Skip to main content

వాసిష్ట చెప్పిన ఆంద్ర మహావిష్ణువు చారిత్రిక గాధ--సత్యప్రభ 5: బాపు వేసిన బొమ్మలతో సహా




రాజకాళి నత్యప్రభని  చూసి, “సత్యా! బాగావతి శుభ్రాంగి ఆనతి ప్రకారం కవిత్వ పర్వవ్క్ష ప్రారంభించు”అన్నది. సత్య ప్రభ లేచి తన ద్విపదలు ఆశువుగా పాడింది.

సత్యప్రభ---“చల  పర నారీ  ఫిశాచికి  తనదు వెలగల - హృదయము  బలియీయ వలదు
పరి పరి  విధముల  బోవు  భారము చేత - పరిణీత  మీరిన  ప్రణయము రోత.

మణిమాల......నర  రంభయైనను పర  నారి  వలదు-తరుణ  సోదరులార!  దైవంబు కలదు
నీ  కాంత  విడుచుట  నీచమైన  ఫని- ఫై కాంత బట్టుట  ఫాఫముల  గని.

 ధరణి..........నరునకు  ఫరనారి  నాశన  మాత్ర-  స్థిర  కళంకము  తెచ్చు  జీవితయాత్ర
ఫర  సుందరీలోల  ఫురుషుడు  చేయు – వర ఫుణ్య  కర్మ ముల్వరుసగా మాయు

మధువాణి.......ఎగ్గు చేష్ట  పరుని  ఇల్లాలి  ఫాల -  తగ్గును  మర్యాద  దానిచే  చాల
నరులెంగిలి  భుజింఫ నగుదురువాడ – పరనారి  ఎంగిలి  పరికించి చూడ

ఫలిని.......చోరత  ఒక్కని  శుభముల  బాఫు – జారత  బాఫును  జాతుల  ఏఫు
పర పద్మ  లోచనా  భజనమ్ము తఫ్ఫు – ఫురుషుడా, దానిచే   పొసగును ముఫ్ఫు

రథిని........పరనారి  సద్ధర్మ  వధశాల  సుమ్ము – వరమతీ!  ఫెద్దల  వాక్యంబు  నమ్ము
 ఫిల్లరా  చిన్నది  పెఱభామ  నీకు – తల్లిరా  పెద్ధది  తలవంఫు  తేకు

రాజకాళి--   పై నారి  వంచించి  పట్టిన  కామి – స్నానాలు  జఫములు  సలిఫిన  నేమి
పర  నారి  సోకించు  పాపంబు  ఫండి – స్మరుడీశు నయనాగ్ని చచ్చెను  మండి

పరనారీ  పరాజ్ఞ్ముఖుని  స్తుతిస్తూ, ఒక్కొక్కొరు ఒక  ద్నిఫదను  రచించవలెను అని  శుభ్రాంగి  ఆదేశించింది.

సత్య ప్రభ........చలు  చేయజాలదు   స్వైరిణి ఎవని – విలసిల్లు  నాతఢు వీరుడై  యవని.

మణిమాల...  అన్య  కాంతలఫట్ల అచలుడే మౌని – ధన్యుడు ముదముతో ధర  మోయు వాని

ధరణి ---  తను గాత్రి  నన్యను  దలఫని వాడు-జనధాత్రి  సద్ర్వత  శాలుల  రేడు

మధువాణి--   పర  భుక్తమగుచుండు ఫలల  పిండంబు – నిరసముగా  చూచు నరుడు రత్నంబు

ఫలిని  ...లలితాన్య  సతులపై  లౌల్యము  విడిచి – ఫలితుడైన సుకృతి  పద ఫద్మము  శుచి

రథిని---     ధర  నెందరో  ధర్మధారుల  కన్న – తరుణు  లన్యల  యెడ  దాంతుడు  మిన్న

రాజకాళి........కల్లు  ద్రావిన  గూడ  కలుషిగా  డతడు – చెల్లెలుగా  నన్యు  చెలి  చూచు  నెవడు

ఒక్కొక్క  కవీశ్వరి  తనకు  శ్రేష్టంగా  తోచిన  ధర్మాన్ని  భోదిస్తూ ఒక్కొక్క  ద్విఫదను  రచించాలి అని  ఆదేశించింది  శుభ్రాంగి. వారు ఈ  విధంగా   ఆశువులు  అల్లారు.

సత్యప్రభ.....మూడిన విఫదను ముందుండి త్రోలి – నాదుకొన్నతి   సేత నరుల  ధర్మంబు.

మణిమాల  తూచాలు  తప్పక  తొలిఫల్కు  చెప్పు – నాచారమున  నిష్ట  యమల  ధర్మంబు.

ధరణి      సభలోన  చాటెద  సర్వజీవులకు – నభయ ప్రదానమే  యధక  ధర్మంబు.

