Skip to main content

చిలక రథంలో సరదా షికారు --౫

    మర్నాడు ఉదయం, ఫలహారాలు ముగించాక, అందరూ మూడావ మజిలీ అయిన ద్రాక్షారామం వైపు షికారు కోసం బస్సు ఎక్కారు.
.    సారంగ పాణి, కాంతమ్మలు కూడా ఎక్కడం చూసిన పినాక పాణి ఆశ్చర్యంతో అడిగాడు. “ అదేమిటి ! మీరు ఇంట్లోనే ఉండిపోతారని అన్నారే ? ప్రోగ్రాం మార్చుకొన్నారా ?” అని.
    “ అల్లుడుగారు కమ్మని కథలు చెప్తున్నారు కదా, అవి వినే అవకాశం పోతుందని బయలు దేరాం. శివాని చిన్నపిల్ల కదా, పైగా దాని స్కూలు తెరచేసారు, అందుకని అది ఉండిపోయింది” అని కాంతమ్మ బదులిచ్చింది.
    “ అదేమిటి పిన్నీ ! నోములు నోచుకోవడానికి నీకు సమయం లేదనికొన్నానే !” అంది శాంతిసేన.
    “ నోముల్లో కూడా క్థలే ఉంటాయే తల్లీ !” అంది కాంతమ్మ.
    “ అల్లుడు గారూ ! విన్నారు కదా, మీ కథలకి డిమాండ్ పెరిగి పోయింది. కమ్మని క్థ ఒకటి అందుకోండి. ” అన్నాడు పినాక పాణి.
    శ్రీలత వెంటనే లేచి , తన చేతిలోని ప్లాస్టిక్ పెట్టేలోంచి , ఖార్జూరం పళ్ళు తీసి తలో రెండూ పంచింది. ” ఇవి అలసటని వెంటనే పోగొడతాయట, మీ అల్లుడు గారు చెప్పారు.” అంటూ.
    “ ఏ అలసటే  చెల్లీ ?” మేలమాడీంది శాంతి.
‘    “అలసటలో కూడా రకాలు ఉంటాయా అక్కా ! నాకు తెలియదే !’” అమాయకంగా ముఖం పెట్టి జవాబిచ్చిన శ్రీలత మాటలకి శాంతిసేన అందంగా సిగ్గుపడింది.
    “ అయితే అల్లుడుగారూ ! ఈ ఖర్జూరానికీ, శృంగారానికీ మధ్య ఏదైనా సంబంధం ఉందంటారా ?”
    “ అవినాభావ సంబంధం ఉందట !” అని నాలుక కరచుకొంది శ్రీలత.
    “ అలాగా ! అయితే ఆ కథ చెప్పాల్సిందే !” అంటూ , అందరూ సూర్యచరణ్ వైపు చూసారు.
    సూర్యచరణ్ చెప్పసాగాడు.
            *****************************
        చిలక రథంలో సరదా షికారు--౫

    హేమావతి అపురూప సౌందర్యవతి. స్దిరయై భూమిపై సంచరించే విద్యుల్లత, ప్రాణాలతో వెలసిన బంగారు  బొమ్మ! బంగారానికి కాఠిన్యమనే దుర్గుణం ఉంది.ఈ కొత్త బంగారం అత్యంత సుకుమారం. ఆమెనే గాని శశాంకుడు ఒకసారి ఆలోకించే పక్షంలో రోహిణీ కాంతపై శీత కన్ను వేయక మానడు.”  అని అనుకొంటూ ఉంటారు,సౌందర్య మర్మజ్ఞులైన  రసికులు.

    యథాతథంగా అదే జరిగింది ఆ రోజు రాత్రి!!

     గ్రీష్మ తాపంతో కొంత, మదన తాపంతో మరికొంత పీడితురాలైన హేమావతి, స్వేదంతో తడిసిన కంచుకాన్ని విప్పివిసిరేసింది. మెత్తని  అంగ  వస్త్రంతో  బాహుమూలాల్ని, స్తన ద్వయాన్ని,వీపునీ తుడుచుకొంది..స్వేదమయితే  ఆరింది  గాని, తాపం  మాత్ర  తీరలేదు.

