బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన—11
( దృశ్యము 50 )
( వేంకటాచలము )
( రంగదాసు ఒక బావి తవ్వుతూ ఉంటాడు. ప్రవేశం వైఖానస ఋషి )
వైఖానస-- రంగదాసూ ! ఏం చేస్తున్నావు ?
రంగ -- ( చెమట తుడుచుకొంటూ ) బావి తవ్వుతున్నానండీ !
వైఖానస -- ఈ కొండమీద ఎన్నో సెలయేర్లు ఉండగా, యీ బావి దేనికయ్యా ?
రంగ -- నిజమేనండి ! అవన్నీ దిగువగా చాల దూరంలో ఉన్నాయండి. స్వామి పూజకని, ఇక్కడే పూల తోట వేశాను కదండి, కుండలతో నీళ్లు తెచ్చి, పొయ్యడం చాల కష్టంగా ఉందండి. అందుకని ఇక్కడే బావి తవ్వుతున్నానండి.
వైఖానస-- అదా విషయం ! స్వామివారి కైంకర్యానికే బావి తవ్వుతున్నా వన్నమాట ! మంచిదే, అలాగే కానియ్యి ! ( అని వెళ్లిపోతాడు )
( రంగదాసు నిష్ఠతో అలా తవ్వుతూనే ఉంటాడు. అలసినప్పుడల్లా, --)
రంగ --- వేంకటేశా ! గోవిందా ! ( అని సేద తీరుతూ ఉంటాడు )
*******************
( దృశ్యము 51 )
( వేంకటాచలం )
( స్వామి పుట్టకు కొంత దూరంలో, రంగదాసు, మరో ముగ్గురు కూలీలతో, ఆ పుట్టకి నాలుగు ప్రక్కలా గోడ కట్టే ప్రయత్నం చేస్తూ ఉంటాడు )
( ప్రవేశం వైఖానసుడు )
వైఖానస-- రంగదాసూ, ఏం చేస్తున్నావు ?
రంగ-- గోడ కట్టిస్తున్నానండి. అందుకని రాళ్లు పేరుస్తున్నాను.
వైఖానస-- ఇదంతా ఎందుకు రంగదాసూ ?
రంగ --- వానలు పడితే పుట్ట తడిసిపోదా అయ్యవారూ ! ఇప్పుడు నాలుగు వైపులా మూడడుగుల గోడైనా కడితే, తరువాత కర్రదుంగలతో, పైకప్పు వేసి గుడిశె వేయవచ్చు.
వైఖానస-- రంగదాసూ యీ పనులన్నీ చేయడం వల్ల స్వామి వారి తపస్సుకు అంతరాయం కలుగుతుందేమో !
రంగ --- సద్దు లేకుండా, పని చేయిస్తాను.
వైఖానస--- సరే ! ఈ పనిలో పడి, స్వామి పూజకు, పువ్వులు, తులసి దళాలు తేవడం మరువకు.
రంగ -- అలాగేనండి !
*******************
( దృశ్యము 52 )
( వేంకటాచలం లోని ఒక లోయ.! ఎగువున ఉన్న పూల తోటలో రంగదాసు పూలు కోస్తూ ఉంటాడు )
( ఆ లోయలోపల ఒక యక్షిణీకాంత నిల్చొని, తన ప్రియున్ని పిలుస్తూ ఉంటుంది. ఆమె పేరు క్షీరార్ణవ యక్షిణి )
క్షీరార్ణవ--- ప్రియా, నలకుబేరా ! ఇటు, ఇటు---( అని బిగ్గరగా పిలుస్తుంది )
( నలకుబేరుడు ఆమె వెనక నుండి, చప్పుడు చెయ్యకుండా వచ్చి, ఆమె కళ్లు మూస్తాడు . ఆమె అతని చేతుల పైన తన చేతులు వేసి, క్రిందకు లాగుతుంది. అతడు ఆమె మెడలో తన చేతులు హారంలాగ వేస్తాడు. క్షీరార్ణవ కోపం తెచ్చుకొంటూ-- )
క్షీరార్ణవ--- ఏమిటిది ప్రియా ! నా వెనకనే ఉండి, నన్ను ఎలుగెత్తి పిలిచేలాగ చేస్తున్నారు.
నలకుబేర-- ప్రియా ! అలా పిలిచేటప్పుడు, నీ గళంలోని నరాలు, బిగుసుకొని, వాటిలోంచి, క్షీరధారలు ఉబికి, నీ పేరు ‘ క్షీరార్ణవ’ అని చెప్పక చెప్తున్నాయి, తెలుసా !
( క్షీరార్ణవ అతని చేతులు విఢిపించుకొని, గోముగా అలుగుతుంది )
క్షీరార్ణవ--- ఏమంటిరి ప్రియా ! నా గళసీమలోని నరాలలో పాలు ప్రవహిస్తున్నాయా ? ఏమి హేళన !—
నలకుబేర-- హేళన కాదు ప్రియా ! ప్రియావలోకన !! నీ నరాలలో పాలు, నీ బుగ్గలలో పాలు, అంతెందుకు, నీ శరీరమంతా పాలు--- అందుకే నీ పేరు సార్థకం అయిందని అంటున్నాను.
( క్షీరార్ణవ సిగ్గు పడి దూరంగా పారిపోతుంది. నలకుబేరుడు ఆమె చెయ్యి పట్టుకొంటాడు )
క్షీరార్ణవ--- అబ్బ ! కాస్త మృదువుగా పట్థుకోండి !
నలకుబేర—ఒడిసి పట్టకుంటే, నువ్వు పాలనురుగులా జారిపోతావేమో !!
క్షీరార్ణవ-- మీ చేతికి చిక్కాక, జారిపోవధమూ, పారిపోవడమూ కాదు---
నలకుబేర-- మరి !---
క్షీరార్ణవ-- కలిసిపోతాను !
( ఇద్దరూ ఆనందంగా నవ్వుకుంటూ ఉంటారు )
( రంగదాసు చేస్తున్న పని మరచిపోయి ఆ జంటవైపు చూస్తూ ఉండిపోతాడు )
******************
( దృశ్యము 53 )
( స్వామి పుట్ట )
( వైఖానసుడు స్వామికి ఎదురుగా కూర్చొని, అతనికి పూజ చేస్తూ ఉంటాడు )
వైఖానస--- వన మధ్యే, తరోర్మూలే/ స్వామి పుష్కరిణీ తటే.
