Skip to main content

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన 17

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన 17

( ద్రుశ్యము 81 )

( సాంకాశ్యమనే రాజ్యము )

( చక్రవర్తి శంఖణుడు, మంత్రి రూపచంద్రుడు, రాజగురువు మాధవాచార్యుడు ఉంటారు. చక్రవర్తి సింహాసనానికి వెనుక పరిచారికలు వింజామరలు వీస్తూ ఉంటారు. )

( ప్రవేశం-- కోశాధికారి స్వర్ణగుప్తుడు )

స్వర్ణగుప్తుడు--- సాంకాశ్య నరేంద్రులు, శంఖణ చక్రవర్తులకు జయమగుగాక ! -- కోశాధికారి స్వర్ణగుప్తుడు నమస్కరిస్తున్నాడు. ( ఆని నమస్కరిస్తాడు )

రూపచంద్రుడు--- స్వర్ణగుప్తా ! చక్రవర్తుల వారు మీ కోసమే ఎదురు చూస్తున్నారు. మన కోశాగారంలో నిల్వలు ఎలా ఉన్నాయి ? సాలీనా జరిగే జమా, ఖర్చులు ఎంత ? ఈ వివరాలను ప్రభువులవారికి తెలియజేయండి.

స్వర్ణగుప్త--- మహామంత్రి రూపచంద్రుల వారికి, రాజగురువు మాధవాచార్యుల వారికి, నా నమస్కారములు ! మన సాంఖాశ్య రాజ్యం లోని సాలీనా ఖర్చు ఒకటిన్నర సంఖ్యల శ్రీరామ ముద్ర నిష్కములు అవుతుంది. సాలీనా రాబడి, రెండు సంఖ్యల శ్రీరామముద్ర నిష్కములు. పోగా మిగులు అర సంఖ్య శ్రీరామ ముద్ర నిష్కములు. కాని--- ఈ మధ్య సామంత రాజులైన విక్రమవర్మ, తేజసింహుడు, మహేంద్ర వర్మ, రణసింహులు, గత నాలుగేళ్లుగా కప్పము కట్టక ఫోవడం వల్ల, రాజ కోశములో నిల్వలు క్షీణించి పోయినవి. ఈ సంవత్సరము ఖర్చులకు మాత్రము నిలువ ఉంది.

మాధవాచార్య-- మహామంత్రీ ! మన సామంత రాజులు కప్పము చెల్లించ నందులకు, కారణమేమి ? దానికి మీరేమి చర్యలు తీసుకున్నారు ?

రూపచంద్ర--- ఆచార్యా ! ఈ సామంతులు నలుగురూ, ఏదో దురాలోచనతో, కప్పము కట్టడం లేదని తెలిసినది. వారిలో విక్రమ వర్మ, తేజో సింహుడు ఈ మధ్య వియ్యమందుట చేత, దగ్గరయి స్వాతంత్రము ప్రకటించినారు.

మాధవాచార్య-- ఆ తిరుగుబాటు దారుల మీద ఏ చర్యలు తీసుకొన్నారు ?

రూపచంద్ర--- వారు నలుగురు ఏకమయిన పక్షమున , మన సైన్యములు నిలువ జాలవు ! అందువలన సామంతోనే పనులు చక్కబెట్టుకోవాలి.

శంఖణుడు--- అమాత్యా ! ఇప్పుడేం చేయాలనుకొంటున్నారు ?

రూపచంద్ర--- కప్పము కట్టు వారికి, కొన్ని రాయితీలు,ఇస్తానని వారందరకు వేరు వేరుగా లేఖలు వ్రాయించాను.

శంఖణుడు--- అవును, ప్రస్తుత పరిస్థితిలో ఇదే సరియైన మార్గము ! రెండెళ్ల కప్పము కట్టిన చాలునని, ఇది మీకు మాత్రమే పరిమితమని, వేరు వేరుగా లెఖలు వ్రాయించి పంపండి. సామముతో పని చక్కబెట్టుకొన్న తరువాత, వారి మధ్య భేదోపాయముతో, కలతలు, కలహాలు పుట్టించాలి. చిక్కు సమస్యలు వచ్చినప్పుడు మనమే వారికి ’అండ-దండ’ అని నమ్మించాలి. అలా చేయగలిగితేనే, ఈ సమస్యకి శాశ్వత పరిష్కారం లభిస్తుంది.