మధువాణి    సత్యమే  జగమున  నిత్య  ధర్మమని  -అత్యంత  మెరిగిన  ఆర్యుల  పలుకు

ఫలిని,,,,,,,,,సర్వభూతంబుల  సమబుద్దీతోడ  - గర్వంబు  వర్జించి  కనుట  ధర్మంబు

రథిని---     తనువు  లోఫల  నుండు  తనయందు నిల్చి – తనివును మరచుట  తల్లి ధర్మంబు        

రాజకాళి--   ఆలును  బిడ్డల  నత్యాదరమున- ఫాలించుచుండుట  పరమ  ధర్మంబు

ఎవరికి  తోచిన విధాన వారొక్కక్క ద్విఫదతో  రెండేసి  ఫదార్థాలను  జయగానం  చేయండి. అని  మరల ఆదేశించింది..  వారు ఇట్లా కీర్తించారు.

సత్యప్రభ--   కార్యము  సాధంచు  కత్తికి  జయము –మర్యద దాటని  మాటకి  జయము

మణిమాల--  నిరతము ఫనిచేయు నేతకు జయము- నరులు  సుఖించెడు నాడుకి జయము

ధరణి---      చిత్తము  మెచ్చిన  చేతకు జయము—సత్తువ  కల్గన  శాంతికి  జయము.

మధువాణి--   గెలిచిన వీరుని  కీర్తికి  జయము—నిలిచిన  పరపతి నీతికి జయము

ఫలిని---    కామము  మించిన  ప్రేమకు  జయము—సామకు  మూలమౌ  సమతకు  జయము

రథిని---    అఖిలము  నందుండు  ఆత్మకు  జయము—నిఖిలము  మఱచిన  నిష్టకు  జయము

రాజకాళి--  అని  గెలిపించెడు   ఆటకి  జయము—పని నడిపించెడు  ఫాటకు  జయము

"అని  గెలిపించెడి  ఆట  అంటే  ఏమిటి?  అని  అడిగింది  లీలావతి. “మంఢల ప్రచారం” అని  బదులిచ్చాడు  ఆచార్య  విషమసిద్ధి,   మహారాజ్ఞి ఏమైనా  అడగవచ్చును”  అని  పల్కింది  శుభ్రాంగి,  ఆమె ఏమీ అడగలేదు. తిరిగి ఇలా  అడిగింది  శుభ్రాంగి.  అనురక్త  రమణిని నధికరించి ఒక్కొక్క రొక్కక్క  ద్విఫదను రచించండి.  వారు ఇలా  గానం  చేసారు.

సత్యప్రభ--   సన్నుత  రతిభావ  సౌమ్య  రమ్యాంగి – కన్నుల ఫండుగ  వెన్నెల  భంగి!

మణిమాల--   అనురక్త  చిత్తకు  అక్షిసన్మణికి—జనులార!  సుఖ  కోటి  సాటియే  సతికి.

ధరణి---   నగుమోము  గల చాన  నల్లనిదైన—మగనికి  లోకాన మరుఫాలవాన.

 మధువాణి--   ప్రేమ  ప్రసన్నమౌ  ప్రేయసి  ముఖము –శ్యామ చిహ్నము లేని చంద్ర మండలము.

 ఫలిని---     ప్రేమ  మనంబున  పెరిగిన  చాలు—కామిని కన్నులు  కమల  దళాలు.

రథిని--     ధుమ ధుమలాడని  రమణి ముఖంబు- ఘుమ ఘుమలాడెడు  కనకాంబుజంబు.

రాజకాళి ---  పిలిచిన  వెంటనే  ప్రీతితో  పలుకు--  నలిన  దళాక్షియే  నాకంబు  మనకు.

శ్రీ  వారేమైన  అడుగ  వచ్చును”,అని  లీలావతి  భర్త ముఖాన్ని చూచి అన్నది. “ఇప్పుడు దేశానికి ఏమి  కావాలోఒక్కొక్క  రొక్కొక్క  ద్విఫదతో  నిర్దేశించి  చెప్పండి.”  అని  మహారాజు కోరాడు. మహారాజు  వాంఛానుసారం  వారు ఈ విధంగా  సూచించారు.

సత్యప్రభ--   ధనువున  దొంగల దండన  చేసి—ధనమును నిలబెట్టు  ధన్వి  కావలెను.

మణిమాల--  జన పీడకుల  దొంగజాడల  గనుచు—జనపతికి  వచించు  జనుడు  కావలెను.

ధరణి---   అందరి మతముల  కైక్యము  గూర్చు—మందును కనిపెట్టు  మౌని  కావలెను.

మధువాణి---   అహి భయమార్ఫగ  నధ్వను   జూపి—మహిపతి నడిపించు  మంత్రి  కావలెను.

ఫలిని--    మగవారి  నెచ్చించి  మాటల చేత—పగవారి  గెలిపించు  పడతి  కావలెను.

రథిని---    మెరిసెడి  లోఫలి  మెఱుపుపై  సరిగ--  గురి  చూప  గల్గిన  గురువు  కావలెను.

రాజకాళి--   ఆడుఛు  పాడుచు  నందరిలోన—వేడిని  చల్లార్చు  వేశ్య  కావలెను.

ఇక ఒక్కొక్క   రొక్కొక్క  ద్విఫదతో  మంగళగానము చేసి  సభను  ముగించండి.  అని  శుభ్రాంగి  చెప్పగా  వారు ఇలా  గానం  చేసారు.

సత్యప్రభ---    అమరుల  నాథుడౌ  హరికి  మంగళము-సమర మహాశక్తి  శచికి  మంగళము.

