Skip to main content

వాసిష్ట చెప్పిన ఆంద్ర మహావిష్ణువు చారిత్రిక గాధ --సత్యప్రభ --21: బాపు వేసిన బొమ్మలతో సహా


  42 వ ప్రకరణము      
మహానంది పురానికి ఈశాన్య దిశలో ఒక పెద్ద కోనేరు ఉంది. దానిలోని నీరు తామరాకులచే కప్పబడి బయటికి కన్పించదు ! కోనేరుకు నిండుగా తామర పువ్వులు, మొగ్గలు ఉన్నాయి.కోనేరు ఒడ్డున ఒక విశాలమైన పదహారు స్తంభాల మంటపం ఉన్నది.

రాత్రి మొదటి యామంలో చాలావరకు దాటింది. ప్రక్రుతి చీకటి తెరలో మాటు మణిగి ఉంది. చీరండల నాదం, నక్కల ఊళలు తప్ప వేరే అలికిడి లేదు!

తామరకొలను అవతల ఆవలిగట్టు ప్రక్కగా శ్మశానవాటిక ఉంది. పట్టణం అంతటికీ అదే శ్మశానవాటిక.

ఆ మంటపంలో ఇద్దరు మనుష్యులు కూర్చొని మాట్లాడు కొంటున్నారు. వారిద్దరూ నల్లని ఉడుపులు ధరించి చీకటితో ఐక్యం చెంది ఉన్నారు.

“వీరమల్లూ! నీవు చుట్టు ప్రక్కల బాగా పరికించి రా! అప్పుడు గాని అమనం మాట్లడుకోరాదు!”

“దొరా! ఎవరూ లేరు. చూసే వచ్చాను.”

“సరే! ఇప్పుడు నీవు విషయాన్ని సన్నని స్వరంతో వెల్లడించు.”

“దొరా! వారందరూ ఎల్లుండి అర్థరాత్రి వేళ దొడ్డి ద్వారంలో నుంచి కోటలోకి ప్రవేశించడానికి నిశ్చయించారు.”

“మొత్తం ఎంతమంది ఉంటారు?”

“నూరు మంది దొరా! వాందరికీ నాగసేనుడు నాయకుడు.”

“ నాగసేనుడా! మంచి గడుసువాడే, సాధారణంగా లొంగే రకం కాదు, ఆ తరువాత?”

“ ఆ నూరు మందిలో నేను ఒకణ్ణి, దొరా ! నేను మీతో పరిచయం కలిగి ఉన్న విషయం వారికి తెలియదు.”

“నేను ఈ ప్రాంతాల్లో ఉన్న విషయం వారికి తెలియదా?”

“ తెలుసు దొరా!”

“  ఆ తరువాత విషయం చెప్పు.”

“చోర పరమేశ్వరుడు భీమనాథ బాబు కౌండిన్యుల పక్షంలో చేరిపోయాడు. అతని కంట నీవు పడవద్దు.” అని నాగసేనుడు నన్ను హెచ్చరించాడు.

“మీ నూరు మందిలో మన పక్షం చేరేపోవలసిన వారు ఎవరైనా ఉన్నారా?”

“లేరు దొరా! అందరూ నాగజాతి వారినే చూచి నియమించాడు పెద్దదొర. నేను ఒక్కడినే భిల్ల జాతి వాణ్ణి.   ఎల్లుండి రాత్రి మల్లిక అనే రాజకుమార్తె చేటిక దొడ్డిద్వారం తెరచి ఉంచుతుంది.”

“ మల్లికను మీరు ఎలా పట్టారోయ్?”

“వెండి చెప్పుతో మల్లికను మర్దించాము అని నాగసేనుడు అన్నాడు.”

“తరువాత ఏమి చేయదలచు కొన్నారు?”

“ఎల్లుండి రెండవ యామంలో పెద్దదొర ఐదువేల సైన్యంతో కోటను ముట్టడిస్తాడు. మేము నూరుగురం కోటలోని పహరాదార్లను మాటు మాయం చేసి కోట సింహద్వారం తెరచి ఉంచుతాము. కోట లోపలికి  సైన్యం ప్రవేశిస్తుంది! వీర తాండవం కావిస్తుంది. ఈ ప్రకారం మహానంది పుర దుర్గం నాగుల వశమై పోతుంది.”

" కోటలో సైన్యం ఉండదా?”