మాధవాచార్య-- ప్రభూ ! ఈ శాశ్వత పరిష్కారమునకై, తమరొక పరి, వేంకటాచలమునకు, వెళ్లక తప్పదు !

శంఖణుడు--- వేంకటాచలమా !? ఏ పని మీద ఆచార్యా !

మాధవాచార్య--- వేంకటాచలమందు గల ’స్వామి పుష్కరిణీ’ స్నానం చాల మహిమాన్విత మైనది.

శ్లో-- ’ స్వామి పుష్కరిణీ స్నానం / సద్గురో పాద సేవనం,
ఏకాదశీ వ్రతం చాపి / త్రయ మత్యంత దుర్లభం !’

అనగా స్వామిపుష్కరిణీ స్నానము, సద్గురుని పాదసేవ, ఏకాదశీ వ్రతము ఈ త్రయము సామాన్యులకు లభింపవని భావము !

శంఖణుడు-- ( చికాకుతో ) ఆచార్యా ! రాజ గురువులైన మీ మాటలు, నాకు శిరోధార్యములు ! కాని ఇప్పటి సమస్య, ధార్మికము కాదు ఆచార్యా ! ఇది ఆర్ఠిక పరమైనది, అర్థమయిందా ?

మాధవాచార్య--- ప్రభూ ! స్వామి పుష్కరణీ స్నానము స్వామిత్వమును ప్రసాదిస్తుంది.

శంఖణుడు--- ( విసుగుతో ) ఆచార్యా ! స్వామి పుష్కరిణీ స్నానము , అంత మహత్తర మయినదే యగునెడల ఈ సమస్య నుండి, విడివడిన మరుక్షణమే ఆచరించెదను.

**************

( ద్రుశ్యము ౮౨ )

( సామంత రాజు మహేంద్ర వర్మ ఆలోచనా మందిరము )

( సామంత రాజులు నలుగురు, విక్రమవర్మ, తేజోసింహుడు, రణసింహుడు, మహేంద్రవర్మతో కలిసి ఉంటారు )

తేజోసింహ--- విక్రమ వర్మ మహారాజా ! శంఖణుడు, మనలను తరాజులను చేసి, ఆడింప బూనుకొన్నాడు. కప్పము కట్టుట కష్టమైన యెడల, రాయితీలు ఈయగలడట ! అది కూడ నాకు మాత్రమేనట !—

మహేంద్ర వర్మ--- అవును, విక్రమ వర్మ మహారాజా ! నాకు పంపిన లేఖలో కూడ రాయితీ ప్రస్తావన ఉంది ! దీనిని బట్టి శంఖణుని , బలహీనత స్పష్టమవుతోంది ! -- మీరు, నేను, తేజోసింహ, రణసింహులలో, ఎవరా శంఖణునికి తీసికట్టు !! మనమాతనికి కప్పమేల కట్టవలె ?

రణసింహ---- నిజము ! మనము కప్పము కట్టి, శంఖణుని రాజస్వము నింపుట ఏమి న్యాయము ?

విక్రమ వర్మ-- మిత్రులారా ! కప్పము కట్టకూడదన్న మీ ఏకాభిప్రాయాన్ని, నేను కూడ సమర్థిస్తున్నాను ! మనము నలుగురము, నాలుగు దిక్కుల నుండి దండయాత్ర చేసినచో, శంఖణుడు పరాజితుడు కాక మానడు.

మహేంద్ర వర్మ--- లెస్స పలికితిరి, విక్రమ వర్మ మహాఅరాజా !

తేజోసింహుడు--- మనము సామూహికముగా, దండయత్ర చేయ వలెనన్న నిర్ణయము, ఇక తిరుగు లేనిది !