    ఏం చేయాలా?”అని తలపోసి,“కొలనులోఈత కొడితే!”అన్న ఆలోచన వచ్చి, జాగు చెయ్యకుండా తన ఇంటి  దిడ్డి ద్వారం నుండి బయటపడి, బహు వృక్షావృతమయిన కొలను చేరుకొంది.కొలను గట్టుపై, వలువలు విడిచి.అంగ  వస్త్రాన్నిశరీర లతపై అలవోకగా చుట్టుకొని, కొనలు ముడివేసి,జలకన్యలా,కొలనులో దూకింది.

    చాల సేపు ఈదులాడి అలసిన, ఆ అలరుబోడి, అలసట  తీర్చు  కొనేందుకు, జలస్తంభన  విద్యతో, నీటిపై  వెల్లకిలా పడుకొని, అరమోడ్పు కనులతో చల్లదనాన్ని ఆస్వాదిస్తూ తేలియాడ సాగింది.

    అలా తేలియాడుతున్న ఆమె తనులతా సౌందర్యాన్ని, తన వెలుగులో వీక్షించిన చంద్రునికి.మదన తాపమెక్కి, చెమట పట్టేసింది.!! అంతే, చంద్రుడు మానవ రూపంలో, ఆ కొలను గట్టు చేరుకొని,“సుందరీ!” అని పిలిచాడు.

    హేమావతి, పురుష  కంఠ స్వరాన్నిగుర్తించింది. ఏ మాత్రం చలించకుండా బదులిచ్చింది. ఓ ! పురుష పుంగవుడా ! నీవు ఎవరివైనా సరే, నా ప్రశాంతతను భగ్నం చేయక, వెను తిరిగి వెళ్లిపో! దానికి విపరీతంగా ఏమైనా  చేసావా! శపించ వలసి వస్తుంది.”

    “సుందరీ !! నన్నుశపించి శిలగా మార్చగలవని తెలుసు.కాని నిదానించి చూసి విషయం తెలుసుకో !! నేను  సోమదేవుణ్ని!!” అన్నాడు చంద్రుడు.అతను అసత్యమాడలేదు, సోముడు. సోమదేవుడు’ అనేవి, అతని పేర్లే కదా మరి!

    కాని ఆ పేరుని పలకడం లోనే తన,చాతుర్యమంతా ఇమిడి ఉంది ! అదేమిటంటే, “సోమదేవుడు”.ఆమె భర్త  పేరు. ఆ పేరు విని ఆమె స్తభ్ధురాలయింధి.

    చంద్రుడు ఆ అవకాశాన్ని తీసుకొని,కొలనులో దిగాడు.ఆమె చుట్టూ.ప్రదక్షిణాలు చేస్తూ.ఈదులాడ సాగాడు.  హేమావతి ఆ అలజడికి తేరుకొంది.“నీవు సోమదేవుడవా?! ఇంకా జీవించే ఉన్నావా?! నీవు మరణించావని, నన్ను  పదేళ్ల  క్రితమే విధవని చేసారు.....”  అంది. ఆమెకు ఆరేళ్ల వయస్సులోనే వివాహమయింది. ఆ మరుచటి సంవత్సరమే, సోమదేవున్ని, కాపాలికులు ఎత్తుకు పోయారు.తమ తాంత్రిక సాధన కోసం,ఆ బాలుణ్నిబలి చేసారు.భర్త ముఖమైనా  చూసి ఎరుగని హేమావతి బాల వితంతువు అయింది.

    అలాంటిది,ఈ రాత్రి,అకస్మాత్తుగా !!

    చంద్రుడు చనువు పెంచుకొన్నాడు..ఆమె వామ హస్తాన్నిఅందుకొని అన్నాడు.“నన్నుతాంత్రిక గురువు చంప లేదు.ఇంకొక బాలుని మృత దేహం దగ్గర నా గుర్తులు విడచి పెట్టి, నా గురించి వెతకకుండా జాగ్రత్త పడ్డాడు.ఆ తరువాత నన్నుతన ప్రియశిష్యునిగా మలచుకొన్నాడు. కొన్నిరోజులుగా,ఇక్కడికి దగ్గరగా ఉన్నచిట్టడవిలో,నా గురువు సాధన చేస్తున్నాడు.నేను అనువైన సమయం కనిపెట్టి, నిన్నుకలుసుకొనేందుకు మీ ఇంటి వైపు వచ్చాను. నీవు దిడ్డి ద్వారం గుండా ఈ కొలనుకు రావడం చూసి,ఇక్కడకు వచ్చాను.అని నమ్మబలికాడు.

