Skip to main content

Posts

Showing posts from January, 2013

మొసలి కొలను మ్యూజియం(హాస్య్ రోమాంచ దైనందిన ధారావాహిక----32)

(నిన్నటి టపాలో జరిగిన కథ--- మ్యూజియం లోని బొమ్మల అసలు దోంగను పట్టించింది, కావలసిన సాక్ష్యాలు ప్రోగు చేసి తనకి సహకరించినదీ, దానయ్యేనని గ్రహించిన గోపాల్రావు దానయ్య దగ్గరకు వెళ్లి ,ఆ పని చేసినందుకు అతనికి గల లాభమేమిటని ప్రశ్నిస్తాడు. కాని దానయ్య సరిగా జవాబివ్వడు ఏవేవో మాట్లాడుతాడు, దాన్తో టూ.నాట్ త్రీకి అనుమానం వచ్చి, దానయ్య శరీరంలో ఏదో ఆత్మ ప్రవేశించిందని, అదంతా ఆత్మ పలుకేలేనని, ఆత్మతో మాట్లాడించేందుకు , తులశీ దళాలు, మర్రి చిగుళ్లు, వేప మందలూ పట్టుకొచ్చి, మహంకాళి దండకం చదువుతూ, దానయ్యని వేప మందలతో కొట్టి నిజం చెప్పమంటాడు. ఆత్మ తాను ధనంజయ నాయకుణ్నని చెప్తుంది---ఇక చదవండి) మొసలి కొలని మ్యూజియం--32 “ దానయ్య జవాబు విని , ఇనస్పెక్టరు  ఆశ్చర్యంతో  అతని వంక  చూస్తాడు, “ ఏమిటీ ! నువ్వు  ధనంజయ నాయకుడివా !” “ అవును, నేనే !” “ మ్యూజియం లోని బొమ్మలను చేసిన ప్రోలయ వేముని  కాలం నాటి  ధనంజయ నాయకుడివా నువ్వు ?”  గోపాల్రావు  ప్రశ్నిస్తాడు, కాని దానయ్య  మాట్లాడడు. టు నాట్ త్రీ  కల్పించుకొని  “ ఏయ్ ! చెప్పు, అడిగిందానికి  చెప్పు, చెప్పక  పోతే  తప్పదు  ముప్పు” అంటూ  వేప మండలతో కొడతాడు. “ అబ్బ ! మర్దించకు ,

మొసలి కొలను మ్యూజియం(హాస్య రోమాంచ దైనందిన ధారావాహిక---31)

(నిన్నటి పోస్టులో జరిగిన కథ----కంసాలి లచ్చన్న స్టేట్’మెంట్ ప్రకారం, మ్యూజియం లోని పంచముఖి ఆంజనేయుని బొమ్మకి నకలు తీసిన వాడు దానయ్యేనని తెలుసుకొంటాడు ఇనస్పెక్టర్. అంతే కాదు ఆ బొమ్మను వాట్సన్ దొరకి చూపించి దానిని అలాంటివి ఇంకా చాలా నకళ్లు చేయగలనని చెప్పమంటాడు. వాట్సన్ దొర ఆ బొమ్మకి డబ్బులు ఇచ్చి కొంటాడు. అతనిచ్చిన నోటూని చూపిస్తాడు లచ్చన్న . ఆ నోటూ, మ్యూజియంలో ఎంకన్న గాయపడి పడిపోయిన చోట కనిపించిన నోట్లు, దానయ్య చొక్కా జేబులో దొరికిన నోట్లు అన్నీ ఒకే బండిల్ లోని నోట్లని గోపాల్రావు గ్రహిస్తాడు. దానయ్య అంతా పథకం ప్రకారం చేస్తున్నాడనీ తెలుసుకొంటాడు.---- ఇక చదవండి) మొసలి కొలను మ్యూజియం--31 “ దానయ్యా !” అని  పిలుస్తాడు,  ఇనస్పెక్టరు.  దానయ్య  లేచి కూర్చొంటాడు. “ దానయ్యా ! నీకో  గుడ్ న్యూస్ !  బొమ్మలు  వాట్సన్ దొర, గోవాలో  దొరికి  పోయాడు. నువ్వు  కంసాలి  లచ్చన్న  చేత  పంపిన  ఫొటోలు ,లచ్చన్న చెప్పిన సాక్ష్యం  , ఇంకా  గంగ, వీరన్నల  సాక్ష్యాలు  అతని నేరాన్ని  ఋజువు  చేస్తున్నాయి.కేసు  టర్నంగు  పాయింటు  ఇలా  ఉంటుందని  నను  ఊహించ  లేదు. ” “ అయితే  నన్నింక  ఇడిసి  పెట్టేస్తారేంటండి ?” “ అవును, ఈ  క్