తిష్టంతం పుండరీకాక్షం, శ్రీ భూమి రహితం హరిం—
చించా వృక్షస్య మూలేతు / ప్రాదురాసీ జనార్దనః
తింత్రిణీ వృక్ష మూలస్థం / వల్మీకం పరం హరిం---
( పూల కోసం వైఖానసుడు బుట్టలో చెయ్యి పెడితే, అది ఖాళీగా ఉంటుంది . వైఖానసుడు పూల బుట్టను చూస్తాడు. పూజ ఆపి,--- )
( స్వామి తపస్సులోకి జారుకొంటారు. అలా తపస్సులోకి వెళ్లిపోయిన స్వామిని చూసి, వైఖానసుడు నిరుత్సాహ పడతాడు )
వైఖానస--- (తనలో ) పూలు తేకుండా, ఈ రంగదాసుడు ఏం చేస్తున్నట్లు !--- మళ్లీ ఏ నుయ్యో, గొయ్యో తవ్వుతున్నాడు కాబోలు ! --- రానీ, వీడి పని చెప్తాను !
( ప్రవేశం రంగదాసు. చేతులో పూల సజ్జతో, వైఖానసుడు మండిపడతాడు )
వైఖానస--- రంగదాసూ ! చాల ఆలస్యం చేసావు. ఇవాళ స్వామికి పూల మాల వేయడం కుదరలేదు.--- ఇంతకీ నీ ఆలస్యానికి కారణం ?—
( రంగదాసు మాట్లాడడు )
వైఖానస--- ఏవేవో పిచ్చి పనులు చేస్తున్నావు ! అసలైన కైంకర్యం మానేసి, అవునా ?
( రంగదాసు మాట్లాడడు )
వైఖానస-- మాట్లాడవేం, ఏం చేస్తున్నావు ?
రంగ --- అయ్యగారూ. అయ్యగారూ !--- అపచారం అయిపోయిందండీ ! ఇంకెప్పుడూ ఇలా చేయనండి !
వైఖానస--- ఆ సంగతి అలా ఉంచు, ఏం చేసావో చెప్పు ?
( రంగదాసు చేతులు జోడిస్తాడు, కాని మాట్లాడడు )
వైఖానస-- నువ్వు చెప్పవన్న మాట ! చెప్పకుండా మూగనోము పడితే నేను తెలుసుకోలేనను కొన్నావా ?
( అని కళ్లు మూసుకొని రంగదాసు ఏం చేసాడో తన మనో నేత్రంతో చూస్తాడు )
( క్షీరార్ణవ నలకుబేరుల ప్రణయ దృశ్యాలు అతనికి కనిపిస్తాయి. అతని మనస్సు విచలిత మవుతుంది ! తనని ఆ స్థితికి తీసుకెళ్లిన రంగదాసు పైన చాల కోపం వస్తుంది వైఖానసునికి )
వైఖానస--- రంగదాసా ! --- ప్రణయ దాసుడవై హరికైంకర్యానికి ఆలస్యం చేసి అపచారం చేసావు ! ఇన్నాళ్లూ నీవు చేసిన హరిసేవకి ఫలితం లేకుండా చేసుకొన్నావు--- ( కోపంతో ) వెళ్లు ! ఇక నీ ముఖం నాకు చూపించకు, స్వామి పుష్కరిణిలో పడి చావు !!---( అని అంటాడు )
( రంగదాసు అతని కాళ్లు పట్టుకొని ఏడుస్తాడు.)
( పుట్టలోంచి స్వామి మాటలు వినిపిస్తాయి )
విష్ణు --- వైఖానసా ! విరాగి వైన నిన్నే ఉద్వేగానికీ, తద్వారా అపరిమితమైన కోపానికీ, గురిచేసిన యక్షిణీ ప్రేమలీల --- రంగదాసు వంటి సామాన్యునికి మైమరుపు కలిగించిందంటే ఆశ్చర్యమేముంది ! నీ నిర్ణయం ప్రకారం రంగదాసు ప్రాణత్యాగం చేసుకోవాలి, అంతేనా ?---
వైఖానస--- ప్రభూ ! నన్ను క్షమించండి. క్షణికమైన ఆవేశానికి లోబడి, అలా అన్నాను. అంతేగాని---
విష్ణు --- ఆవేశంతో వెలువడినా, అవి ఋషి నోటనుండి వచ్చాయి గనుక. అమలు జరగ వలసిందే ! రంగదాసూ !
రంగ--- స్వామీ !
విష్ణు ---- నీవు చింతింపకము, స్వామి పుష్కరిణిలో స్నానము చేసి, ప్రాణత్యాగము చేయుటకు సంకల్పించుము. నీ మరు జన్మమున ఆకాశరాజూకి అనుజుడివై, ‘’తొండమానుడ’ వన్న నామథేయంతో వెలుగంది, నా పరమ భక్త శిఖామణివై. నా కొరకు ఆలయము నిర్మింతువు గాక !
( రంగదాసు సాష్టాంగ పడతాడు పుట్టముందు )
విష్ణు --- వైఖానసా ! నీ కైంకర్యము ముగియు సమయమైనందునే , నీకా చిత్త చాంచల్యము అయినది ! మహత్తరమైన దైవ కార్యమునకు నాంది పలుకుటకై నీవు ఇచటి నుండి మరలి పోవక తప్పదు !
వైఖానస-- ప్రభూ ! బాలాజీ ! రంగదాసుని వలె నాకు కూడ ప్రాణత్యాగము చేయుటకు అనుజ్ఞ నిండు ! మీ సేవ నుండి మాత్రము దూరము చేయవద్దు !
( పుట్టలోని విష్ణువు మాట్లాడడు.)
( రంగదాసు స్వామి పుష్కరిణి వైపు వెళ్తాడు. )
( వైఖానసుడు పుట్ట ముందు సాగిలబడి ఎంతో దుఃఖిస్తాడు )
వైఖానస--- ప్రభూ ! బాలాజీ ! నా బాలాజీ !— (అంటూ)
( పుట్టలోని విష్ణువు మాట్లాడడు )
వైఖానస--- ప్రభూ ! బాలాజీ ! మహత్తర దైవ కార్యమునకు నాంది జరుగనున్నది గావున , నే నుండరాదని శాసించితిరి ! కానిండు, -- ఆ దైవ కార్యమేదో ముగిసిన పిమ్మట --- (ఎంతో ఉద్వేగంతో ) -- నన్ను పిలువకుందురా, నేను రాకుందునా ? -- నేను మీకు అడ్డమయినందున, ఎడమగుచుంటిని, ప్రభూ ! బాలాజీ ! పోయి వచ్చెదను గాక ! అంతియే గాని నేను నేరస్థుడను కాను ! బాలాజీ ! నేను నేరస్థుడను కాను !