    హేమావతి అతని చేతులలో వాలింది. అతడామెను హృదయానికి హత్తుకొని, కొలను బయటకి  తీసుకొని వచ్చాడు.ఆమె ఒంటిని అంటి పెట్టుకొనిఉన్న అంగ వస్త్రాన్ని తొలగించాడు, తరువాత తన వలువలు కూడ విడిచాడు.  ఆమె సిగ్గుల మొగ్గ అయి,తన సర్వాంగాలతోను అతనికి దగ్గరకి చేరి అతనిని కౌగలించుకొంది.అతడామె అంగాంగాలను  చుంబించి ఆమెను మత్తులో ముంచాడు.

    హేమావతి తన అధరాలతో,ఆ అమృతాంశునికే అమృతాన్ని అందించింది!! ఇరువది ఏడు నక్షత్ర కాంతల  అధరామృతములను చవి చూసిన ఆ సుధాంశుడు, హేమాచతి అధరాలను,కుతూహలంతో అందుకొని, ఆస్వాదించి,   ఆహా ! ఏమి రుచి !!” అనుకొన్నాడు.ఆ రుచిని చవిచూసిన అతను,అంతటితో ఆగక,తన ప్రతి బింబంలాంటి ఆమె ఫాల  భాగాన్ని పరిశీలించి తన పెదవులతో ఆమోద ముద్ర వేసాడు.ఆ దిగువన ఉన్నధనస్సుల లాంటి ఆమె కనుబొమలను,  జిహ్వతో స్పశించి సరిదిద్దాడు.ఆమెకనులలో తన ప్రియమైన కలువ భామలను వీక్షించాడు,వాటిపై  కూడ పెదవులతో  ఆమోద ముద్ర వేసాడు.ఆ కలువల కొలనుల నడుమ, నిటారుగా సంపంగి మొగ్గలా నిలిచిన నాసికను , నాలుకతో  తడిచేసి కాంతులు వెదజల్లేలా చేసాడు.ఆ తరువాత ఆలుచిప్పలాంటి  చిబుకాన్ని, శంఖం  లాంటి మెడని చేతి ముని  వేళ్లతో చక్కదిద్దాడు.

    ఆమె మెడ దిగువన చూపు మరల్చలేక పోయాడా చుక్కలరేడు.!!  హేమావతి  స్తన ద్వయాలు, సుతి మెత్తని  సర్ణకలశాల లాగ,వాటి అగ్రభాగాన.ఠీవిగా,నిటారుగా తామరపువ్వు బొడ్డులా నిలిచిన చూచుకాలను ఆశ్చర్యంతో, విస్ఫారిత నేత్రాలతో, నమ్మలేనట్లు తడిమి,తడిమి చూసాడు. స్తనాలపైన చూచుకాలు సురకాంతలకు ఉండవు!! మానవ  కాంతయైన హేమావతి, వద్ద వాటిని  చూసి అతడు ముగ్ధుడవుతే, అతని ముచ్చట చూసిన హేమావతి,కంపనతో  కూడిన స్వరంతో చెప్పింది. “ స్వామీ ! ఆ చూచుకాలు ఇప్పటి వరకు అణిగి,మణిగి ఉండేవి, మీ కర స్పర్శతో, ప్రేరణ  చెంది,నిటారుగా నిలబఢ్డాయి....”అని. చంద్రుడా చనుమొనలను చప్పరించి వాటి కాఠిన్యాన్ని ప్రశంసించాడు. ఆ  పిమ్మట ఆమె సన్నని నడుము, లోతైన  పొట్ట, అక్కడ  కేంద్ర బిందువు  లాంటి, నాభి  పైన అతని  దృష్టి  పడింది.  హేమావతి  ఆ  చూపుల  వేడిని  భరించలేక, అతని  తలని, తన  చేతులతో  అదిమిపెట్టి  తన  పొట్టలో   దాచేసుకొంది. ఇంకేముంది!!  చంద్రుడా!  సురతోపచార  కుశలుడు,  హేమావతి  పరిపుష్టభోగక్షమాంగి, ఇక  వారి  విశృంఖల  ప్రణయానికి,  ఆ  సరోవర  తీర  తరులు  సాక్షులై  భాగస్వాములయి  నిలిచాయి

