చే వేశ్యలూ:  పంట పండించే వ్యవసాయ శ్రామికులూ  తదితర జీవితావసర వస్తువుల్ని ఉత్పత్తిచేసే కార్మికులూ  జనాభాలో నూటికి 97శాతం మంది అందరూ పశువులే!11  ఈ పశువు లన్నిటి సమిష్టి రూపమే “కామ ధేనువు!!!  సమాజంలో మిగిలిన ముగ్గురూ పశుపతులు: ధన పతులూ: ఉద్యోగ పతులు ఋషులయిన నాడే----  కర్మాగారాలు ఆశ్రమ వాటికలవుతాయి. శ్రమ యజ్ఞమయి పవిత్రత సంతరించుకుంటుంది. అది సాధ్యమా! అసాధ్యమయితే ఏం చేయాలి అన్న ప్రశ్నకు ఈ పశువులేం చేయాలి? అన్న ప్రశ్నకు కూడా ------ “”విరిసిన హరి విల్లు “” లాంటి ఈ ప్రపంచంలో స్పందించే ప్రతీ హృదయమూ ఇచ్చే నివాళే