( స్వామి పుట్ట ఏమీ పలకదు ! విష్ణువు దీర్ఘ తపోదీక్ష కొరకు తన కింకరులను దూరం చేసుకున్నాడు )
**********************
( దృశ్యము 54 )
( ఆకాశం )
( నారదుడు పుట్టలో నున్న విష్ణువు తపస్సును ఆకాశం లోంచి చూస్తాడు )
నారద -- ప్రభూ ! శ్రీమహావిష్ణూ ! ఏమి యుగ్ర తపమయ్యా నీది ! చాంద్రమానము గిర్రున తిరిగి ( 60 సంవత్సరములు ) మరల భాధ్రపదము వచ్చు వరకు నిరంతరము సాగుతూ, కలియుగమున నిన్ను సేవించు భక్తుల నాదరించుటకై , నీవు చేయు యీ తపస్సు ఫలవంతమగు, సమయము ఏతెంచినది ! ఇక---ఇక—
వృ.-- ఖలారి కేశవ వినోద తాండవ / ఫణాళి కాళియ బాలకా !
కులారి రాజస సురారి మర్దన / పులోమ రుక్మిణి లోలకా !
జ్ఞానము నిచ్చుచు, జగాన / మోహము, భవాన తాపము గూర్చుచున్,
మానవ లోకము, సులీల నేలుచు / రమించు మించుము నేర్పుతోన్ !
( అని పాడుతూ తాండవం చేస్తూ వెళ్తాడు )
************************
( దృశ్యము 55 )
( బ్రహ్మ లోకం )
( బ్రహ్మముందు, శివుడు, సూర్యుడు, మరికొంత మంది దేవతలు మరియు నారదుడు ఉంటారు )
నారద --- దేవతలారా ! శేషాచలమున అకుంఠ తపోదీక్షలో మునిగిన శ్రీమన్నారాయణునికి, మీ - మీ తపో ఫలితములు ఇచ్చు సమయము ఆసన్నమయినది !
శివుడు --- నారదా ! దేవతలందరి ప్రతినిధిగా ఈ మహత్కార్యమును నెరవేర్చుటకు, నీ జనకుడే సమర్థుడు !
నారద – ( బ్రహ్మతో )-- జనకా ! విన్నారు కదా, సదాశివుని ఆదేశము ! ఇక-- మీరీ కార్య నిర్వాహక భారము వహింపక తప్పదు.
బ్రహ్మ --- శంకరా ! మీ ఆదేశము నాకు శిరోధార్యము ! -- దేవతలారా ! నేను ‘‘గోవు’ రూపమున , శ్రీమన్నారాయణుని కడకు వెడలి, గోక్షీర ధారలతో
నా బల, వీర్య, తేజో, జ్ఞానములను అతనికి సమర్పించుటకు నిశ్చయించితిని !
శివుడు --- బ్రహ్మదేవుని ఆలోచన కడుంగడు సమంజసము ! క్షీరధారల రూపమున బల, వీర్య, తేజో, జ్ఞానములను ఇచ్చుట నేనును, సిద్ధముగా నున్నాను. బ్రహ్మకు తోడుగా ‘గోవత్సముగా’ నారాయణుని కడకేగెదను !
సూర్యుడు + దేవతలు -- విధాతా ! శివ శంకరా ! మీరు తలచిన యీ కార్యాచరణములో, మా వంతుగా మేము మా బల, వీర్య, తేజో, జ్ఞానములను , మీరిచ్చు క్షీరధారలలో నిహితము చేసి శ్రీమన్నారాయణునికి సమర్పించ గలము !
నారద -- బాగున్నది ! బహు బాగున్నది ! జనకా, గోవుగా మారనున్న , మిమ్ములను శ్రీమన్నారాయణుని కడకు చేర్చువారెవరు ?
బ్రహ్మ --- ( సూర్యునితో ) సూర్యనారాయణా ! నీవు కరివీర పురమున కేగి, లక్ష్మీదేవితో యీ విషయము చెప్పి, ఆమెను చోళరాజు ‘సువీరుని’ రాజ్య సీమలకు చేరవేయుము. నేనును, శివ శంకరుడును, గో-వత్సముల’ రూపమున ఆమె కొరకు వేచి యుందుము.
నారద --- జనకా ! లక్ష్మీదేవి వచ్చి, గో-వత్సములను సువీరునకు అమ్మివేయునా ఏమి ?
బ్రహ్మ --- అవును నారదా ! చక్కగా సెలవిచ్చితివి.
సూర్య --- విధాతా ! మీ ఆదేశము మేరకు, నేను నా విధిని నెరవేర్చెదను గాక !
********************
( దృశ్యము 56 )
( చోళ రాజు సువీరుని రాజ్యము )
( లక్ష్మీదేవి, మాయా గోవత్సములను తోలుకొంటూ, ఒక వీధిలోకి ప్రవేశిస్తుంది )
( ఆ వీధిలోని ఒక ఇల్లాలు ఆవు దూడలను చూస్తుంది )
ఇల్లాలు -- ఆహా ! ఎంత చక్కని ఆవు ! దూడ కూడ చూడ ముద్దొస్తూ ఉంది ! ( అనుకొంటూ ఇంటి బయటికి వస్తుంది )
ఇల్లాలు --- ఓసి గొల్లమ్మా ! ఆవు నమ్ముతావా ?
లక్ష్మి --- ( ఆగి ) అవునమ్మా, అమ్మకానికే తోలుకు వెళ్తున్నాను.
ఇల్లాలు --- ( దగ్గరగా వచ్చి ఆవుని చూస్తుంది ) అబ్బ ! ఎంత చక్కగా ఉందీ ఆవు !
లక్ష్మి ---- అంతేనమ్మా ! చూసి సంతోషించు ! అందరాని వాటికి అర్రులు చాచకూడదమ్మా !
ఇల్లాలు -- ఏమేమి ! ఈ గోవు నా తాహతుకి, అందరానిదా ? అంత గొప్పదా నీ ఆవు ?
( వీళ్ల మాటలు విని కుతూహలంతో వీధిలోని జనం గుమి కూడతారు )
లక్ష్మి -- ఆవు గొప్ప చెప్ప నలవి కాదమ్మా ! ఇది తలరాతలు రాసే ఆవు ! తలపుల్లో నిలిచే ఆవు ! తపో ఫలితాలు ఇచ్చే ఆవు !---
ఇల్లాలు -- ఏంటో ! మాయమాటలు చెప్తున్నావు ! నువ్వు చెప్పిందే కాక, పాలిస్తుందా ఇవ్వదా ?