    బ్రాహ్మీ  ముహూర్త  సమయానికి,  చంద్రునికి,  తన స్థితి  తెలిసింది. “సుందరీ !  గురుదేవుల  సాధన  ముగిసే  సమయమయింది.  నేను  బయలుదేరాలి.” అన్నాడు  లేచి నిలబడి,  తన  దుస్తులు  ధరిస్తూ.హేమావతి  కూడ  తన  దుస్తులు  ధరించింది.  “స్వామీ !  నాతో  పాటు ఇంటికి  రండి.  మిమ్మల్ని  చూసి  అందరూ  సంతోషిస్తారు,” అంది.

    ఇది సమయం కాదు దేవీ ! వచ్చే అమావాస్య నాటికి  నా గురువు తన సాధన ముగించి,నాకు స్వేచ్ఛను  ప్రసాదిస్తాడు. ఆ రోజు నీతో వచ్చి, అందరికీ విషయమంతా వివరిస్తాను.అంతవరకు ఈ రహస్యాన్నికాపాడాలి. ఈ లోగా ఇలాగే ఈ సరోవర తీరాన కలుసుకొందాం” అని ఆమెను కొసరి,ముద్దాడాడు.తనని సుఖాల డోలికలో ఊగులాడించిన,  ఆ   పురుషుని మాటలను హేమావతి మనస్ఫూర్తిగా నమ్మింది. మరుచటి రోజు వస్తానని మాట ఇచ్చింది.

Comments

Popular posts from this blog

చిలక రథంలో సరదా షికారు—( పెద్దలకు, పెళ్లైన వారికి మాత్రమే)

     ( ఈ బ్లాగులోనే టపా కొట్టిన కొన్ని సరస శృంగార కథల సమాహారం )     స్వస్తి శ్రీ చాంద్రమాన విరోధి నామ సంవత్సర జ్యేష్ట అమావాస్య , మృగశిరా నక్షత్ర యుత , సోమవార పర్వదినం, రోమన్ కేలండర్ ప్రకారం ఆ రోజు తేదీ 22.06.2009.     రాత్రి రెండు ఝాములు దాటి , ఒంటి గంట అయింది !     రుద్రాభిషేకం జరుగుతోంది.!     అది క్షీరారామ క్షేత్రంగా ప్రసిధ్ధికి ఎక్కిన ‘శ్రీరామ లింగేశ్వర స్వామి వారి ఆలయం. శివుడు తన త్రిశూలపు మొనని, నేలపై ఆనించగా, అక్కడ నుండి, ‘క్షీర ధార’ పైకి ఉబికి,‘ పాలకొలను’ ఏర్పడిందట ! ఆ కొలను గట్టున శ్రీమహా విష్ణువు పూర్ణావతారమైన, శ్రీరామ చంద్ర మూర్తి , సీతమ్మ వారితో కలసి, తమ స్వహస్తాలతో , ‘శ్రీ రామ లింగేశ్వర’ప్రతిష్ట చేసారట !     ఆ విధంగా శివ-  కేశవుల పవిత్ర స్పర్శతో పునీతమయిన క్షేత్ర రాజం అది !     ‘పినాక పాణి’ , అతని కుటుంబ సభ్యులు, శ్రీ రామ లింగేశ్వర స్వామి వారి, అభిషేక కార్యక్రమం ముగించుకొని, మూడవ గంట కల్లా, తనతో పాటు తెచ్చుకొన్న ‘మినీ బస్సులో’ తిరుగు ముఖం పట్టారు.     పినాక పాణి బహు కుటుంబీకుడు ! అతనికి ఆరుగురు చెల్లెళ్లు, ముగ్గురు తమ్ముళ్లు ఉన్నారు ! అమ్మయిలు మువ్వురికీ , అతనికీ, పెళ్లిల