రణసింహుడు-- విక్రమ వర్మ మహారాజా ! నలుగురు కలిసి దండయాత్ర చెసినచో, శంఖణుడు శంకర గిరి మాన్యాలు పట్టక మానడు. అతని రాజ్యమందు, ఈశాన్య భాగము మంచి సారవంతము, ఫలవంతము అయినది. వ్యాపారమునకు కూడ అది కూడలి స్థలము ఆ భాగము నాకు ఇచ్చిన యెడల, నేను మీతో చేయి కలుపుటకు సంసిద్ధముగా నున్నాను.

మహేంద్రవర్మ-- ఆ ఈశాన్య భాగము, నా రాజ్యమునకు సరిహద్దులలో ఉన్నది ! కావున దానిని నేను తీసుకొనుట న్యాయమగును.

తేజోసింహుడు--- దండయాత్రకు వలయు, ధన వ్యయమును నేను భరింప గలవాడను ! ఆ ఈశాన్య భాగము మాత్రము నా అధీనము చేయవలెను.

విక్రమవర్మ--- యుద్ధమునకు అర్థబలము కన్న, అంగ బలము ముఖ్యము ! నా సైన్యము సుశిక్షితము, సంఖ్యాగరిష్టము, కావున నాకే ఆ భాగము దక్కవలెను !

రణసింహ--- కాదు, నాకు ---

మహేంద్ర--- నాకు----

తేజోసింహ--- కాదు, నాకు ---

విక్రమ వర్మ--- మిత్రులారా ! శంఖణుని రాజ్యములో ఈశాన్య భాగము , ఎవరికి దక్కవలెనన్న, వాదన తప్ప, మరి అన్ని విషయములలోను, మనకు ఏకాభిప్రాయము కలిగినది కదా !

రణసింహ + తేజోసింహ -- అవును విక్రమ వర్మ మహారాజా !

మహేంద్ర వర్మ--- మనలో మనమీ తగవు మాని, ఆ భూభాగమును ముందు జయించవలెను కదా ! శంఖణుని రాజ్యచ్యుతుని చేసిన పిమ్మట, మనమా విషయము చర్చించు కొనుట, మంచిదని నా తలంపు !

విక్రమ వర్మ--- అవును శంఖణుని అడ్డు తొలగిన తరువాత, అతని రాజ్యమును పంచుకొను విషయమును వివేక వంతులైన, మంత్రి సభయందు పరిష్కరించుకొనుట మంచిది.

రణసింహ--- నిజము ! ముందుగా, మనము దండ నీతితో, రాజ్యమును పొంది----

తేజోసింహ---- ఆ పైన సామ నీతి ననుసరించుట మంచిది !

( ఆ మాటలకి అందరూ నవ్వుకొంటారు )

******************

( ద్రుశ్యము ౮౩ )

( రాజగురువు మాధవాచార్యుని ఇల్లు )

( రాత్రి రెండవ ఝాము .మాధవాచార్యుడు పడుకొని ఉంటాడు. తలుపు కొట్టిన చప్పుడుకి తెలివి వస్తుంది. లేచి వీథి తలుపు తీస్తూ అడుగుతాడు )

మాధవాచార్య--- ఎవరు, ఎవరది ?

( బయటి నుండి రాజు శంఖణుడు జవాబిస్తాడు )

శంఖణుడు-- ఆచార్యా ! నేను---

మాధవాచార్య--- అరరే ! ఈ గొంతుక మహారాజుల వారిదిలాగ ఉంది. ఇంత రాత్రి పూట ఇక్కడకి ఎ<దుకు వచ్చినట్లు ? ( అనుకొంటూ తలుపు పూర్తిగా తెరుస్తాడు )

( అక్కడ శంఖణ మహారాజుని చూసి ఆశ్చర్యపోతాడు. మహారాజు సాధారణ వేషంలో ఉంటాడు )

మాధవాచార్య--- మహారాజా ! మీరా !!--- ఏమిటీ సామాన్య వేషధారణ !?