లక్ష్మి --- ఇవ్వకేమమ్మా ! సాధారణమైన పాలు కాదు ! వరాలిచ్చే దేవతల బలాలు నిండిన పాలు ! సంపదలిచ్చే సురుల సంపదలు నిండిన పాలు ! చదువుల నిచ్చే తల్లి వెలుగులు నిండిన పాలు ! దీని పాలకి ఏ పాలూ సాటిరావు !!
( ఇల్లాలు అర్థం కాక తల గోక్కుంటుంది )
ఈల్లాలు -- ఏం చోద్యమమ్మా ! ఒక్క మాట అర్థం కాలేదు ! మొత్తానికి మాయదారి ఆవని తెలిసింది. నా కెందుకులే తల్లీ ! ( అని ప్రక్కకి తప్పుకొంటుంది )
( లక్ష్మి మాటలు విన్న వారు అర్థమయి కొందరు, అర్థం కాక కొందరు, ముఖాముఖాలు చూసుకొని, గుస గుస లాడుకొంటూ ఉంటారు )
( ఇంతలో ,ఒక ఇంటి కిటికీ చాటునుంచి, ఒక గొంతుక వినిపిస్తుంది )
గొంతు ---- తల్లీ ! యాదవ వనితా ! నీ పేరేమిటమ్మా ?
లక్ష్మి --- ( కాస్త ఆలోచించి ) నా పేరా ?! రుక్మిణి !
గొంతు -- రుక్మిణమ్మా ! మీరు మీ ఆవు గురించి చెప్పిన మాటలన్నీ నిజమేనా ?
లక్ష్మి -- అవునయ్యా ! అంతా నిజమే ! అయినా చాటునుండి అడుగుతావెందుకు , కొనేవాడివయితే బయటికి వచ్చి, అడుగు !
గొంతు --- అలాగేనమ్మా ! బయటికి వచ్చే అడుగుతాను !
( అంటూ ఆ మనిషి కిటికీ చాటునుంచి లేచి, తలుపు తీసుకొని వస్తాడు. )
( ఆశ్చర్యం ! -- అతని ముఖం గాడిద ముఖం, శరీరమేమో మనిషి శరీరం !! ప్రజలు అతని చుట్టూ చేరుతారు. గార్ధభ ముఖుడు, లక్ష్మి, ఆవు , దూడలు మధ్యలో ఉండగా , చూసే ప్రజానీకం వాళ్ల చుట్టూ వలయాకారంగా నిలబడతారు.)
( ఆ వలయాన్ని నెట్టుకొంటూ ఇద్దరు రాజభటులు కూడ వచ్చి నిలబడతారు )
( గార్ధభ ముఖుడు ముందుగా లక్ష్మికి, ఆవుకి, దూడకి నమస్కారం చేస్తాడు )
గార్ధభ --- రుక్మిణమ్మా ! నే నొకప్పుడు చక్కని రూపుగల బ్రాహ్మణ పండితుణ్ని ! ఒక రోజు నా ఇంటికి వచ్చిన అతిథికి, ఎలాగూ ఆ రోజు, మా తండ్రిగారి ఆబ్దికమే గనుక, శ్రాద్ధ భోజనానికి పిలిచి, పెట్టించాను ! ఆ రోజు నుంచే , నా ముఖం ఇలా మారిపోయింది ! --- నేనే తప్పు చేసానో తెలియదు. దీనికి తరుణోపాయం ఏమిటో అంతకన్న తెలియదు ! ఆ నాటి నుంచి దుర్భర జీవితాన్ని గడుపుతున్నాను ! తల్లీ ! రుక్మిణమ్మా ! నీకు, నీ నాధునికీ, నీ వంశం వారికీ, అందరికీ మొక్కుతాను ! నీ గోవుకీ , దూడకీ కూడ పదే పదే మొక్కుతాను. ( మొక్కుతాడు )
లక్ష్మి --- ( జాలితో ) అలాగే బాపనయ్యా ! బెంగపడకు, అడుగుతాన్లే ! ( అని గోవు దగ్గరకి వెళ్లి ) విన్నావా బిడ్డా ! నీకు నీ తండ్రి మీద ఆన ! ఈ బాపనయ్యకి ఈ గతి ఎందుకు పట్టిందో చెప్పు !!
( గోవు తల ఆడించి, తన ముందుకాలి గిట్టలతో, నేల మీద ఏదో రాస్తుంది. అది బ్రహ్మ రాత ! ఎవరికీ అర్థం కాదు ! లక్ష్మి ఆ రాత చూస్తుంది, చదివి చెప్తుంది .)
లక్ష్మి --- ఇదుగో బాపనయ్యా ! నువ్వొక అయోగ్యుడికీ, సంతానం లేని వాడికి శ్రాద్ధ భోజనం పెట్టావు. నీ పితృ దేవతలు కోపించడం వల్ల. నీకీ ముఖం ఏర్పడింది ! అర్థమయిందా ?
గార్ధభ --- అర్థమయింది తల్లీ ! నా తప్పు తెలిసింది ! తరుణోపాయం కూడ చెప్పి, నన్ను కటాక్షించు !
( ఆవు తనకి తెలియదన్నట్లు తల తిప్పుతుంది. దూడ నుదురు నాకి , దూడ నడగమని సంకేతం ఇస్తుంది. లక్ష్మి దూడని అడుగుతుంది )
లక్ష్మి --- ఓ ! గోవుని మించిన గోవత్సమా ! ఈ గృహ మేథికి , గార్ధభ ముఖం పోయే ఉపాయం చెప్పు !
( దూడ చెంగు చెంగున ఎగిరి తన ముంగోటితో నేల మీద వ్రాస్తుంది. లక్ష్మి ఆ రాత చూసి చెప్తుంది )
లక్ష్మి ---- ఇదుగో బాపనయ్యా ! కొంగు బంగారం లాంటి కొండను వదిలి ఎక్కడికి పోనక్కర లేదయ్యా ! వేంకటాచలం పైని, ఆకాశగంగ తీర్థ స్నానము, స్వామి పుష్కరిణీ స్నానము చేస్తే చాలు, నీ రూపు నీకు తిరిగి వస్తుంది !
