Skip to main content

మొసలి కొలను మ్యూజియం ( హాస్య రోమాంచ ధారావాహిక---4)


(నిన్నటి టపాలో జరిగిన కథ==== బాలరాజు చెప్పిన క్లూ ప్రకారం ఇనస్పెక్టర్ ఇంద్రనీల్ వాడిని మోసం చేసి గొలుసు కాజేసిన ఆర్ట్ డైరక్టర్ సుగ్రీవని పట్టుకొంటాడు. --- ఇక చదవండి)

మొసలి కొలను మ్యూజియం--4

    రామ్ మహమ్మద్ జేమ్స్ దగ్గర , పాతిక వేల రూపాయలు దొరికాయి. వాటిని ఒక కవరులో పెట్టి సీలు చేసాడు ఇంద్రనీల్. టు నాట్ త్రీని  పూల రంగరాజు దగ్గరకి వెళ్లి, ఎఫ్ . ఐ. ఆర్ వ్రాయించి పట్టుకు రమ్మన్నాడు.


    టూ నాట్ త్రీ ,‘రామా రామ’ అని, వెళ్తూ ఉండగానే , పోలీసు స్టేషను ముందు, ఒక కారు వచ్చి ఆగింది. ఆ కారు లోంచి ‘డిప్యూటీ సూపరెండెంటు ఆఫ్ పోలిస్ ’, కాక ఇంకో పెద్ద మనిషి ఉన్నారు.


    డిప్యూటీని చూసి ,టు నాట్ త్రీ , ఇనస్పెక్టర్ అతనికి సెల్యూట్ చేసారు. అతనితో పాటు వచ్చిన పెద్ద  మనిషిని చూసి, మేనేజరు లేచి నిలబడి సెల్యూట్ చేసాడు. మేనేజరు చర్య చూసిన ఇంద్రనీల్ వచ్చిన పెద్ద మనిషి , ఆ గోల్డు కంపెనీ యజమాని అయి ఉంటాడని  ఊహింఛాడు.


    డిప్యూటీ కుర్చీలో  కూర్చొంటూనే అన్నాడు. “ఇంద్రనీల్ నువ్వు అరెస్టు చేసిన  పెద్ద మనిషి  నిజంగానే ఒక ఫిలిం కంపెనీలో ఆర్టు డైరక్టరు , పేరు సుగ్రీవ్ ! నువ్వు అనుమానిస్తున్నట్లు  గొలుసుని  అతను దొంగలించ లేదు. గొలుసుని తాకట్టు పట్టినది అతను కానే కాదు ! ఇంతకీ అతని స్టేటుమెంటు తీసుకొన్నావా ?” అని అడిగాడు.


    ఇంద్రనీల్ జవాబు చెప్పబోయే లోగానే,సుగ్రీవ్ నోరు విప్పాడు.“ సార్ ! ఈ ఇనస్పెక్టర్ నాతో చాలా రేషుగా  బిహేవు చేసాడు. నేను ఈ కుర్రవాడు బాలరాజుని నిజంగానే సెలూన్కి తీసుకెళ్లాను. అక్కడ నుంచి షూటింగు సైటుకు తీసుకెళ్దామనుకొన్నాను. సెలూన్లో బాలరాజు నా చేతికి గొలుసు ఇచ్చిన మాట నిజమే ! నేను నా పేంటు జేబులో పెట్టుకొన్నాను. బాలరాజు క్రాఫింగుకి ఇంకా టైము పడుతుందని తెలిసి, వాడికి రెడీ మేడ్ డ్రస్సు కొనడానికి, ఎదురుగా ఉన్న షాపుకే వెళ్లాను. ఒక  డ్రెస్ ఎంచి కుర్రవాడు వచ్చి, ‘ట్రైల్’  చేసాక డబ్బు ఇచ్చేస్తానని షాపు ఓనరుకి, చెప్పాను. సెలూనులో పని ఇంకా పూర్తి కాలేదు గనుక, ఈ లోగా పెద్ద చెరువు గట్టు దగ్గర బెస్తవాళ్ల దగ్గర మందు కొనడానికి వెళ్లాను. వీళ్లు వచ్చి నన్ను ఛార్జి చేసే వరకు, గొలుసు విషయం  నాకు గుర్తుకే రాలేదు. అది బహుశా రెడీమేడ్ షాపులో పడి పోయి ఉంటంది. సార్ ! అది దొరికి , చేజిక్కించుకొన్న వ్యక్తి---”


    “ అర్థమయింది సుగ్రీవు గారూ ! ఇంక మీరేమీ చెప్ప నవసరం లేదు. విన్నావా, ఇంద్రనీల్ ! ఇంకా  ఇతన్ని అనుమానిస్తున్నావా ?” అని అడిగాడు డిప్యూటీ.