( అంటూ ఉండగానే శంఖణుడు అతని నోరు నొక్కి, ఇంటి లోపలికి తోసి, తలుపు గడియ పెడతాడు )

శంఖణుడు--- ఆచార్యా ! కాల వశమున నా విరోధులందరూ కలిసి కట్టుగా వచ్చి, కోటను ఆక్రమించారు. నా పరివార వర్గములను, అమాత్యులు సురక్షిత స్థానమునకు చేర్చనున్నారు. నేనిలా మీ దగ్గరకు ----

మాధవాచార్య--- మహారాజా ! అర్థమయింది. మీ రాక నా కెంతో సంతోష కారక మయినను, మీ మేలుకొరకు, చెప్తున్నాను. నా ఇల్లు మీకు సురక్షితమైన స్థానము కాదు.

శంఖణుడు-- ఆచార్యా ! ఏమిటి మీరు అంటున్నది !

మాధవాచార్య--- అవును మహారాజా ! మీ పరివార వర్గము కన్న, మీ వెనుకనే విరోధులు గాలింపు చర్యలు పటిష్టం చేస్తారు. రాజధానిలోని అందరి ఇళ్లను వేటాడుతారు.

శంఖణుడు--- నిజమే ఆచార్యా ! నేను మరెచటకు వెళ్లగలను ?

మాధవాచార్య--- మహారాజా ! నేను మీకు ముందుగానే మనవి చేసుకొన్నాను. వేంకటాచలం పైన స్వామి పుష్కరిణి చాల మహిమ కలదని, ! ఆ స్వామి పుష్కరిణీ స్నానము వలన, మరల మీకు స్వామిత్వము ప్రాప్తించగలదు.

శంఖణుడు-- నిజమే ఆచార్యా ! వేంకటాచలమే సురక్షితమైన ప్రదేశమని నా తలపు. మీరు అన్నట్లు, స్వామి పుష్కరిణి స్నానము తిరిగి నాకు స్వామిత్వము ప్రసాదింప గలుగును గాక !

మాధవాచార్య--- మహారాజా ! అందుకు సంశయము లేదు. ఈ రాత్రే బయలు దేరి వేంకటాచలము చేరుట మంచిది. అందుకు ఏర్పాట్లు నేను చేస్తాను, లోపలికి రండు

( శంఖణుడు, మాధవచార్యుని వెనుక ఇంటి లోపలికి వెళ్తాడు )

*****************

( ద్రుశ్యము ౮౪ )

( స్వామి పుష్కరిణీ తీరం )

( శంఖణుడు ధ్యానం చేస్తుంటాడు )

శ్లో-- మేఘశ్యామం, పీతకౌశేయ వాసం / శ్రీ వత్సాంకం, కౌస్తుభోద్ధాసితాంగం,
పుణ్యోపేతం, పుండరీకాయతాక్షం, / విష్నుం వందే, సర్వలోకైక నాధం
సశంఖ చక్రం, సకిరీట కుండలాం / సపీత వస్త్రం, సరసీరుహేక్షణం
సహార వక్షస్థల శోభి కౌస్తుభం / నమామి విష్ణుం, శిరసా చతుర్భుజం ”

( విష్ణుమూర్తి, చతుర్భుజుడై, శంఖ చక్రాది ఆయుధాలతో ప్రత్యక్షమవుతాడు )

విష్ణు--- శంఖణా ! భక్తి శ్రద్ధలతో స్వామి పుష్కరిణి యందు, స్నాన మాచరించిన కారణమున నీ పూర్వపాప సంచయము నశించి, నీవు శుచిర్భూతుడవైనావు. ఇక నీ రాజ్యమును సుఖముగా పాలింతువు గాక ! భక్తి యుక్తులై ఈ స్వామి పుష్కరణిలో నిత్యము స్నానమొనర్చు వారు, స్వామిత్వము పొందగలరు.
( అని అద్రుశ్యమవుతాడు )

( శంఖణుడు కళ్లు తెరిచి చూస్తాడు. విష్ణువు ఎక్కడా కనిపించడు )

శంఖణుడు-- ఆహ ! ఏమి నా భాగ్యము !! విష్ణువు స్వయముగా వచ్చి, ధ్యానమందైనను, నా వంటి అల్పుని ముందు నిలిచి, నా అభీష్టము నెరవేరగలదని చెప్పుటకు, ఈ స్వామి పుష్కరిణియే కదా కారణము ! ఇక నా రాజ్యమును చేరి, అక్కడి స్థితిగతులు తెలుసుకొనెదను గాక !