(గుంపులో ఉన్న రాజభటులు ఒకరికొకరు సైగ చేసుకొని ఈ విషయం రాజుగారికి చెప్పేందుకు వెళ్తారు)
**********************
( దృశ్యము 50 )
( వేంకటాచలము )
( రంగదాసు ఒక బావి తవ్వుతూ ఉంటాడు. ప్రవేశం వైఖానస ఋషి )
వైఖానస-- రంగదాసూ ! ఏం చేస్తున్నావు ?
రంగ -- ( చెమట తుడుచుకొంటూ ) బావి తవ్వుతున్నానండీ !
వైఖానస -- ఈ కొండమీద ఎన్నో సెలయేర్లు ఉండగా, యీ బావి దేనికయ్యా ?
రంగ -- నిజమేనండి ! అవన్నీ దిగువగా చాల దూరంలో ఉన్నాయండి. స్వామి పూజకని, ఇక్కడే పూల తోట వేశాను కదండి, కుండలతో నీళ్లు తెచ్చి, పొయ్యడం చాల కష్టంగా ఉందండి. అందుకని ఇక్కడే బావి తవ్వుతున్నానండి.
వైఖానస-- అదా విషయం ! స్వామివారి కైంకర్యానికే బావి తవ్వుతున్నా వన్నమాట ! మంచిదే, అలాగే కానియ్యి ! ( అని వెళ్లిపోతాడు )
( రంగదాసు నిష్ఠతో అలా తవ్వుతూనే ఉంటాడు. అలసినప్పుడల్లా, --)
రంగ --- వేంకటేశా ! గోవిందా ! ( అని సేద తీరుతూ ఉంటాడు )
*******************
( దృశ్యము 51 )
( వేంకటాచలం )
( స్వామి పుట్టకు కొంత దూరంలో, రంగదాసు, మరో ముగ్గురు కూలీలతో, ఆ పుట్టకి నాలుగు ప్రక్కలా గోడ కట్టే ప్రయత్నం చేస్తూ ఉంటాడు )
( ప్రవేశం వైఖానసుడు )
వైఖానస-- రంగదాసూ, ఏం చేస్తున్నావు ?
రంగ-- గోడ కట్టిస్తున్నానండి. అందుకని రాళ్లు పేరుస్తున్నాను.
వైఖానస-- ఇదంతా ఎందుకు రంగదాసూ ?
రంగ --- వానలు పడితే పుట్ట తడిసిపోదా అయ్యవారూ ! ఇప్పుడు నాలుగు వైపులా మూడడుగుల గోడైనా కడితే, తరువాత కర్రదుంగలతో, పైకప్పు వేసి గుడిశె వేయవచ్చు.
వైఖానస-- రంగదాసూ యీ పనులన్నీ చేయడం వల్ల స్వామి వారి తపస్సుకు అంతరాయం కలుగుతుందేమో !
రంగ --- సద్దు లేకుండా, పని చేయిస్తాను.
వైఖానస--- సరే ! ఈ పనిలో పడి, స్వామి పూజకు, పువ్వులు, తులసి దళాలు తేవడం మరువకు.
రంగ -- అలాగేనండి !
*******************
( దృశ్యము 52 )
( వేంకటాచలం లోని ఒక లోయ.! ఎగువున ఉన్న పూల తోటలో రంగదాసు పూలు కోస్తూ ఉంటాడు )
( ఆ లోయలోపల ఒక యక్షిణీకాంత నిల్చొని, తన ప్రియున్ని పిలుస్తూ ఉంటుంది. ఆమె పేరు క్షీరార్ణవ యక్షిణి )
క్షీరార్ణవ--- ప్రియా, నలకుబేరా ! ఇటు, ఇటు---( అని బిగ్గరగా పిలుస్తుంది )
( నలకుబేరుడు ఆమె వెనక నుండి, చప్పుడు చెయ్యకుండా వచ్చి, ఆమె కళ్లు మూస్తాడు . ఆమె అతని చేతుల పైన తన చేతులు వేసి, క్రిందకు లాగుతుంది. అతడు ఆమె మెడలో తన చేతులు హారంలాగ వేస్తాడు. క్షీరార్ణవ కోపం తెచ్చుకొంటూ-- )
క్షీరార్ణవ--- ఏమిటిది ప్రియా ! నా వెనకనే ఉండి, నన్ను ఎలుగెత్తి పిలిచేలాగ చేస్తున్నారు.
నలకుబేర-- ప్రియా ! అలా పిలిచేటప్పుడు, నీ గళంలోని నరాలు, బిగుసుకొని, వాటిలోంచి, క్షీరధారలు ఉబికి, నీ పేరు ‘ క్షీరార్ణవ’ అని చెప్పక చెప్తున్నాయి, తెలుసా !
( క్షీరార్ణవ అతని చేతులు విఢిపించుకొని, గోముగా అలుగుతుంది )
క్షీరార్ణవ--- ఏమంటిరి ప్రియా ! నా గళసీమలోని నరాలలో పాలు ప్రవహిస్తున్నాయా ? ఏమి హేళన !—
నలకుబేర-- హేళన కాదు ప్రియా ! ప్రియావలోకన !! నీ నరాలలో పాలు, నీ బుగ్గలలో పాలు, అంతెందుకు, నీ శరీరమంతా పాలు--- అందుకే నీ పేరు సార్థకం అయిందని అంటున్నాను.
( క్షీరార్ణవ సిగ్గు పడి దూరంగా పారిపోతుంది. నలకుబేరుడు ఆమె చెయ్యి పట్టుకొంటాడు )
క్షీరార్ణవ--- అబ్బ ! కాస్త మృదువుగా పట్థుకోండి !
నలకుబేర—ఒడిసి పట్టకుంటే, నువ్వు పాలనురుగులా జారిపోతావేమో !!
క్షీరార్ణవ-- మీ చేతికి చిక్కాక, జారిపోవధమూ, పారిపోవడమూ కాదు---
నలకుబేర-- మరి !---
క్షీరార్ణవ-- కలిసిపోతాను !
( ఇద్దరూ ఆనందంగా నవ్వుకుంటూ ఉంటారు )
( రంగదాసు చేస్తున్న పని మరచిపోయి ఆ జంటవైపు చూస్తూ ఉండిపోతాడు )
******************
( దృశ్యము 53 )
( స్వామి పుట్ట )
( వైఖానసుడు స్వామికి ఎదురుగా కూర్చొని, అతనికి పూజ చేస్తూ ఉంటాడు )
వైఖానస--- వన మధ్యే, తరోర్మూలే/ స్వామి పుష్కరిణీ తటే.