మొసలి కొలను మ్యూజియం( హాస్య రోమాంచ దైనందిన ధారావాహిక---30)

(నిన్నటి టపాలో జరిగిన కథ--- ఇన్స్పెక్టర్ గోపాల్రావు దానయ్యను లాకప్పులోనే ప్రశ్నిసాడు. దానయ్య ఏవేవో సమాధానాలు చెప్తాడు. దానయ్య ఎవరో , ఆ బొమ్మల పట్ల అతనికి గల ఇంతరెస్టు ఏమిటో గోపాల్రావుకి అంతు పట్టదు. దాంతో దానయ్యను వదలి ,కంసాలి లచ్చన్నని ప్రశ్నించడం మొదలు పెడతాడు--- ఇక చదవండి) మొసలి కొలను మ్యూజియం--30 “ టు నాట్ త్రీ ! ఒక  శుభవార్త ! మ్యూజియంలో  దొంగలించిన  బొమ్మలు , గోవాలో, ‘ వాట్సన్ దొర’  పర్సనల్  లగేజిలో  అంటే , రిఫ్రిజిరేటర్లో , షిప్పు ఎక్కుతూ  పట్టుబడ్డాయి.కస్టం వాళ్లు పట్టుకొన్నారు, అసలు దొంగ --- ” “ ఆ దొరేనండి !” “ రామా  రామ ! అనకుండా  టు నాట్ త్రీయేనా  ఆ మాటలన్నది ! అని  ఆశ్చర్య  పోతూ, ఆ మాటలు  వినబడిన  వైపు  చూసాడు  ఇనస్పెక్టర్ , అవి  కంసాలి  లచ్చన్న  అన్న  మాటలని  గ్రహించి , ఆశ్చర్యంతో,  అతని  వైపు  దృష్టి  నిలిపి, “ ఎవరు  నువ్వు, నీ కెలా  తెలుసు ?” అని  అడిగాడు. “ నేను  మా  ఊరి  కంసాలినండి !  పేరు  లక్ష్మణాచారి, అండి. అందరూ  లచ్చన్న  అంటారండి.” “ రామా  రామ ! లచ్చన్నా, నువ్వు  ఏ ఊరి  కంసాలివి ?” “ మా ఊరి  కంసాలినండి.” “ రామా  రామ ! మీ  ఊరి  పేరు  మా ఊరా ?” “ కాదండి, మొసలి  కొల

మొసలి కొలను మ్యూజియం(హాస్య రోమాంచ ధారావాహిక---29)