నీల గ్రహ నిదానము 3

నీల గ్రహ నిదానము 3 (రెండవ దృశ్యము.) ( దక్ష వాటిక ) ( దక్షుడు ఒంటరిగా ఒక శిలా ఫలకం మీద కూర్చొని ఉంటాడు.) దక్షుఢు --- “ ఓం నమో నారాయణాయ ! ఓం నమో నారాయణాయ !! ఓం నమో నారాయణాయ !!! ” (అని జపిస్తూ ఉంటాడు ) ( తెర లోంచి కూడా “ ఓం నమో నారాయణాయ “ అని వినిపిస్తుంది.) ( దక్షుడా ప్రతి ధ్వని విని, నామ జపాన్ని ఆపి చూస్తాడు ) ( ప్రవేశం--- నారదుడు, నారాయణ మంత్రం పఠిస్తూ ) నారదుడు --- దక్ష ప్రజాపతీ ! బ్రహ్మ మానస పుత్రుడైన ఈ నారదుడు, ఉపబ్రహ్మవు, పితృ తుల్యులైన మీకు నమస్కరిస్తున్నాడు. దక్షుడు --- దీర్ఘాయురస్తు ! నారదా ! ఎచటి నుండి నీ రాక ? నారదుఢు ---- బాబాయి ! నా రాక మాటకేం గాని, మీ పోకడలు మాత్రం విచిత్రంగా ఉన్నాయి. ఇలా ఒంటరిగా ఆరు బయట కూర్చొని, నారాయణ స్మరణ చేయాల్సిన అవసరం మీ కేమొచ్చింది ? దక్షుడు --- సంసార జంజాటం లేని బ్రహ్మచారివి. సంతానం తెచ్చి పెట్టే సమస్యలు నీ కేమి అర్థమవుతాయి. నారదుడు --- మీ సంతానం నాకు సోదర తుల్యులు కారా బాబాయి ! అయినా నారాయణ స్మరణతో సమస్యా పరిష్కార

వేణీ సంహారము

వేణీ సంహారము (1ఈ కథానిక ఆంధ్రభూమి శనివారం తేది 11.2.2011 దిన పత్రికలో ప్రచురించ బడింది) నా భార్య ‘నీలవేణి’ చాలా అందమైనది. ముఖ్యంగా పేరుకి తగ్గట్లుండే ఆమె కబరీ భరం ! వర్తులాకారంలో ఎత్తుగా నిర్మించిన రెండు ఇసుక తిన్నెల లాంటి జఘనాల మధ్య, సన్నని పాయ లాంటి చీలికని స్పృశిస్తూ పొడవుగా ఒత్తుగా , జడలా బిగించినప్పుడు ‘త్రాచుపాములాగ’ విచ్చుకొన్నప్పుడు నెమలి వింజామరలా కనిపించే ఆ నీలవేణి సౌందర్యం బాపూ బొమ్మకే ఉంటుంది ! ఆమె చంద్రవదనాన్ని ఏ సినిమా దర్శకుడైనా చూసి ఉంటే,తప్పకుండా ఆమెకి ‘అమ్మవారి ’ పాత్రలు దక్కి ఉండేవి ! వెడల్పైన ఫాలభాగం మీద బాలారుణ సూర్య బింబం లాగ కనిపించే కుంకుమ బొట్టు, దాని క్రింద ధనస్సుల లాంటి కనుబొమలు, ఆ క్రింద మీనాల లాంటి కళ్లు. ఆ కళ్ల మధ్య నుండి ఎత్తుగా, ఠీవిగా నిటారుగా ఉండే ముక్కు, దానిక్రింద రుచులూరించే అధరాలు, పచ్చని బంతి పూవు లాంటి మేని ఛాయ, పొడవుకి తగ్గ శరీర సౌష్టవం, కలిగిన ఆమె, చూపరులకు చెయ్యెత్తి నమస్కరించాలనిపించే దేవీ కళలు ఉట్టి పడుతూ ఆకర్షణీయంగా ఉంటుంది. ఆమె నా భార్య కావడం నేను చేసుకొన్న అద