తిష్టంతం పుండరీకాక్షం, శ్రీ భూమి రహితం హరిం—
చించా వృక్షస్య మూలేతు / ప్రాదురాసీ జనార్దనః
తింత్రిణీ వృక్ష మూలస్థం / వల్మీకం పరం హరిం---
( పూల కోసం వైఖానసుడు బుట్టలో చెయ్యి పెడితే, అది ఖాళీగా ఉంటుంది . వైఖానసుడు పూల బుట్టను చూస్తాడు. పూజ ఆపి,--- )
( స్వామి తపస్సులోకి జారుకొంటారు. అలా తపస్సులోకి వెళ్లిపోయిన స్వామిని చూసి, వైఖానసుడు నిరుత్సాహ పడతాడు )
వైఖానస--- (తనలో ) పూలు తేకుండా, ఈ రంగదాసుడు ఏం చేస్తున్నట్లు !--- మళ్లీ ఏ నుయ్యో, గొయ్యో తవ్వుతున్నాడు కాబోలు ! --- రానీ, వీడి పని చెప్తాను !
( ప్రవేశం రంగదాసు. చేతులో పూల సజ్జతో, వైఖానసుడు మండిపడతాడు )
వైఖానస--- రంగదాసూ ! చాల ఆలస్యం చేసావు. ఇవాళ స్వామికి పూల మాల వేయడం కుదరలేదు.--- ఇంతకీ నీ ఆలస్యానికి కారణం ?—
( రంగదాసు మాట్లాడడు )
వైఖానస--- ఏవేవో పిచ్చి పనులు చేస్తున్నావు ! అసలైన కైంకర్యం మానేసి, అవునా ?
( రంగదాసు మాట్లాడడు )
వైఖానస-- మాట్లాడవేం, ఏం చేస్తున్నావు ?
రంగ --- అయ్యగారూ. అయ్యగారూ !--- అపచారం అయిపోయిందండీ ! ఇంకెప్పుడూ ఇలా చేయనండి !
వైఖానస--- ఆ సంగతి అలా ఉంచు, ఏం చేసావో చెప్పు ?
( రంగదాసు చేతులు జోడిస్తాడు, కాని మాట్లాడడు )
వైఖానస-- నువ్వు చెప్పవన్న మాట ! చెప్పకుండా మూగనోము పడితే నేను తెలుసుకోలేనను కొన్నావా ?
( అని కళ్లు మూసుకొని రంగదాసు ఏం చేసాడో తన మనో నేత్రంతో చూస్తాడు )
( క్షీరార్ణవ నలకుబేరుల ప్రణయ దృశ్యాలు అతనికి కనిపిస్తాయి. అతని మనస్సు విచలిత మవుతుంది ! తనని ఆ స్థితికి తీసుకెళ్లిన రంగదాసు పైన చాల కోపం వస్తుంది వైఖానసునికి )
వైఖానస--- రంగదాసా ! --- ప్రణయ దాసుడవై హరికైంకర్యానికి ఆలస్యం చేసి అపచారం చేసావు ! ఇన్నాళ్లూ నీవు చేసిన హరిసేవకి ఫలితం లేకుండా చేసుకొన్నావు--- ( కోపంతో ) వెళ్లు ! ఇక నీ ముఖం నాకు చూపించకు, స్వామి పుష్కరిణిలో పడి చావు !!---( అని అంటాడు )
( రంగదాసు అతని కాళ్లు పట్టుకొని ఏడుస్తాడు.)
( పుట్టలోంచి స్వామి మాటలు వినిపిస్తాయి )
విష్ణు --- వైఖానసా ! విరాగి వైన నిన్నే ఉద్వేగానికీ, తద్వారా అపరిమితమైన కోపానికీ, గురిచేసిన యక్షిణీ ప్రేమలీల --- రంగదాసు వంటి సామాన్యునికి మైమరుపు కలిగించిందంటే ఆశ్చర్యమేముంది ! నీ నిర్ణయం ప్రకారం రంగదాసు ప్రాణత్యాగం చేసుకోవాలి, అంతేనా ?---
వైఖానస--- ప్రభూ ! నన్ను క్షమించండి. క్షణికమైన ఆవేశానికి లోబడి, అలా అన్నాను. అంతేగాని---
విష్ణు --- ఆవేశంతో వెలువడినా, అవి ఋషి నోటనుండి వచ్చాయి గనుక. అమలు జరగ వలసిందే ! రంగదాసూ !
రంగ--- స్వామీ !
విష్ణు ---- నీవు చింతింపకము, స్వామి పుష్కరిణిలో స్నానము చేసి, ప్రాణత్యాగము చేయుటకు సంకల్పించుము. నీ మరు జన్మమున ఆకాశరాజూకి అనుజుడివై, ‘’తొండమానుడ’ వన్న నామథేయంతో వెలుగంది, నా పరమ భక్త శిఖామణివై. నా కొరకు ఆలయము నిర్మింతువు గాక !
( రంగదాసు సాష్టాంగ పడతాడు పుట్టముందు )
విష్ణు --- వైఖానసా ! నీ కైంకర్యము ముగియు సమయమైనందునే , నీకా చిత్త చాంచల్యము అయినది ! మహత్తరమైన దైవ కార్యమునకు నాంది పలుకుటకై నీవు ఇచటి నుండి మరలి పోవక తప్పదు !
వైఖానస-- ప్రభూ ! బాలాజీ ! రంగదాసుని వలె నాకు కూడ ప్రాణత్యాగము చేయుటకు అనుజ్ఞ నిండు ! మీ సేవ నుండి మాత్రము దూరము చేయవద్దు !
( పుట్టలోని విష్ణువు మాట్లాడడు.)
( రంగదాసు స్వామి పుష్కరిణి వైపు వెళ్తాడు. )
( వైఖానసుడు పుట్ట ముందు సాగిలబడి ఎంతో దుఃఖిస్తాడు )
వైఖానస--- ప్రభూ ! బాలాజీ ! నా బాలాజీ !— (అంటూ)
( పుట్టలోని విష్ణువు మాట్లాడడు )
వైఖానస--- ప్రభూ ! బాలాజీ ! మహత్తర దైవ కార్యమునకు నాంది జరుగనున్నది గావున , నే నుండరాదని శాసించితిరి ! కానిండు, -- ఆ దైవ కార్యమేదో ముగిసిన పిమ్మట --- (ఎంతో ఉద్వేగంతో ) -- నన్ను పిలువకుందురా, నేను రాకుందునా ? -- నేను మీకు అడ్డమయినందున, ఎడమగుచుంటిని, ప్రభూ ! బాలాజీ ! పోయి వచ్చెదను గాక ! అంతియే గాని నేను నేరస్థుడను కాను ! బాలాజీ ! నేను నేరస్థుడను కాను !