మణిమాల ---  పతిదేవు  నర్చించు  సతికి మంగళము-సతి నాదరించెడు  పతికి  మంగళము.

ధరణి --  మనలను  ఫాలించు  మహికి మంగళము-జన సమృద్ధంబైన  సభకు  మంగళము.

 మధువాణి ---  మనుజులలో  నుండు  మతికి  మంగళము-కనకాంధ్ర  సాహిత్య  కళకు మంగళము.

ఫలిని --    పర  కష్టహారి  భూపతికి  మంగళము-సరస విలాస  తత్సతికి  మంగళమ.

రథిని---   దివి  నుదయించెడి  రవికి  మంగళము- భువి నుదయించెడి  కవికి  మంగళము.

రాజకాళి---   లోకాన  జీవించు  మీకు  మంగళము-  శ్లోకాలు  రచియించు  మాకు  మంగళము.

ఆచార్య భవనంది అందరి కవిత్వము బాగున్నదని శ్లాఘించాడు. లీలావతీ దేవి కన్యా కవులు ఆరుగురికీ రత్న పతకాలను ఇచ్చి బహూకరించింది. రాజకాళికి ఎత్తి బహుమతిని ఇవ్వాలో తన మాననీయ సఖి ధవలాక్షిని అడిగింది ఆమె.

“మీ గుసగుసలు నాకు అర్థమయినాయి లెండి! మీ పక్షంలో ఎవరైనా సరే ద్విపదల దండను రచించి నాకు నాకు ఇస్తే పుచ్చుకొంటాను. అంతకంటే వేరే బహుమానం నాకు అక్కర లేదు” అన్నది రాజకాళి.

“కుమారీ! మన ప్రాసాదం లోని మహా సభకు సన్నిహితురాలైన మహా కవీశ్వరిని మనమే అర్చించాలి. కాబట్టి నీవే ద్విపదల దండని  కూర్చి అర్పించు” అని మహారాజ సుచంద్రుడు తన కుమార్తెను హెచ్చరించాడు. రథినీ కుమారి లేచి ఇట్లు సిద్ధ కవీశ్వరిపై జయగానం చేసింది.

“పరముని తెలిసిన పడతికి జయము / వరముని సదృశకు వామకు జయము.
స్థిరతర చిత్తకు జేత్రికి జయము / గురుతర భక్తికి గుణినికి జయము.

మధుమయ వచనకు మహిళకు జయము / మధుకర చికురకు మగువకు జయము.
దిక్కులు తిరిగెడు దేవికి జయము / వాక్కులు కురిసెడు వంద్యకు జయము.

సారస నయనకు సరళకు జయము / సారమెరింగిన సాధ్వికి జయము.
సురపతి రూపము నరపతి యందు / తిరముగా చూచెడు దీరకు జయము.

వరనయ బోధక వాణికి జయము / నరులను మించిన నారికి జయము.
ఆశు కవీశ్వరి కార్యకు జయము / పాశ  విముక్తకు భామకు జయము.”

“కుమారీ! నీవు కూర్చిన దండ మిక్కిలి బాగుంది. దాని లోని ఇంద్ర నీల మణులు ఎక్కువ తక్కువ లేక అన్నీ ఒక్క రకంగా అమరి ఉన్నాయి! నీకును, నీ తండ్రికిని, నీ సోదరులకును మంగళ మగును గాక!” అని రాజకాళి, రథినీ కుమారిని దీవించింది.

“మహా కవీశ్వరీ! మీ తండ్రిగారి పేరేమి?” అని ప్రశ్నించాడు మహారాజు.

“అతడు పేరు విడిచి పేరొందిన పెద్ద మనిషి. సంతానమును విడిచి సంతానమును కన్నా సాధువు. జాతి విడిచి జాతిని అలంకరించిన జంగముడు. తనువూ విడిచి తనలో వెలుంగు స్థావరుడు. నన్ను కనడానికి ముందే అతని అసలు పేరు అంతరించి పోయింది. మరొక పేరు వచ్చింది. అది కూడా నేను పుట్టిన పిమ్మట తుడుచుకొని పోయింది. ఇంకొక పేరు వచ్చింది. అదిన్నీ చాలకాలం నిలువ లేదు. కొసకు జనులు అతనికి మరొక పేరు పెట్టారు. ఆ కథలకేమి? నా రాజు ప్రశ్నించిన దానికి నేను సూటిగా బదులు చెప్పాలి కదా? నా తండ్రి పేరు ‘క గ చ జ బాబు.”

అందరూ నవ్వారు. రాజకాళి మాటలలో  నుండి ‘జటామునే’ ఆమె తండ్రి అని చాలమంది పోల్చుకొన్నారు. కగ చజ బాబు లోని ‘జ’ కారం నాల్గవ నామానికి  ఆద్యక్షరమని వారికి తెలిసింది. తక్కిన మూడు పేరుల ఆద్యక్షరాలే ‘క గ చ’ లని వారు సులభంగా ఊహించారు. ఆ వర్ణాలను ఆధారంగా తీసుకొని అతని తక్కిన మూడు పేర్లని పూర్ణంగా తెలుసుకోవడానికి బుద్ధిమంతులు ప్రయత్నం చేయడానికి పూనుకొన్నారు.