(నిన్నటి టపాలో జరిగిన కథ---- పినాక పాణి ఈ-మెయిల్ ద్వారా, ఇనస్పెక్టర్ గోపాల్రావుకి ఇంద్రనీల్, తులజల ప్రేమ గాధ తెలుస్తుంది. ఇద్దరి కిద్దరూ మొసలి కొలను వచ్చారనీ, మ్యూజియంలో దొంగతనం జరిగాక వారిలో ఎవరికీ కనబడకుండా పోయారనీ తెలుస్తుంది.  ఆస్పత్రిలో కోలుకొన్న తులజ స్టేట్ మెంట్ ఇస్తుంది. ఇంద్రనీల్ కోసం ఆ ఊరు వచ్చిన తనని వాట్సన్ చూసాడనీ, తను హై క్లాస్ కాల్ గర్ల్ కావడం వల్ల తన సెవలు ఉపయోగించుకోవడనికి తన భవనం లోకి తీసుకొని వెల్లాడని, అక్కడ సుందరం, చిదంబరంల కోర్కె తీర్చమని చెప్పాడనీ అంది. వాళ్లు తనని బంధించి, చిత్రహింసలు పెట్టారనీ, చివరికి తన కారులోనే స్పృహ తప్పించి తీసుకెళ్లారని చెప్తుంది. పట్టుబడిన సుందరం చిదంబరంలు తాము మ్యూజియంలో బొమ్మల దొంగతనం వాట్సన్ దొర చెప్పడం వల్ల చెసామని, ఆ బొమ్మల కోసమే వాచ్ మెన్ ఎంకన్నను గాత పరచామని ఒప్పుకొంటారు. తలజను ఆ దొరే  కొన్నాళ్లు వాడుకోమన్నాడనీ, చివరకి కొంత డబ్బు ఇచ్చి ఆమె కారులోన్ పారిపోమన్నాడనీ చెప్తారు. ఈ లోగా రిఫ్రిజరేటర్లో దాచి షిఫ్ మెంట్ చెసిన బొమ్మలు ఆఖరి నిముషంలో పట్టుబడ్డాయని వార్త తెలుస్తుంది.కంసాలి లచ్చన్నని కానిస్టేబిల్ టూ.నాట్.త్రీ తీసుకొని వస్తాడు--

మొసలి కొలను మ్యూజియం(హాస్య రోమాంచ దైనందిన ధారావాహిక---28)

(నిన్నటి టపాలో జరిగిన కథ---- తేజా దగ్గరా టాన్స్’మిషన్ సిస్టంని , మురుగన చేత దొంగతనం చేయిస్త్తాడు ఇనస్పెక్టర్ గోపాల్రావు ,దానిని కొనేందుకు మరో దారి లేక ! తరువాత తేజా దగ్గర కంప్లైంటు తీసుకొంటాడు. ఆ తరువాత తిరుగు దారిలో వాళ్లు, ఇద్దరు దుండగులు కారులోంచి ఒక యువతి శరీరాన్ని బయట పడేయడం చూస్తారు. గోపాల్రావు ఆ యువతిని ఆస్పత్రికి చేరుస్తాడు. ఆ కారుని తరువాతి చౌకీలో ఆపి, అందు లోని దుండగులని అరెస్ట్ చేయమని చెప్తాడు. మురుగన్ ద్వారా ట్రాన్స్ మిషన్ సిస్టమ్ని ,వీరన్నకి పంపిస్తాడు--- ఇక చదవండి ) మొసలి కొలను మ్యూజియం---28     “ ఆ అమ్మాయి  కారులో  వచ్చి, ఆ అమ్మాయినే  కొట్టి  బయటికి  విసిరేసారా  రాక్షసులు ! మీరు వాళ్లని లాకప్పు  లోనే  ఉంచండి.”     “ అలాగే  సార్ ! గుడ్ నైట్ !”     “ గుడ్ నైట్ !” అంటూ ఫోను ఆఫ్ చేసాడు  గోపాల్రావు.ఆ సంభాషణ వినిపించాలనే ఆలోచనతోనే, లౌడు స్పీకరు ఆన్ చేయడం వలన ప్రియంవద అంతా విని “ఎవరండీ ఆ అమ్మాయి ?” అని  అడిగింది.     “ తెలియదు, ఆమె ఇంకా అపస్మారక  స్థితిలోనే ఉంది. డ్రగ్సు ఇచ్చి ఉంటారు ! ఆ పైన అత్యాచారం   కూడా చేసి ఉంటారు. తెలివి  వస్తేనే గాని  పూర్తి వివరాలు తెలియవు”.     “ తుల