    “ సర్ ! ముత్తు ఫైనాన్సు కంపెనీ మేనేజరు –”


    “ ఇనస్పెక్టరు గారూ ! ” డిప్యూటీతో పాటు వచ్చిన పెద్ద మనిషి  ఇంద్రనీల్ మాటలకి అడ్డుపడ్డాడు. “ నా  పేరు ముత్తు రామన్ ! ముత్తు ఫైనాన్సు కంపెనీ ప్రొప్రయిటర్ని. మీరు అనుమానిస్తున్న గొలుసు తాలూకు డీల్ చేసింది నా మేనేజరు  కాదు, నేనే చేసాను. నా మేనేజరుకి  ఏమీ తెలియదు, “ ఏమంటావు మేనేజర్ ?” అంటూ తన మేనేజరుని అడిగాడు ముత్తురామన్.


    మేనేజరుకి ముచ్చెమటలు పోసాయి.అతను తన యజమాని  మాటలని ఎలా  ఖండించ గలడు !    “ అవును సార్ ! నేను ఆ విషయం చెప్దామని అనుకొంటూ ఉండగానే , అతను నన్ను పోలీసు స్టేషనుకి తీసుకొని వచ్చాడు. సార్ !” అన్నాడు.

    ఇంద్రనీల్ తన కళ్ల ముందే , ఉక్కు లాంటి కేసు, మంచు ముక్కలాగ  కరిగి పోవడం గమనించాడు. ఒక ఫిలిం కంపెనీ కళా దర్శకుడి పరువు ప్రతిష్టల కోసం ,పసి బాలుడైన ‘బాలరాజుని’ పణం పెట్టడం, అదీ డిప్యూటీ సూపరెండెంట్ ఆఫ్ పోలీస్, పెద్ద వ్యాపార వేత్త, అయిన ముత్తు రామన్ల జోక్యం ద్వారా జరగడం అతనికి ఆశ్చర్యాన్నీ, దుఃఖాన్నీ,రోషాన్నీ, కలిగించి మంచు గడ్డతో మొత్తినట్లయింది. ఇంద్రనీల్ ధైర్యం చేసి అన్నాడు.,


    “ సార్ ! పదమూడేళ్ల  పసి బాలుడైన బాలరాజు గొలుసు –”


    “ ఇంద్రనీల్ ! నాకు ఆ విషయం తెలియదని  అనుకొన్నావా, బాలరాజు పట్ల నాకు పూర్తి సానుభూతి ఉంది!తన జేబులోంచి జారిపోయి పడి పోయిన గొలుసుని పాపం ! సుగ్రీవు గారు ఎక్కడ నుండి తెచ్చిఇస్తారు? నువ్వు సీలు చేసిన పాతిక వేల రూపాయలు అతని పాకట్ మనీ కావడం వల్ల  ఆ సొమ్ముని  ఇచ్చేయమని నే నెలా చెప్ప గలను? ” అంటూ సుగ్రీవు వంక చూసాడు డిప్యూటీ.


    “ సార్ ! మంచి సలహా సూచింఛారు సార్ ! బాలరాజు గొలుసుకి నష్ట పరిహారం క్రింద ఆ పాతిక వేలు ఇప్పించండి సార్ ! నా చేతులారా జారి పోయిన గొలుసు కోసం , ఆ మాత్రం శిక్ష నాకు పడాల్సిందే !”