రాజుగారికి మాత్రం ఇదంతా అయోమయంగా కన్పించింది!

ఈ గడబిడలో రాజకాళి తన ఆసనం లేచి వడివడిగా పరిక్రమిస్తూ కొన్ని పాటలు పాడుకొంటూ అ సభను దాటి పోయింది. ఆ పాటలు ఈ విధంగా అందరికీ వినిపించాయి.

“ రాజును పాలించు రామని లీలమ్మ / రాజుని ప్రేమించు రామ రాజమ్మ.
భర్తకు ప్రియమైన భామ లీలమ్మ / భర్తకు హితయైన భార్య రాజమ్మ.

నాధుని బంధించు నాతి లీలమ్మ / నాధుని ధ్యానించు నారి రాజమ్మ.
వల్లభు నేలెడు వామ లీలమ్మ / వల్లభు కొలిచేడు వనిత రాజమ్మ.”

 ఆ పాటలు మహారాజ సుచంద్రుని శ్రోత్రములలో ప్రత్యుప్తములైనట్లు  నిలిచి పోయాయి ! మహారాణి హృదయం భయాందోళనలతో కల్లోల సముద్రం లాగు క్షోభించింది !

*****************
10 వ ప్రకరణం:

ఆ నాడు సాయంత్రం కుమార భోగనాధుని ఏకాంత శాలలో రసిక యువకుల గోష్టి జరిగింది. అందులో పాల్గొన్నవారు నలుగురు—‘కుమార భోగనాధుడు, దండనాయక రణేశ్వరుడు, దండనాయక రుద్ర సేనుడు, సహస్రపతి వీరసింహుడు.

భోగనాధుడు శాస్త్ర పాండిత్యం లోను, శాస్త్ర పరిచయం లోను సాధారణ స్థాయిలో శిక్ష పొందిన వాడు. నీటి శాస్త్రం అతని అభిమాన విద్య. అతని దృష్టిలో అర్థ సంపాదకుడే ప్రయోజకుడు. ఇష్ట విషయోపభోగ మొక్కటే సంసార లక్ష్యం. అతని రూపం స్త్రీ జనాకర్షకం. మాటలు సర్వ జనాకర్షకాలు చేతలు మాత్రం ఇప్పటికి ప్రజలు హర్షింప తగినవి ఏమిన్నీ లేవు!

దండనాయక రణేశ్వరుడు చిత్రకూట మహా మండలేశ్వరుని కుమారుడని పాఠకులకి విదితమే! అతడు భోగనాధుని సమ వయస్కుడు. శస్త్ర, శాస్త్ర విద్యలను చిత్రకూటం లోనే నేర్చుకొన్నాడు. సాధారణ రూపవంతుడు. ఆచరణ లాలసుడయినా ధర్మాన్ని శ్లాఘిస్తాడు తన అమిత వ్యయాన్ని ధర్మాల క్రింద లెక్క వేసుకొంటాడు. అతని వ్యయంలో నూటికి పది ధర్మం క్రింద అని అతని ఆయ వ్యయ నిరీక్షకుడు చెబుతాడు. ఆ పది కూడ స్త్రోత్ర పాఠకులకి ఇచ్చిందే! ఇతని సామర్థ్యం మాట ఎలా ఉన్నా తన చేతి క్రింద ఉన్న అధికారులను పీడించుటలో మహామహుడు. ఇతనికి తెలిసిన నీటి శాస్త్రమంతా అచ్చు గుద్దినట్లు అబద్ద మాడడమే!

దండనాయక రుద్రసేనుడు మహామంత్రి సునందుని పౌత్రుడు! వీని చిన్నతనం లోనే తండ్రి మరణించాడు. మేనత్తలకు, పినతండ్రికి, తాతకు వీనిపై మిక్కిలి అభిమానం. పితామహికి వీడు ముద్దుల మనుమడు. తల్లికి ప్రియ పుత్రుడు. వీర పరీక్షలో మొదటి శ్రేణి యందు ఉత్తీర్ణుడు అయ్యాడు. మంచి రూపవంతుడు, గొప్ప వ్యుత్పన్నుడు, భోగనాధుని శిరస్సు ఆంద్ర సామ్రాజ్యాభిషిక్తమైన తక్షణం ఇతని శిరస్సు సైన్యాధిపత్యాభిషేకం కాగలదని వీర సింహాదుల విశ్వాసం! ఆలస్యమంటే ఇతనికి గిట్టదు! లీలావతీ దేవి ప్రతి దినం ఒకసారైనా వీడిని  పొగడుతుండడం అలవాటు! రథినీ కుమారిని ఇతనికిప్పించే ప్రయత్నాలలో ఇదొకటి! ఇతనికి మాటి మాటికి సేనాపతి గారి ఇంటికి పోవడం అలవాటు. అట్లా వెళ్ళడం తటస్తించినప్పుడల్లా, యధోచితంగా ప్రసంగించడం పరిపాటి.