మొసలి కొలను మ్యూజియం (హాస్య రోమాంచ దైనందిన ధారావాహిక--27)

(నిన్నటి టపాలో జరిగిన కథ--- వీరన్నతో ట్రాన్స్’మిషన్ సిస్టం తెచ్చి ఇస్తానని చెప్పిన ఇన్స్పెక్టర్ గోపాల్రావు దాని కోసం చిత్తూరు లోని ‘మోటరోలా’ కంపెనీ అసిస్టెంటు మేనేజరు, తన స్నేహితుడు అయిన ‘తేజాకి’ ఫోన్ చేస్తాడు. తేజా తాను అరగంట క్రితమే ఒక సిస్టంని ‘వాట్సన్’ దొరకి అమ్మానని, మరొకటి తనతోనే ఉందనీ, తాని మైన్ రోడ్డు మీదనే ఉన్ననని, అక్కడే ఆగి నిరీక్షిస్తానని చెప్తాడు, ఇనస్పెక్టర్ , మురుగన్’తో పాటు జీపులో వెళ్లి, తేజాని కలుస్తాడు. ఆ ట్రేన్స్ మిషన్ సిస్టంని కొనడానికి, నిబంధనలు అడ్డు వస్తాయని అంటాడు.--- ఇక చదవండి) మొసలి కొలను మ్యూజియం----27 “ నాకు ఈ గవర్నమెంటు  ఆర్డర్ల  సంగతి  తెలుసు. నీ లెవల్లో దీన్ని కొనడం  జరగదని కూడా తెలుసు. అందుకని  దీన్నిఅప్పుగా ఇస్తాను. పని అయిపోగానే  వెంటనే  తిరిగి ఇస్తే  చాలు.”. “ లేదు, అలాగ  తీసుకోవడం  కూడా రూల్సుకి విరుధ్ధమే ! అందుకు  ఒక  ఉపాయం ఉంది,” అన్నాడు గోపాల్రావు. “ ఏమిటది ?” అని తేజా  అడుగుతూ  ఉండగానే, ఇనస్పెక్టర్  సైగని అర్థం  చేసుకొన్న మురుగన్ , తేజా  చేతిలోని ‘కిట్’ని బలవంతంగా లాగుకొని , రోడ్డు దిగి  పొదల  మాటుకి  పరుగెత్తాడు. “ ఏమిటిది, ఏం జరుగుతోంది ?” “

మొసలి కొలను మ్యూజియం( హాస్య రోమాంచ దైనందిన ధారావాహిక---26)