    “ వెరీ గుడ్ సుగ్రీవు గారూ ! ఏయ్, టూ నాట్ త్రీ  నువ్వు బాలరాజునీ, పాతిక వేల రూపాయలనీ , పువ్వుల రంగరాజు గారికి అప్పగించి, కేసు విషయంలో ఇంకే ఎఫ్. ఐ..ఆర్ దాఖలు చేయవద్దని చెప్పు. ఇంద్రనీల్ ! ‘ హారాన్ని’ ముత్తు ఫైనాన్సు కంపెనీ మేనజరు గారికి ఇచ్చేయి. అసలు దొంగ ఎవరో నీ చేతికి చిక్కక పోడు , అప్పుడు కావాలంటే కేసు ఓపెన్ చెయ్యవచ్చు., పెద్ద మనుష్యుల్ని అనవసరంగా ఇబ్బంది పాలు చెయ్యకు. అరెస్ట్ చేయాల్సి వచ్చినప్పుడు నన్ను కన్సల్టు చేయి. ” అని ఇంద్రనీల్ని మెత్తగా చీవాట్లు పెట్టి, అసలు కేసే లేకుండా చేసి, కారెక్కాడు  డిప్యూటీ ! అతనితో పాటు ముత్తురామన్ , అతని మేనేజరు కూడా గొలుసు తీసుకొని వెళ్లి పోయారు. టూ నాత్ త్రీ , బాలరాజునీ, వాళ్లిచ్చిన నష్ట పరిహార ధనాన్నీ, తీసుకొని, పూల రంగడి దుకాణానికి పోలీసు జీపులో వెళ్ళాడు.

    ఇంద్రనీల్ ఒంటరిగా కూర్చొని, ఆ పోలీసు ఠాణాలో ,చీకటి గదిలో చిరు దీపంలాగ మిగిలి పోయాడు.

 
 మరునాడు ఇంద్రనీల్ తన డయిరీలో ఇలా వ్రాసుకొన్నాడు.

కేసుపేరు                ‘పువ్వుల నుండి హారం వరకు’

నేరం                ‘బంగారు గొలుసు మోసంతో అపహరణ’

విక్టిం                ‘పాపం బాలరాజు’ ముఫ్ఫయి అయిదు వేలు ఖరీదు చేసే హారానికి పాతిక వేలు నష్ట పరిహారం పొందిన అమాయకుడు.

నేరస్థుడు            ‘ రామ్ మహమ్మద్ జేమ్స్’ అలియాస్ సుగ్రీవ్.

బ్రెయిన్                ‘డి.వై.ఎస్.పి , ముత్తురామన్ అండ్ అఫ్ కోర్స్ సుగ్రీవ్ !’

కేసు ఉపసంహారం            ‘ఎఫ్ ఐ ఆర్ కూడా దాఖలు కాకుండా మంచులా కరిగి పోయింది.’

శిక్ష పొందిన వాడు            ఇనస్పెక్టర్ ఇంద్రనీల్, హ హ హ ! హి హి హి !

( తరువాయి భాగం రేపటి టపాలో )

Comments

Popular posts from this blog

చిలక రథంలో సరదా షికారు—( పెద్దలకు, పెళ్లైన వారికి మాత్రమే)

     ( ఈ బ్లాగులోనే టపా కొట్టిన కొన్ని సరస శృంగార కథల సమాహారం )     స్వస్తి శ్రీ చాంద్రమాన విరోధి నామ సంవత్సర జ్యేష్ట అమావాస్య , మృగశిరా నక్షత్ర యుత , సోమవార పర్వదినం, రోమన్ కేలండర్ ప్రకారం ఆ రోజు తేదీ 22.06.2009.     రాత్రి రెండు ఝాములు దాటి , ఒంటి గంట అయింది !     రుద్రాభిషేకం జరుగుతోంది.!     అది క్షీరారామ క్షేత్రంగా ప్రసిధ్ధికి ఎక్కిన ‘శ్రీరామ లింగేశ్వర స్వామి వారి ఆలయం. శివుడు తన త్రిశూలపు మొనని, నేలపై ఆనించగా, అక్కడ నుండి, ‘క్షీర ధార’ పైకి ఉబికి,‘ పాలకొలను’ ఏర్పడిందట ! ఆ కొలను గట్టున శ్రీమహా విష్ణువు పూర్ణావతారమైన, శ్రీరామ చంద్ర మూర్తి , సీతమ్మ వారితో కలసి, తమ స్వహస్తాలతో , ‘శ్రీ రామ లింగేశ్వర’ప్రతిష్ట చేసారట !     ఆ విధంగా శివ-  కేశవుల పవిత్ర స్పర్శతో పునీతమయిన క్షేత్ర రాజం అది !     ‘పినాక పాణి’ , అతని కుటుంబ సభ్యులు, శ్రీ రామ లింగేశ్వర స్వామి వారి, అభిషేక కార్యక్రమం ముగించుకొని, మూడవ గంట కల్లా, తనతో పాటు తెచ్చుకొన్న ‘మినీ బస్సులో’ తిరుగు ముఖం పట్టారు.   ...