సహస్రపతి వీరసింహుడు మనకు చిరపరిచితుడే! వాణి గాయానికి సత్యప్రభ వేసిన మందు కాక, అక్షోభ్య ముని వేరొక మందు వేసి కట్టు కట్టాడు. ఆ గాయం ఇతరుల దృష్టిలో పడకుండా వస్త్రం కప్పుకొని ఉన్నాడు. ముని మందు ప్రభావం వల్ల గాయపు పీడ ఈ దినం ప్రాతఃకాలానికి పూర్తిగా తగ్గిపోయింది.

ఈ నల్గురున్నూ పరస్పరం బందుగులే కాక స్నేహితులు కూడాను! రణేశ్వరుడు తక్కిన మువ్వురుతో వరస గోష్టులలో పాల్గొంటున్నా, వ్యభిచారం కిట్టని వాడు. వ్యభిచారం దోషమే కాదని వాదించు వారిలో వీరస సింహుడు ప్రథముడు. భోగనాదుడు, రణేశ్వర వీర సింహులకు మధ్య వర్తిగా నటించినా, మనసా అతడు వీర సింహుని సమర్థిస్తూ ఉంటాడు! రుద్రా సేనుడు వ్యభిచారం కాక పోయినా, దాన్ని వ్యర్జించడం గొప్ప పుణ్య కార్యమని అంటాడు. ఆ చతుష్టయం మధ్య సంభాషణ ఆరంభించింది.

“ఈనాడు నారీ సభలో ఆ ఉన్మత్తురాలు  మిక్కిలి విజ్రుంభించింది ! మహారాజ్ఞిని గురించి జయగానం లేదు సరికదా, ఆ ఉన్మత్తురాలు జయగానంచే గౌరవించబడింది. దాని ఉన్మాదం ఒత్తి వేషమే అనిన్నీ, ఆమె సేనాపతి పక్షంలో ప్రచారకురాలు అనిన్నీ నా అనుమానం! నిండు సభలో మహారాజు తన భర్త అని వాగి పోయింది. ఆమెని ఖండించేవారే లేక పోయారు. అది పాడిన పాటలలో విషం నిండి ఉంది” అని ప్రసంగించాడు వీర సింహుడు.

వీరసింహ రుద్రసేనులు నారీ సభకి వచ్చి ఉన్నారు. వారిద్దరూ వెనక భాగంలో ఉంది పోవడం వల్ల రాజకాళి జయగానానికి గురి కాలేక పోయారు.

“పురుషులని గురించి ఆమె చేసిన జయ గానంలో మన పక్షస్తులు కావాలనే అవమానించ బడ్డారు! మా చిత్ర కూటంలో గాని ఇలాంటి అసభ్యపు కూతలు కూసి ఉంటే తక్షణమే బుద్ది చెప్పబడి ఉండును. ఇచ్చట దండించే నాథుడే లేదు! పెద్ద నాన్నగారు మిక్కిలి శాంత స్వభావులు కాబట్టి, దాని కూతలు చెల్లి పోయాయి.” అని తన సంతాపాన్ని వెల్లడించాడు రణేశ్వరుడు.

“నీవు నా భావనా భర్త అని చెప్పి, ఆమె మామయ్య నోటిని కట్టేసింది. తరువాత నెమలి వలె  పురి విప్పుకొని ఆట ఆడింది” అన్నాడు రుద్రసేనుడు.

“అలాంటి నాకాయ నూకాయ దుష్ప్రచారాలకి  భయపడ నవసరం లేదు. ఆమె జయగానంలో మహా బుద్ధి మంతుడైన భార్గవ విశాలాక్షుడు ‘కొంగగా’ కీర్తింపబడి అవమానించ బడ్డాడు. అతని మనస్సు పరితపించింది, నేను కనిపెట్టాను. అతడు దానికి తగ్గ ప్రతీకారం చేయక మానడు! ఇంకొక విషయం మన విశాలాక్షుడు చేసిన నీటి శాస్త్రం ప్రస్తుతం మన గురుకులంలో పాఠ్య గ్రంధంగా ఉంది. దానిని మగధ సామ్రాజ్య మహామంత్రి చాల పొగిడి ఉన్నాడు! ఆ ఉన్మత్తురాలు మనల్నిదూషించుకోనీ, విశాలాక్షున్ని దూషించింది. అదే మనకి కావాలి” అని చెప్పాడు భోగనాధుడు.

“కన్యా కవుల కవిత్వంలో ఎవరిది  బాగుంది?” వీర సింహుడు ప్రసంగాన్ని మార్చి అన్నాడు.

“బావ రుద్ర సేనుడే దీనికి బదులు చెప్పాలి. అతనికి సాహిత్య మర్మాలు చక్కగా తెలుసునని సాహిత్యా విద్యా విశారదుడు కాన్వ శుకనాసుడు పొగడి ఉన్నాడు.” అని బదులు చెప్పాడు రణేశ్వరుడు.

“అందరి కవిత్వం రమ్యంగానే ఉంది. వాటిలో ధరణి కవిత్వమయితే రమణీయతమం! ‘చిత్తము మెచ్చిన చేత, సత్తువ కలిగిన శాంతి’ –ఈ ప్రయోగాలు అద్భుతాలు! ఆమె వర్ణించిన ‘నాగు మోము గల చాన ఆమెయే అగును! ఆ ద్విపదలో ఆమె మూర్తీభవించి కన్పించింది. జీవం కల కవిత్వమంటే అలాగా ఉండాలి! ‘అందరి మతముల కైక్యము కూర్చు మందును కనిపెట్టు మౌని కావలెను’—ఎంత చక్కగా ఉందొ దాని భావము!” అని శాస్త్ర విజ్ఞానాన్ని ప్రదర్శిస్తూ అన్నాడు రుద్రసేనుడు.