( స్వామి పుట్ట ఏమీ పలకదు ! విష్ణువు దీర్ఘ తపోదీక్ష కొరకు తన కింకరులను దూరం చేసుకున్నాడు )
**********************
( దృశ్యము 54 )
( ఆకాశం )
( నారదుడు పుట్టలో నున్న విష్ణువు తపస్సును ఆకాశం లోంచి చూస్తాడు )
నారద -- ప్రభూ ! శ్రీమహావిష్ణూ ! ఏమి యుగ్ర తపమయ్యా నీది ! చాంద్రమానము గిర్రున తిరిగి ( 60 సంవత్సరములు ) మరల భాధ్రపదము వచ్చు వరకు నిరంతరము సాగుతూ, కలియుగమున నిన్ను సేవించు భక్తుల నాదరించుటకై , నీవు చేయు యీ తపస్సు ఫలవంతమగు, సమయము ఏతెంచినది ! ఇక---ఇక—
వృ.-- ఖలారి కేశవ వినోద తాండవ / ఫణాళి కాళియ బాలకా !
కులారి రాజస సురారి మర్దన / పులోమ రుక్మిణి లోలకా !
జ్ఞానము నిచ్చుచు, జగాన / మోహము, భవాన తాపము గూర్చుచున్,
మానవ లోకము, సులీల నేలుచు / రమించు మించుము నేర్పుతోన్ !
( అని పాడుతూ తాండవం చేస్తూ వెళ్తాడు )
************************
( దృశ్యము 55 )
( బ్రహ్మ లోకం )
( బ్రహ్మముందు, శివుడు, సూర్యుడు, మరికొంత మంది దేవతలు మరియు నారదుడు ఉంటారు )
నారద --- దేవతలారా ! శేషాచలమున అకుంఠ తపోదీక్షలో మునిగిన శ్రీమన్నారాయణునికి, మీ - మీ తపో ఫలితములు ఇచ్చు సమయము ఆసన్నమయినది !
శివుడు --- నారదా ! దేవతలందరి ప్రతినిధిగా ఈ మహత్కార్యమును నెరవేర్చుటకు, నీ జనకుడే సమర్థుడు !
నారద – ( బ్రహ్మతో )-- జనకా ! విన్నారు కదా, సదాశివుని ఆదేశము ! ఇక-- మీరీ కార్య నిర్వాహక భారము వహింపక తప్పదు.
బ్రహ్మ --- శంకరా ! మీ ఆదేశము నాకు శిరోధార్యము ! -- దేవతలారా ! నేను ‘‘గోవు’ రూపమున , శ్రీమన్నారాయణుని కడకు వెడలి, గోక్షీర ధారలతో
నా బల, వీర్య, తేజో, జ్ఞానములను అతనికి సమర్పించుటకు నిశ్చయించితిని !
శివుడు --- బ్రహ్మదేవుని ఆలోచన కడుంగడు సమంజసము ! క్షీరధారల రూపమున బల, వీర్య, తేజో, జ్ఞానములను ఇచ్చుట నేనును, సిద్ధముగా నున్నాను. బ్రహ్మకు తోడుగా ‘గోవత్సముగా’ నారాయణుని కడకేగెదను !
సూర్యుడు + దేవతలు -- విధాతా ! శివ శంకరా ! మీరు తలచిన యీ కార్యాచరణములో, మా వంతుగా మేము మా బల, వీర్య, తేజో, జ్ఞానములను , మీరిచ్చు క్షీరధారలలో నిహితము చేసి శ్రీమన్నారాయణునికి సమర్పించ గలము !
నారద -- బాగున్నది ! బహు బాగున్నది ! జనకా, గోవుగా మారనున్న , మిమ్ములను శ్రీమన్నారాయణుని కడకు చేర్చువారెవరు ?
బ్రహ్మ --- ( సూర్యునితో ) సూర్యనారాయణా ! నీవు కరివీర పురమున కేగి, లక్ష్మీదేవితో యీ విషయము చెప్పి, ఆమెను చోళరాజు ‘సువీరుని’ రాజ్య సీమలకు చేరవేయుము. నేనును, శివ శంకరుడును, గో-వత్సముల’ రూపమున ఆమె కొరకు వేచి యుందుము.
నారద --- జనకా ! లక్ష్మీదేవి వచ్చి, గో-వత్సములను సువీరునకు అమ్మివేయునా ఏమి ?
బ్రహ్మ --- అవును నారదా ! చక్కగా సెలవిచ్చితివి.
సూర్య --- విధాతా ! మీ ఆదేశము మేరకు, నేను నా విధిని నెరవేర్చెదను గాక !
********************
( దృశ్యము 56 )
( చోళ రాజు సువీరుని రాజ్యము )
( లక్ష్మీదేవి, మాయా గోవత్సములను తోలుకొంటూ, ఒక వీధిలోకి ప్రవేశిస్తుంది )
( ఆ వీధిలోని ఒక ఇల్లాలు ఆవు దూడలను చూస్తుంది )
ఇల్లాలు -- ఆహా ! ఎంత చక్కని ఆవు ! దూడ కూడ చూడ ముద్దొస్తూ ఉంది ! ( అనుకొంటూ ఇంటి బయటికి వస్తుంది )
ఇల్లాలు --- ఓసి గొల్లమ్మా ! ఆవు నమ్ముతావా ?
లక్ష్మి --- ( ఆగి ) అవునమ్మా, అమ్మకానికే తోలుకు వెళ్తున్నాను.
ఇల్లాలు --- ( దగ్గరగా వచ్చి ఆవుని చూస్తుంది ) అబ్బ ! ఎంత చక్కగా ఉందీ ఆవు !
లక్ష్మి ---- అంతేనమ్మా ! చూసి సంతోషించు ! అందరాని వాటికి అర్రులు చాచకూడదమ్మా !
ఇల్లాలు -- ఏమేమి ! ఈ గోవు నా తాహతుకి, అందరానిదా ? అంత గొప్పదా నీ ఆవు ?
( వీళ్ల మాటలు విని కుతూహలంతో వీధిలోని జనం గుమి కూడతారు )
లక్ష్మి -- ఆవు గొప్ప చెప్ప నలవి కాదమ్మా ! ఇది తలరాతలు రాసే ఆవు ! తలపుల్లో నిలిచే ఆవు ! తపో ఫలితాలు ఇచ్చే ఆవు !---
ఇల్లాలు -- ఏంటో ! మాయమాటలు చెప్తున్నావు ! నువ్వు చెప్పిందే కాక, పాలిస్తుందా ఇవ్వదా ?