సత్య సాయి బాబా నన్ను కాపాడిన వైనం.

నేను ‘క్షీరగంగ’ బ్లాగర్’గా మీ అందరికీ తెలుసు. నా అన్నయ్య , వదినలు ‘భగవాన్ శ్రీ సత్యసాయి బాబా’ గారి పరమ భక్తులు. వాళ్ల ఇంట్లో ఎప్పుడూ లక్ష్మివారం భజనలు జరుగుతూ ఉంటాయి. ఆ భజనల్లో ఎన్నో చమత్కారాలు , ‘విభూతి పడడం, తేనె కారడం’ లాంటివి జరుగుతూ ఉండేవి. వాళ్ల ఇల్లు, ‘విజయ నగరంలోని అయ్యన్న పేటలో ఉండేది. ఆ ఇల్లుని బాబా నిలయంగా అందరూ పేర్కొనే వారు. ఆ ఇంటికి వెళ్లిన నేను నాభార్య ఒకరోజు భజనలో పాల్గొన్నాం. ఆ తరువాత సహజంగానే మేము కూడ సత్యసాయి బాబా అనుగ్రహం కోసం అతని నామజపం మొదలు పెట్టాం. నాకు శ్రీ సత్య సాయి అనుగ్రహం కలిగిన అనుభవం చాల విచిత్రమైనది. నేను చాల సన్నిహితులైన వారితోనే దానిని పంచుకొన్నాను. ఈ రోజు శ్రీ సత్యసాయి అవతార సమాప్తి గురించి విన్న తరువాత నా బ్లాగు మిత్రులతో ఆ అనుభవాన్ని పంచుకోవాలని అనిపించింది. పది సంవత్సారాల క్రిందటి మాట ! నేను ‘ ఎస్.ఇ.సి.ఆర్. రైల్వే బిలాస్’పూర్’లో , సెక్షన్ ఇంజనీయరుగా పని చేస్తున్న రోజులవి. ‘ హౌరా,కుర్లా ఎక్స్’ప్రెస్ రాత్రి మూడు గంటలకి బిలాస్’పూరు ఫ్లాట్’ఫారం చేరుకొంది. అది చేరుకోవడానికి రెండు గంటల ముందే, నాకు కంట్రోల్ ద్వారా వర్తమానం అందింది. ఆ ట్రైను ఇంజనులో ఒ...

రక్కసి కందని రాచిలుక

‘సంపూర్ణ,’ అందాల చిలక లాంటి కన్నెపిల్ల.. పరిపూర్ణ సౌందర్యవతి. ఆమె విశాలమైన నీలి కళ్లు కలువల కొలనులాగ ఉంటాయి. ఆమె ముక్కు ఎక్కుపెట్టిన బాణంలాగ, నూటముఫ్ఫైయి అయిదు (90+45) డిగ్రీల అధిక కోణంలో నిటారుగా సంపెంగ రంగులో ఉండి, చిన్న కమ్మీని తగిలించుకొని, ఆ ముఖాని కంతటికీ తానే రాణినని విర్రవీగుతూ ఉంటుంది. ఆమె పెదవులు బొటన వ్రేలుతో మూయగలిగినంత చిన్నవి, వాటి రంగు పగడాలని తల దన్నేవే కాక గుండ్రని ముఖానికి, చూపులు తిప్పుకొనేటంతటి ఆకర్షణని తెచ్చి పెడుతూ ఉంటాయి.ముఖానికి రెండు వైపులా రెండు శ్రీకారాలు రాసినట్లుండే చెవులు, వాటి దిగువ వ్రేలాడే బుట్ట జుంకాలకే శోభనిస్తున్నట్లు ఉంటాయి. ఇక ఆమె పరువం, ఆమె యవ్వనం సరే, సరే ! పేరుకి తగినట్లే ఉంటాయి. అలాంటి అమ్మాయిని స్వంతం చేసుకోవాలని ఎవరికుండదు ! ఆ ఉద్దేశంతోనే సంపూర్ణ తండ్రి దగ్గరకి వచ్చాడా యువకుడు ! సంపూర్ణ తండ్రి ఒక రాక్షసి అధీనంలో ఉన్నాడు. ఆ రక్కసి అతనిని అతనికి తెలియకుండానే అడుగు లేని అగాధం లోకి రోజురోజుకీ అతనిని నెట్టుకుంటూ పోతోంది ! దాంతో అతను తనలోని ...