“ఆ నల్లని నాయికకై ఎవరు తపస్సు చేస్తున్నారో!” అని పల్కాడు వీర సింహుడు.

“నీవు తెల్లని నాయుక కొరకు చేస్తున్న తపములో నూరవ వంతు చేస్తే నీకు  ఆమె (నల్లని నాయిక) లభించును, దారావతి అత్తయ్య వంటి బుద్దిహీనురాలు వారి ఇంట్లో ఇప్పటికీ లేదు!” అన్నాడు రుద్రసేనుడు.

 "ఫలినీ, ధరణుల విషయంలో తెలుపు, నలుపులొక్కటే వ్యత్యాసంగా ఉంటే, నేను అంతగా లక్ష్య పెట్టను.ఫలిని పెళ్ళాడిన వాణికి మహా సంపదను ఇచ్చే భాగ్య దేవత! ధరణి తానేమిన్నీ ఇవ్వజాలడు సరి కదా, ‘పదివేలకి తక్కువ కాకుండా సొమ్ము మనమే ఆమె కొరకు ఇచ్చుకోవాలి!’ఆమె పినతల్లి భర్త పతంగావధాని తన పెట్టె నిండుతే గాని, ధరణిని ఇవ్వడానికి అంగీకరించడు. ఆమె విషయంలో సర్వాధికారి అతడే!” ఆనాడు వీర సింహుడు.

“పతంగావధాని కన్యాశుల్కం పుచ్చుకొంటాడా?” ప్రశ్నించాడు రుద్రసేనుడు.

"దాన్ని కన్యాశుల్కం అని వాడు ఒప్పుకోడు. అది సంరక్షక దక్షిణ అని అనిపించుకొంటుంది పతంగావధాని దృష్టిలో!”

“పదివేలకి ధరణి లభిస్తే అది మిక్కిలి చౌక బేరమనే చెప్పాలి” అని చమత్కరించాడు భోగనాధుడు.

“శ్రీవారి కొరకు బేరం చేయమని సెలవా?” అని అడిగాడు వీర సింహుడు.

“నేను నా వ్యక్తిగత సౌఖ్యం కొరకు మాత్రమే పెండ్లాడడం నీతి విరుద్ధం! నా పెండ్లి నా భావి రాజ్యాధికారానికి లాభదాయకంగా ఉండాలి. అదే ముందుగా గమనించతగ్గ విషయం! అనంతరం గమనించ తగ్గవి విజ్ఞాన సౌందర్యాదులు. ‘అన్నాడు భోగనాధుడు.
 
“కవీశ్వరీ షట్కంలో ఇద్దరు చెల్లెండ్రు అగుచున్నారు. తక్కిన నలుగురి లోను భావి రాజ్యాధికారానికి ఎవ్వరూ లాభ దాయకులు కారని నా అభిప్రాయం! అలాంటప్పుడు అన్నయ్యకు నారీ కవి రత్నాలలో, ఒక్కరూ సిద్దించక పోవచ్చు! వివాహానికి, రాజకీయానికీ ముడి పెట్టడం సరికాదని నా మతం!”

“నారీ కవులలో సత్యప్రభను పెండ్లాడితే నా భావి రాజ్యాధికారానికి లాభదాయకంగా ఉంటుంది. ఆమె సుశిక్షితురాలైన వీరురాలు! మహా వీరుడగు మల్లికార్జునుడు ఆమె పెదతల్లి కొడుకు. వాడు ఆమెను స్వంత సోదరి కంటే ఎక్కువగా అభిమానిస్తున్నాడు! మహా వీరుడైన కాలనాధుడు వారి ఇంటివారిని అభిమానిస్తున్నాడని వినికిడి! ఆమెను పెండ్లాడితే స్వయంగా మూర్తీభవించిన శక్తి వాలే ఆమె రాష్ట్రానికి రక్షకురాలిగా ఉంటుంది! నేను ఉదాహరించిన మహా వీరులు నా పక్షంలో ఉంటారు” అని తన అభిప్రాయాన్ని వెల్లడించాడు భోగనాధుడు.

కుమార భోగనాదుడు సత్యప్రభను పొగడడం వీర సింహునికి కంటక ప్రాయంగా ఉండింది. ఆమె పొడిచిన పోటు  ఇంకా ఆరనే లేదు! వాణికి ఆమె భావి మహారాజ్ఞిగా అయితే తన పని సున్నా అని భావించాడు. అసూయ పాడాడు కూడాను! వెంటనే తన ప్రభువు అభిప్రాయాన్ని ఖండిస్తూ ఇలా అన్నాడు.