(నిన్నటి టపాలో జరిగిన కథ--- ఇనస్పెక్టర్ గోపాల్రావు ఇంట్లో అత్ను, ప్రియంవద, మురుగన్, వీరన్న ఇంకా గంగ సమావేశ మవుతారు. వాట్సన్ దొర స్పెషల్ వర్క్ ఆర్డర్ ద్వారా ఒక రిఫ్రిజిరేటర్ బాడీని తమ వర్క్ షాపులో తయారు చేయమన్నాడనీ, అయితే అది సాధారణ ఫ్రిజ్ కాదనీ, అలా కనబడే రహస్యమైన అల్మైరా అనీ, దాన్లో బేటరీతో నడిచే ఒక ట్రేన్ష్ మిషన్ సిస్టంని , అమర్చమన్నాడనీ తాను ఆ పనిలోనే ఉన్నాడనీ ,వీరన్న చెప్తాడు. ఆ అరేంజ్ మెంట్ బొమ్మలని స్మగ్లింగ్ చేయడానికేనని గోపాల్రావు అనుమానిస్తాడు. తాను మరొక ట్రేన్స్ మిషన్ సిస్టంని తెచ్చి ఇస్తానని, దానిని కూడా వారెవర్కీ తెలియకుండా, అమర్చమని అంటాడు ఇనస్పెక్టరు. దానిని ఆ రోజు రాత్రికే తెచ్చి ఇమ్మంటాడు వీరన్న ---- ఇక చదవండి) మొసలి కొలని మ్యూజియం--- 26 “ చేస్తాను బాబూ ! కాని  మీరు ఇస్తానన్న ట్రాన్సిమిషన్  సిస్టంని  నాకు  ఈ రాత్రికే అంద జేయాలి. ఎందుకంటే  ఆ బాడీని రేపే డెలివరీ  చేయాలి. అంతేకాదు  బాబూ ---” అంటూ  నసిగాడు వీరన్న. “ చెప్పు వీరన్నా , ఇంకా  ఏం కావాలి ?” “ ఈ  పని అయ్యాక, నేను  మళ్లీ  అక్కడ  పని చేయలేను  బాబూ !  నా  ఉద్యోగం --- ” “ నీకా భయం అక్కర లేదు. రమేష్ చంద్ర గారితో, నేను
మొసలి కొలను మ్యూజియం(హాస్య రోమాంచ దైనందిన ధారావాహిక--25) (నిన్నటి టపాలో జరిగిన కథ ---- బాడీ ఫేక్టరీ గురించి పినాక పాణి పంపిన ఈ-మెయిల్ చదివిన గోపాల్రావు, తన ఇంట్లో పని చేసే, ఆ ఫేక్టరీ వర్కర్ భార్య , ‘గంగ’ గురించి వాకబు చేస్తాడు. అతని భార్య ప్రియంవద గంగ ఆ రోజు నుండే పని మానేసిందనీ, ఆమెకి మ్యూజియంలో పని దొరికిందనీ, చెప్తుంది. అయినా గంగను రప్పించి మాట్లాడే ఏర్పాటు చేస్తానంటుంది.గోపాల్రావు గంగతో పాటు ఆమె భర్త వీరన్ననీ పిలిపించమనీ, అతనికి మరొక మంచి చోట ఉద్యోగం ఇప్పించ గలననీ, అంటాడు. ఈ -మెయిల్’లో సూచుంచున ప్రకారం , ఆ బాడీ ఫేక్టరీ లోనే , మ్యూజియం నుండి దొంగలించిన బొమ్మలు ఉండ వచ్చనీ, వీరన్న సాక్ష్యం చాలా ప్రాముఖ్యమయినదనీ అంటాడు.--- ఇక చదవండి) మొసలి కొలను మ్యూజియం--- 25  ఇనస్పెక్టర్  ఇంట్లో  అయిదుగురి  సమావేశం  ఏర్పాటయంది. గోపాల్రావు , ప్రియంవద, వీరన్న , గంగలతో పాటు ‘మురుగన్’ కూడా ఆ సమావేశానికి హాజరయ్యాడు. వీరన్నతో భవిష్యత్తులో జరగబోయే  సమావేశాలకి, సంప్రదింపులకీ, మురుగన్ సహకారం ఉంటే బాగుంటందని, తనంత తానుగా వెళ్లి  పిలుస్తే,  సత్యం ధర్మాలకి  సందేహం  కలుగ  వచ్చనీ  భావించిన  గోపాల్రావు, మురుగన్ ని

మొసలి కొలను మ్యూజియం(హాస్య రోమాంచ దైనందిన ధారావాహిక---24)