లక్ష్మి --- ఇవ్వకేమమ్మా ! సాధారణమైన పాలు కాదు ! వరాలిచ్చే దేవతల బలాలు నిండిన పాలు ! సంపదలిచ్చే సురుల సంపదలు నిండిన పాలు ! చదువుల నిచ్చే తల్లి వెలుగులు నిండిన పాలు ! దీని పాలకి ఏ పాలూ సాటిరావు !!
( ఇల్లాలు అర్థం కాక తల గోక్కుంటుంది )
ఈల్లాలు -- ఏం చోద్యమమ్మా ! ఒక్క మాట అర్థం కాలేదు ! మొత్తానికి మాయదారి ఆవని తెలిసింది. నా కెందుకులే తల్లీ ! ( అని ప్రక్కకి తప్పుకొంటుంది )
( లక్ష్మి మాటలు విన్న వారు అర్థమయి కొందరు, అర్థం కాక కొందరు, ముఖాముఖాలు చూసుకొని, గుస గుస లాడుకొంటూ ఉంటారు )
( ఇంతలో ,ఒక ఇంటి కిటికీ చాటునుంచి, ఒక గొంతుక వినిపిస్తుంది )
గొంతు ---- తల్లీ ! యాదవ వనితా ! నీ పేరేమిటమ్మా ?
లక్ష్మి --- ( కాస్త ఆలోచించి ) నా పేరా ?! రుక్మిణి !
గొంతు -- రుక్మిణమ్మా ! మీరు మీ ఆవు గురించి చెప్పిన మాటలన్నీ నిజమేనా ?
లక్ష్మి -- అవునయ్యా ! అంతా నిజమే ! అయినా చాటునుండి అడుగుతావెందుకు , కొనేవాడివయితే బయటికి వచ్చి, అడుగు !
గొంతు --- అలాగేనమ్మా ! బయటికి వచ్చే అడుగుతాను !
( అంటూ ఆ మనిషి కిటికీ చాటునుంచి లేచి, తలుపు తీసుకొని వస్తాడు. )
( ఆశ్చర్యం ! -- అతని ముఖం గాడిద ముఖం, శరీరమేమో మనిషి శరీరం !! ప్రజలు అతని చుట్టూ చేరుతారు. గార్ధభ ముఖుడు, లక్ష్మి, ఆవు , దూడలు మధ్యలో ఉండగా , చూసే ప్రజానీకం వాళ్ల చుట్టూ వలయాకారంగా నిలబడతారు.)
( ఆ వలయాన్ని నెట్టుకొంటూ ఇద్దరు రాజభటులు కూడ వచ్చి నిలబడతారు )
( గార్ధభ ముఖుడు ముందుగా లక్ష్మికి, ఆవుకి, దూడకి నమస్కారం చేస్తాడు )
గార్ధభ --- రుక్మిణమ్మా ! నే నొకప్పుడు చక్కని రూపుగల బ్రాహ్మణ పండితుణ్ని ! ఒక రోజు నా ఇంటికి వచ్చిన అతిథికి, ఎలాగూ ఆ రోజు, మా తండ్రిగారి ఆబ్దికమే గనుక, శ్రాద్ధ భోజనానికి పిలిచి, పెట్టించాను ! ఆ రోజు నుంచే , నా ముఖం ఇలా మారిపోయింది ! --- నేనే తప్పు చేసానో తెలియదు. దీనికి తరుణోపాయం ఏమిటో అంతకన్న తెలియదు ! ఆ నాటి నుంచి దుర్భర జీవితాన్ని గడుపుతున్నాను ! తల్లీ ! రుక్మిణమ్మా ! నీకు, నీ నాధునికీ, నీ వంశం వారికీ, అందరికీ మొక్కుతాను ! నీ గోవుకీ , దూడకీ కూడ పదే పదే మొక్కుతాను. ( మొక్కుతాడు )
లక్ష్మి --- ( జాలితో ) అలాగే బాపనయ్యా ! బెంగపడకు, అడుగుతాన్లే ! ( అని గోవు దగ్గరకి వెళ్లి ) విన్నావా బిడ్డా ! నీకు నీ తండ్రి మీద ఆన ! ఈ బాపనయ్యకి ఈ గతి ఎందుకు పట్టిందో చెప్పు !!
( గోవు తల ఆడించి, తన ముందుకాలి గిట్టలతో, నేల మీద ఏదో రాస్తుంది. అది బ్రహ్మ రాత ! ఎవరికీ అర్థం కాదు ! లక్ష్మి ఆ రాత చూస్తుంది, చదివి చెప్తుంది .)
లక్ష్మి --- ఇదుగో బాపనయ్యా ! నువ్వొక అయోగ్యుడికీ, సంతానం లేని వాడికి శ్రాద్ధ భోజనం పెట్టావు. నీ పితృ దేవతలు కోపించడం వల్ల. నీకీ ముఖం ఏర్పడింది ! అర్థమయిందా ?
గార్ధభ --- అర్థమయింది తల్లీ ! నా తప్పు తెలిసింది ! తరుణోపాయం కూడ చెప్పి, నన్ను కటాక్షించు !
( ఆవు తనకి తెలియదన్నట్లు తల తిప్పుతుంది. దూడ నుదురు నాకి , దూడ నడగమని సంకేతం ఇస్తుంది. లక్ష్మి దూడని అడుగుతుంది )
లక్ష్మి --- ఓ ! గోవుని మించిన గోవత్సమా ! ఈ గృహ మేథికి , గార్ధభ ముఖం పోయే ఉపాయం చెప్పు !
( దూడ చెంగు చెంగున ఎగిరి తన ముంగోటితో నేల మీద వ్రాస్తుంది. లక్ష్మి ఆ రాత చూసి చెప్తుంది )
లక్ష్మి ---- ఇదుగో బాపనయ్యా ! కొంగు బంగారం లాంటి కొండను వదిలి ఎక్కడికి పోనక్కర లేదయ్యా ! వేంకటాచలం పైని, ఆకాశగంగ తీర్థ స్నానము, స్వామి పుష్కరిణీ స్నానము చేస్తే చాలు, నీ రూపు నీకు తిరిగి వస్తుంది !
(గుంపులో ఉన్న రాజభటులు ఒకరికొకరు సైగ చేసుకొని ఈ విషయం రాజుగారికి చెప్పేందుకు వెళ్తారు)
**********************
Comments
Post a Comment