“ ఉన్నా, లేనట్లే దొరా! కుంతల దేశపు దొర యుద్ధానికి వస్తాడని మా వారు విరివిగా ఒక వార్తను ప్రచారం చేసారు. మహామండలేశ్వరుడు సేనాపతి మాటలు నమ్మి దేశ భక్తులైన దండనాథులను సైన్యాలతో సరిహద్దు ప్రాంతాలకు పంపించాడు. సేనాపతి కారవేలుడు మా పక్షమై ఉన్నాడు. కాబట్టి కోటలో అట్టే చెప్పుకోతగ్గ ప్రతిఘటన ఉండదు!”

 “సేనాపతి కుట్రదారులతో చేరడానికి మీవారేం ప్రలోభం చూపించారు?”

“రత్నప్రభా కుమారిని బలవంతంగానైనా పెండ్లి చేయించి కొంత జాగీరు ఇస్తామని ఆశ చూపించి ఉన్నారు.”

“మల్లూ! ఈ సైన్యం అంతా ఎక్కడనుంచి వస్తుంది?”

“ఈ ప్రాంతాల్లోనే చాలామంది నాగులు ప్రచ్చన్న వేషాలలో నాగరిక ప్రజల వలె ఉన్నారు దొరా! వారినందరినీ ఒకటిగా చేర్చుకొన్నాడు పెద్ద దొర.”

“మంచి చక్కని పథకం వేసాడు నిశుంభుడు! కాని ఈ ప్రాంతాల్లో మహా సింహం తిరుగుతున్నాడని తెలుసుకొన్నా, నిర్లక్ష్యం చేశాడు. ఇప్పుడు వాడు తన పొరపాటుని గ్రహించుకో గలడు. సరే, మల్లూ! నీవు వెళ్ళవచ్చు. మళ్ళీ మనం ఎల్లుండి కోటలోనే కలుసుకొందాం.”

వీరమల్లు భీమనాథునికి అభివాదం చేసి వెళ్ళిపోయాడు. భీమనాథుడు ఆ మంటపంలో కొంత సేపు కూర్చొని ఆలోచనా ముద్రలో మునిగి పోయాడు. వాని మెదడులో ఆలోచనా తరంగాలు దొర్లిపోతున్నాయి. సాహస ప్రియుడైన ఆ ఆంధ్ర యువకుడు తనకు సమకూడిన అవకాశాన్ని ఆనంద ప్రఫుల్ల హృదయంతో స్వీకరించాడు.

శ్రీశైల మహామండలం అపాయకర పరిస్థితిలో ఉంది! అమాయకుడైన మహామండలేశ్వరుడు సత్యకర్మ ద్రోహి యైన తన సేనాధిపతి కారవేలుని నమ్ముకొని గొప్ప అగాధం అంచులో నిలబడి ఉన్నాడు. ఏ సమయంలో కాలు జారి పడతాడో అన్నట్లుంది అతని స్థితి!

ఆంద్ర సేనాపతికి భీమనాథుడు ఒక గూఢమైన లేఖ రాశాడు కదా? ఆ లేఖను అనుసరించి అతనికి సహాయంగా రెండు వందల మంది ఆరితేరిన యోధులు శతపతి కనకసేనుని నాయకత్వంలో వచ్చి ఉన్నారు. వారందరూ మారు వేషాలతో మహానందిపుర ప్రాంతాల్లో వేచి ఉన్నారు.

ఈ రెండు వందల మంది సైన్యంతో నిశుంభుణ్ణి  ఎదిరించడం అవివేకమని తలచాడు భీమనాథుడు. ఈ విధంగా సాధ్యాసాధ్య విచారణలో పడిన భీమనాథునికి తాత్కాలికంగా ఒక ఉపాయం తోచింది! ఆ ఉపాయాన్ని అనుసరించి ఉత్తరోత్తర కార్యక్రమాన్ని సరిపెట్టు కోవడానికి తీర్మానించాడు.

భీమనాథుడు లేచి నగరాభిముఖుడై బయలు దేరాడు.

Comments

Popular posts from this blog

చిలక రథంలో సరదా షికారు—( పెద్దలకు, పెళ్లైన వారికి మాత్రమే)