“సత్యప్రభనా శ్రీవారు పెండ్లాడేది!! ఆమెలో ప్రవహించేది బ్రాహ్మణ రక్తం కాదు. ఆ విషయాన్ని నేను  నిశ్చయంగా చెప్పగలను. ఈ రోజే ఆమె జన్మ రహస్యాన్ని ‘కాన్వ శుకనాసుడు నాతొ ముచ్చటించాడు. కౌళిక సులోచనుడు, విధవయైన కాత్యాయని యందు కన్నా పిల్ల ఆమె! శ్రీవారు నాగకన్యను పెండ్లాడుట మేమెవ్వరం ఇష్టపడ లేము. మరొక మాట మనవి చేసుకొంటున్నాను. కాలనాధుడు కూడా టించాడు. కౌళిక సులోచనుడు కుమారుడే! న్యాయ స్థానంలో టించాడు. కౌళిక సులోచనుడే వ్యాజ్యం వేసాదట!” అన్నాడు ఆవేశంతో వీర సింహుడు.

“అపవిద్దులు పెంచిన జాతి వారికి చెందుతారని శాసనం స్పష్టంగా చెబుతోంది! ఆమె విధవా పుత్రికయే అయితే ఆమెను తన పుత్రికగా ప్రకటించాలని న్యాయస్థానానికి ఎక్కలేడు. విధవను సజాతీయుడు ఒఎన్ద్లి చేసుకోవడం ఆపద్ధర్మంగా అంగీకరించ బడినా, విజాతీయుడు గుప్తంగా చెరపడం మహాపరాధం అవుతుంది. శిశువును అడవిలో పారవేయడం అంతకంటే అపరాధం. కాబట్టి సులోచానుడు గాని, కాత్యాయని గాని బయటపడ జాలరు. వారు బయటపడనప్పుడు సత్యప్రభ బ్రాహ్మణ కన్య కాదని చెప్పడానికి ఎవరికిని అధికారం లేదు. ఆమె ఎవరి కన్యగా ఉన్నా సరే, మనకా ప్రసక్తి అవసరం లేదు! సత్యప్రభ గ్రాహ్య అనే నా మతం! అపవిద్ధులకు పెంచిన జాతి రాదంనచో మన వీరేశ్వర బాబుగారి విషయంలో చిక్కు వస్తుంది. మా పిన్నిని వీరేశ్వర బాబుగారికి ఇచ్చునప్పుడు తాతయ్య ఈ శాస్త్ర సందేహాన్ని కుల పరిషత్తులో తీర్చుకొనే సంబంధం చేశారట!” అని తన అభిప్రాయాన్ని సమర్తిన్చుకొన్నాడు భోగనాదుడు.

“సీతాదేవి అపవిద్ధ కాదా? సత్యప్రభ జన్మ కూడ అలాంటిదే! ఆమెను అన్నగారు పరిగ్రహించ వచ్చుననే నా అభిప్రాయం” అని భోగనాధుని సమర్థించాడు రణేశ్వరుడు.

“స్త్రీ రత్నం దుష్కులాదపి –అని ఆనాడు శాస్త్రకారుడు. నాకీ సంబంధం పరమ సమ్మతంగా ఉంది. మల్లికార్జు నుడు చిన్న బాబుకు( శక్తి ధరుడు) స్నేహితుడు. అతడు తన ధర్మ సోదరిని చిన్నబాబుకు కుదర్చడానికి ప్రయత్నించవచ్చును. అందువలన మనము ముందే ప్రయత్నించాలి”అని చెప్పాడు రుద్రసేనుడు.

“తప్పకుండా ప్రయత్నిస్తాను” అని ధృఢ స్వరంతో చెప్పాడు భోగనాదుడు.

వీర సింహుడు తనలో ‘మీరు ప్రయత్నం చేయండి, నేను విఘ్నం చేస్తాను. ఎవరి గెలుస్తారో చూదాం’ అని తలపోసి, బహిరంగంగా ఇలా అన్నాడు.

“ఆ సంబంధం ఒకవేళ కుదరక పొతే వేరే ఎక్కడ ప్రయత్నిస్తే బాగుంటుంది?”

“అప్పుడు ఆలోచిద్దాం” అని అన్నాడు భోగనాదుడు. నిర్లక్ష్యంగా!

******************

Comments

Popular posts from this blog

చిలక రథంలో సరదా షికారు—( పెద్దలకు, పెళ్లైన వారికి మాత్రమే)