( ప్రవేశం మాధవాచార్యుడు, మంత్రి రూప చంద్రుడు )

ఇద్దరూ---- మహారాజులకు అభివాదములు !

రూపచంద్ర-- మహారాజా ! మీకు శుభ వార్త ! విరోధులయిన మన సామంత రాజులు వారిలో వారు, మన రాజ్యము లోని ఈశాన్య భాగమగు సాంకాశ్యము కొరకు, కలహించి, ఒకరినొకరు చంపుకొని , మీ మార్గమును నిష్కంటకము చేసినారు. మన రాజ్యముతో పాటు, ఆ సామంతుల రాజ్యములు కూడ , మీ స్వామిత్వమునకు ఎదురు చూచుచున్నవి !!

మాధవాచార్య--- శంఖణ మహారాజా ! చూసితిరి కదా స్వామిపుష్కరిణీ స్నాన మహిమ !

శంఖణుడు--- ఆచార్యా ! మీ మాటలు నిజము ! స్వామి పుష్కరణీ స్నానము, మీ వంటి సద్గురు పాద సేవనము, ఏకాదశీ వ్రతము యీ మూడింటి ఫలము నాకు నాల్గురెట్లు ఎక్కువై లాభించినది. నేను ధన్యుడనయితిని !

*****************

Comments

Popular posts from this blog

చిలక రథంలో సరదా షికారు—( పెద్దలకు, పెళ్లైన వారికి మాత్రమే)

     ( ఈ బ్లాగులోనే టపా కొట్టిన కొన్ని సరస శృంగార కథల సమాహారం )     స్వస్తి శ్రీ చాంద్రమాన విరోధి నామ సంవత్సర జ్యేష్ట అమావాస్య , మృగశిరా నక్షత్ర యుత , సోమవార పర్వదినం, రోమన్ కేలండర్ ప్రకారం ఆ రోజు తేదీ 22.06.2009.     రాత్రి రెండు ఝాములు దాటి , ఒంటి గంట అయింది !     రుద్రాభిషేకం జరుగుతోంది.!     అది క్షీరారామ క్షేత్రంగా ప్రసిధ్ధికి ఎక్కిన ‘శ్రీరామ లింగేశ్వర స్వామి వారి ఆలయం. శివుడు తన త్రిశూలపు మొనని, నేలపై ఆనించగా, అక్కడ నుండి, ‘క్షీర ధార’ పైకి ఉబికి,‘ పాలకొలను’ ఏర్పడిందట ! ఆ కొలను గట్టున శ్రీమహా విష్ణువు పూర్ణావతారమైన, శ్రీరామ చంద్ర మూర్తి , సీతమ్మ వారితో కలసి, తమ స్వహస్తాలతో , ‘శ్రీ రామ లింగేశ్వర’ప్రతిష్ట చేసారట !     ఆ విధంగా శివ-  కేశవుల పవిత్ర స్పర్శతో పునీతమయిన క్షేత్ర రాజం అది !     ‘పినాక పాణి’ , అతని కుటుంబ సభ్యులు, శ్రీ రామ లింగేశ్వర స్వామి వారి, అభిషేక కార్యక్రమం ముగించుకొని, మూడవ గంట కల్లా, తనతో పాటు తెచ్చుకొన్న ‘మినీ బస్సులో’ తిరుగు ముఖం పట్టారు.     పినాక పాణి బహు కుటుంబీకుడు ! అతనికి ఆరుగురు చెల్లెళ్లు, ముగ్గురు తమ్ముళ్లు ఉన్నారు ! అమ్మయిలు మువ్వురికీ , అతనికీ, పెళ్లిల