(నిన్నటి టపాలో జరిగిన కథ--- సత్యనారాయణ, ధర్మారావు, న్యాయధనీ మెహరోత్రా అనే ముగ్గురు, ఒక ఫోర్’వ్హీలర్ బాడీ ఫేక్టరీని పెడతారు. అక్కడ నాలుగు చక్రాల బాడీలే కాక, ఆర్డర్లని బట్టి ఏ బాడీలైనా తయారవుతాయి. అందులో పనిచేసే కార్మికుల పరిస్థితి చాల దయనీయంగా ఉంటుంది. వారిని, బ్రాకెట్ ఆటలకీ, త్రాగుడు వ్యసనానికీ బానిసలని చేసి, తమ పబ్బం గడుపుకొంటూ ఉంటారు యజమానులు --- ఇక చదవండి) మొసలి కొలను మ్యూజియం --- 24 ఇక సత్యనారాయణ విషయం, అతడు ఆ బాడీ షాపుకి మేనేజరు. వర్క్ ఆర్డర్లు తీసుకోవడం, దాన్ని  పనివాళ్లకి  అప్పజెప్పి, మెటీరియల్  తెప్పించి, ఒప్పుకొన్న  దానికన్న  ముందుగానే  సప్లయి చేయడం  అతని స్పెషాలిటీ !   అవసరమయితే  ఓవర్  టైము  అదీ  కాకపోతే  నైటు  షిఫ్టు  చేయించి  పని  పూర్తి  చేయించగల చాకచక్యం అతని సొంతం ! ధర్మారావు  అస్త్రాల వల్ల  నిరుపేదలుగా, వ్యసన పరులుగా  వ్యర్థులుగా  మారిన  కూలీ  జనాలని  సత్యనారాయణ, ఓవర్  టైం  అనే  చిన్న  బిస్కెట్టు  ముక్క  తినిపించి, వారిని కట్టు బానిసలుగా  తయారు  చేసి, వారి శ్రమ శక్తిని  దాదాపు  ఉచితంగా దోచుకొనే వాడు. ఈ  విధంగా  న్యాయం, ధర్మం, సత్యం  మూకుమ్మడిగా, దోపిడీ  వ్యవస్థని  పటిష

మొసలి కొలను మ్యూజియం ( హాస్య రోమాంచ దైనందిన ధారావాహిక---23)

(నిన్నటి టపాలో జరిగిన కథ--- ఇనస్పెక్టర్ గోపాల్రావు , కరీం ఖాన్’కీ వాట్సన్’కీ మధ్య సంబంధాలు ఉన్నాయని గ్రహిస్తాడు. మురుగన్’ని బయటకి మ్యూజిఅయం ఆవరణ లోకి పంపై కరీంని మాటలలో దింపుతాడు. మురుగన్ ఎంకన్న రక్తంతో తడిసిన రబ్బరు మేట్’ని బయట కనిపెట్టి, దానిని జీపులో పడేసి,  హారన్ కొడతాడు. ఆ హారన్’ సంకేతాన్ని అర్థం చేసుకొన్న గోపాల్రావు. తాను కూడా వచ్చి జీపులో కూర్చొంటాడు---ఇక చదవండి) మొసలి కొలను మ్యూజియం--23 ‘సత్యనారాయణ ’, ‘ధర్మారావు ’, ‘ న్యాయధనీ మెహరోత్రా’ ఈ  ముగ్గురూ  కలిసి,ఒక ‘  ఫోర్  వ్హీలర్  బాడీ  ఫేక్టరీని ’ పెట్టారు. వారిద్దరిలో  న్యాయధనీ  మెహరోత్రా  గుజరాతీ , ఆ  ఫేక్టరీకి  ఫౌండర్  పార్టనర్ . ఆ  ఫేక్టరీలో  యాభైఅయిదు  శాతం  పెట్టుబడి  పెట్టినవాడు. ధర్మారావుకి ఇరవై అయిదు శాతం, సత్యనారాయణకి  ఇరవై  శాతం  వాటా  ఆ  ఫేక్టరీలో ఉన్నాయి. పేరుకి  అది ,‘ఫోర్  వ్హీలర్  బాడీ  ఫేక్టరీ ’ అయినా  అక్కడ  అన్ని ‘ బాడీలు ’ తయారవుతాయి . అలమారాల  బాడీలు, రిఫ్రిజరేటర్ల బాడీలు , వాషింగు మిషిన్ల  బాడీలు , రకరకాల ట్రంకు పెట్టెల బాడీలు ఇంకా ఆర్డర్లని బట్టి అనేక టైలరు మేడ్ బాడీలు కూడా  అక్కడ  తయారవుతాయి టౌను  చివర  మూడ