     ( ఈ బ్లాగులోనే టపా కొట్టిన కొన్ని సరస శృంగార కథల సమాహారం )     స్వస్తి శ్రీ చాంద్రమాన విరోధి నామ సంవత్సర జ్యేష్ట అమావాస్య , మృగశిరా నక్షత్ర యుత , సోమవార పర్వదినం, రోమన్ కేలండర్ ప్రకారం ఆ రోజు తేదీ 22.06.2009.     రాత్రి రెండు ఝాములు దాటి , ఒంటి గంట అయింది !     రుద్రాభిషేకం జరుగుతోంది.!     అది క్షీరారామ క్షేత్రంగా ప్రసిధ్ధికి ఎక్కిన ‘శ్రీరామ లింగేశ్వర స్వామి వారి ఆలయం. శివుడు తన త్రిశూలపు మొనని, నేలపై ఆనించగా, అక్కడ నుండి, ‘క్షీర ధార’ పైకి ఉబికి,‘ పాలకొలను’ ఏర్పడిందట ! ఆ కొలను గట్టున శ్రీమహా విష్ణువు పూర్ణావతారమైన, శ్రీరామ చంద్ర మూర్తి , సీతమ్మ వారితో కలసి, తమ స్వహస్తాలతో , ‘శ్రీ రామ లింగేశ్వర’ప్రతిష్ట చేసారట !     ఆ విధంగా శివ-  కేశవుల పవిత్ర స్పర్శతో పునీతమయిన క్షేత్ర రాజం అది !     ‘పినాక పాణి’ , అతని కుటుంబ సభ్యులు, శ్రీ రామ లింగేశ్వర స్వామి వారి, అభిషేక కార్యక్రమం ముగించుకొని, మూడవ గంట కల్లా, తనతో పాటు తెచ్చుకొన్న ‘మినీ బస్సులో’ తిరుగు ముఖం పట్టారు.     పినాక పాణి బహు కుటుంబీకుడు ! అతనికి ఆరుగురు చెల్లెళ్లు, ముగ్గురు తమ్ముళ్లు ఉన్నారు ! అమ్మయిలు మువ్వురికీ , అతనికీ, పెళ్లిల

నీల గ్రహ నిదానము 3

నీల గ్రహ నిదానము 3 (రెండవ దృశ్యము.) ( దక్ష వాటిక ) ( దక్షుడు ఒంటరిగా ఒక శిలా ఫలకం మీద కూర్చొని ఉంటాడు.) దక్షుఢు --- “ ఓం నమో నారాయణాయ ! ఓం నమో నారాయణాయ !! ఓం నమో నారాయణాయ !!! ” (అని జపిస్తూ ఉంటాడు ) ( తెర లోంచి కూడా “ ఓం నమో నారాయణాయ “ అని వినిపిస్తుంది.) ( దక్షుడా ప్రతి ధ్వని విని, నామ జపాన్ని ఆపి చూస్తాడు ) ( ప్రవేశం--- నారదుడు, నారాయణ మంత్రం పఠిస్తూ ) నారదుడు --- దక్ష ప్రజాపతీ ! బ్రహ్మ మానస పుత్రుడైన ఈ నారదుడు, ఉపబ్రహ్మవు, పితృ తుల్యులైన మీకు నమస్కరిస్తున్నాడు. దక్షుడు --- దీర్ఘాయురస్తు ! నారదా ! ఎచటి నుండి నీ రాక ? నారదుఢు ---- బాబాయి ! నా రాక మాటకేం గాని, మీ పోకడలు మాత్రం విచిత్రంగా ఉన్నాయి. ఇలా ఒంటరిగా ఆరు బయట కూర్చొని, నారాయణ స్మరణ చేయాల్సిన అవసరం మీ కేమొచ్చింది ? దక్షుడు --- సంసార జంజాటం లేని బ్రహ్మచారివి. సంతానం తెచ్చి పెట్టే సమస్యలు నీ కేమి అర్థమవుతాయి. నారదుడు --- మీ సంతానం నాకు సోదర తుల్యులు కారా బాబాయి ! అయినా నారాయణ స్మరణతో సమస్యా పరిష్కార

వేణీ సంహారము

వేణీ సంహారము (1ఈ కథానిక ఆంధ్రభూమి శనివారం తేది 11.2.2011 దిన పత్రికలో ప్రచురించ బడింది) నా భార్య ‘నీలవేణి’ చాలా అందమైనది. ముఖ్యంగా పేరుకి తగ్గట్లుండే ఆమె కబరీ భరం ! వర్తులాకారంలో ఎత్తుగా నిర్మించిన రెండు ఇసుక తిన్నెల లాంటి జఘనాల మధ్య, సన్నని పాయ లాంటి చీలికని స్పృశిస్తూ పొడవుగా ఒత్తుగా , జడలా బిగించినప్పుడు ‘త్రాచుపాములాగ’ విచ్చుకొన్నప్పుడు నెమలి వింజామరలా కనిపించే ఆ నీలవేణి సౌందర్యం బాపూ బొమ్మకే ఉంటుంది ! ఆమె చంద్రవదనాన్ని ఏ సినిమా దర్శకుడైనా చూసి ఉంటే,తప్పకుండా ఆమెకి ‘అమ్మవారి ’ పాత్రలు దక్కి ఉండేవి ! వెడల్పైన ఫాలభాగం మీద బాలారుణ సూర్య బింబం లాగ కనిపించే కుంకుమ బొట్టు, దాని క్రింద ధనస్సుల లాంటి కనుబొమలు, ఆ క్రింద మీనాల లాంటి కళ్లు. ఆ కళ్ల మధ్య నుండి ఎత్తుగా, ఠీవిగా నిటారుగా ఉండే ముక్కు, దానిక్రింద రుచులూరించే అధరాలు, పచ్చని బంతి పూవు లాంటి మేని ఛాయ, పొడవుకి తగ్గ శరీర సౌష్టవం, కలిగిన ఆమె, చూపరులకు చెయ్యెత్తి నమస్కరించాలనిపించే దేవీ కళలు ఉట్టి పడుతూ ఆకర్షణీయంగా ఉంటుంది. ఆమె నా భార్య కావడం నేను చేసుకొన్న అద