నీల గ్రహ నిదానము 3

నీల గ్రహ నిదానము 3 (రెండవ దృశ్యము.) ( దక్ష వాటిక ) ( దక్షుడు ఒంటరిగా ఒక శిలా ఫలకం మీద కూర్చొని ఉంటాడు.) దక్షుఢు --- “ ఓం నమో నారాయణాయ ! ఓం నమో నారాయణాయ !! ఓం నమో నారాయణాయ !!! ” (అని జపిస్తూ ఉంటాడు ) ( తెర లోంచి కూడా “ ఓం నమో నారాయణాయ “ అని వినిపిస్తుంది.) ( దక్షుడా ప్రతి ధ్వని విని, నామ జపాన్ని ఆపి చూస్తాడు ) ( ప్రవేశం--- నారదుడు, నారాయణ మంత్రం పఠిస్తూ ) నారదుడు --- దక్ష ప్రజాపతీ ! బ్రహ్మ మానస పుత్రుడైన ఈ నారదుడు, ఉపబ్రహ్మవు, పితృ తుల్యులైన మీకు నమస్కరిస్తున్నాడు. దక్షుడు --- దీర్ఘాయురస్తు ! నారదా ! ఎచటి నుండి నీ రాక ? నారదుఢు ---- బాబాయి ! నా రాక మాటకేం గాని, మీ పోకడలు మాత్రం విచిత్రంగా ఉన్నాయి. ఇలా ఒంటరిగా ఆరు బయట కూర్చొని, నారాయణ స్మరణ చేయాల్సిన అవసరం మీ కేమొచ్చింది ? దక్షుడు --- సంసార జంజాటం లేని బ్రహ్మచారివి. సంతానం తెచ్చి పెట్టే సమస్యలు నీ కేమి అర్థమవుతాయి. నారదుడు --- మీ సంతానం నాకు సోదర తుల్యులు కారా బాబాయి ! అయినా నారాయణ స్మరణతో సమస్యా పరిష్కార

వేణీ సంహారము

వేణీ సంహారము (1ఈ కథానిక ఆంధ్రభూమి శనివారం తేది 11.2.2011 దిన పత్రికలో ప్రచురించ బడింది) నా భార్య ‘నీలవేణి’ చాలా అందమైనది. ముఖ్యంగా పేరుకి తగ్గట్లుండే ఆమె కబరీ భరం ! వర్తులాకారంలో ఎత్తుగా నిర్మించిన రెండు ఇసుక తిన్నెల లాంటి జఘనాల మధ్య, సన్నని పాయ లాంటి చీలికని స్పృశిస్తూ పొడవుగా ఒత్తుగా , జడలా బిగించినప్పుడు ‘త్రాచుపాములాగ’ విచ్చుకొన్నప్పుడు నెమలి వింజామరలా కనిపించే ఆ నీలవేణి సౌందర్యం బాపూ బొమ్మకే ఉంటుంది ! ఆమె చంద్రవదనాన్ని ఏ సినిమా దర్శకుడైనా చూసి ఉంటే,తప్పకుండా ఆమెకి ‘అమ్మవారి ’ పాత్రలు దక్కి ఉండేవి ! వెడల్పైన ఫాలభాగం మీద బాలారుణ సూర్య బింబం లాగ కనిపించే కుంకుమ బొట్టు, దాని క్రింద ధనస్సుల లాంటి కనుబొమలు, ఆ క్రింద మీనాల లాంటి కళ్లు. ఆ కళ్ల మధ్య నుండి ఎత్తుగా, ఠీవిగా నిటారుగా ఉండే ముక్కు, దానిక్రింద రుచులూరించే అధరాలు, పచ్చని బంతి పూవు లాంటి మేని ఛాయ, పొడవుకి తగ్గ శరీర సౌష్టవం, కలిగిన ఆమె, చూపరులకు చెయ్యెత్తి నమస్కరించాలనిపించే దేవీ కళలు ఉట్టి పడుతూ ఆకర్షణీయంగా ఉంటుంది. ఆమె నా భార్య కావడం నేను చేసుకొన్న అద