     ( ఈ బ్లాగులోనే టపా కొట్టిన కొన్ని సరస శృంగార కథల సమాహారం )     స్వస్తి శ్రీ చాంద్రమాన విరోధి నామ సంవత్సర జ్యేష్ట అమావాస్య , మృగశిరా నక్షత్ర యుత , సోమవార పర్వదినం, రోమన్ కేలండర్ ప్రకారం ఆ రోజు తేదీ 22.06.2009.     రాత్రి రెండు ఝాములు దాటి , ఒంటి గంట అయింది !     రుద్రాభిషేకం జరుగుతోంది.!     అది క్షీరారామ క్షేత్రంగా ప్రసిధ్ధికి ఎక్కిన ‘శ్రీరామ లింగేశ్వర స్వామి వారి ఆలయం. శివుడు తన త్రిశూలపు మొనని, నేలపై ఆనించగా, అక్కడ నుండి, ‘క్షీర ధార’ పైకి ఉబికి,‘ పాలకొలను’ ఏర్పడిందట ! ఆ కొలను గట్టున శ్రీమహా విష్ణువు పూర్ణావతారమైన, శ్రీరామ చంద్ర మూర్తి , సీతమ్మ వారితో కలసి, తమ స్వహస్తాలతో , ‘శ్రీ రామ లింగేశ్వర’ప్రతిష్ట చేసారట !     ఆ విధంగా శివ-  కేశవుల పవిత్ర స్పర్శతో పునీతమయిన క్షేత్ర రాజం అది !     ‘పినాక పాణి’ , అతని కుటుంబ సభ్యులు, శ్రీ రామ లింగేశ్వర స్వామి వారి, అభిషేక కార్యక్రమం ముగించుకొని, మూడవ గంట కల్లా, తనతో పాటు తెచ్చుకొన్న ‘మినీ బస్సులో’ తిరుగు ముఖం పట్టారు.     పినాక పాణి బహు కుటుంబీకుడు ! అతనికి ఆరుగురు చెల్లెళ్లు, ముగ్గురు తమ్ముళ్లు ఉన్నారు ! అమ్మయిలు మువ్వురికీ , అతనికీ, పెళ్లిల

నీల గ్రహ నిదానము 3

నీల గ్రహ నిదానము 3 (రెండవ దృశ్యము.) ( దక్ష వాటిక ) ( దక్షుడు ఒంటరిగా ఒక శిలా ఫలకం మీద కూర్చొని ఉంటాడు.) దక్షుఢు --- “ ఓం నమో నారాయణాయ ! ఓం నమో నారాయణాయ !! ఓం నమో నారాయణాయ !!! ” (అని జపిస్తూ ఉంటాడు ) ( తెర లోంచి కూడా “ ఓం నమో నారాయణాయ “ అని వినిపిస్తుంది.) ( దక్షుడా ప్రతి ధ్వని విని, నామ జపాన్ని ఆపి చూస్తాడు ) ( ప్రవేశం--- నారదుడు, నారాయణ మంత్రం పఠిస్తూ ) నారదుడు --- దక్ష ప్రజాపతీ ! బ్రహ్మ మానస పుత్రుడైన ఈ నారదుడు, ఉపబ్రహ్మవు, పితృ తుల్యులైన మీకు నమస్కరిస్తున్నాడు. దక్షుడు --- దీర్ఘాయురస్తు ! నారదా ! ఎచటి నుండి నీ రాక ? నారదుఢు ---- బాబాయి ! నా రాక మాటకేం గాని, మీ పోకడలు మాత్రం విచిత్రంగా ఉన్నాయి. ఇలా ఒంటరిగా ఆరు బయట కూర్చొని, నారాయణ స్మరణ చేయాల్సిన అవసరం మీ కేమొచ్చింది ? దక్షుడు --- సంసార జంజాటం లేని బ్రహ్మచారివి. సంతానం తెచ్చి పెట్టే సమస్యలు నీ కేమి అర్థమవుతాయి. నారదుడు --- మీ సంతానం నాకు సోదర తుల్యులు కారా బాబాయి ! అయినా నారాయణ స్మరణతో సమస్యా పరిష్కార

వేణీ సంహారము

వేణీ సంహారము (1ఈ కథానిక ఆంధ్రభూమి శనివారం తేది 11.2.2011 దిన పత్రికలో ప్రచురించ బడింది) నా భార్య ‘నీలవేణి’ చాలా అందమైనది. ముఖ్యంగా పేరుకి తగ్గట్లుండే ఆమె కబరీ భరం ! వర్తులాకారంలో ఎత్తుగా నిర్మించిన రెండు ఇసుక తిన్నెల లాంటి జఘనాల మధ్య, సన్నని పాయ లాంటి చీలికని స్పృశిస్తూ పొడవుగా ఒత్తుగా , జడలా బిగించినప్పుడు ‘త్రాచుపాములాగ’ విచ్చుకొన్నప్పుడు నెమలి వింజామరలా కనిపించే ఆ నీలవేణి సౌందర్యం బాపూ బొమ్మకే ఉంటుంది ! ఆమె చంద్రవదనాన్ని ఏ సినిమా దర్శకుడైనా చూసి ఉంటే,తప్పకుండా ఆమెకి ‘అమ్మవారి ’ పాత్రలు దక్కి ఉండేవి ! వెడల్పైన ఫాలభాగం మీద బాలారుణ సూర్య బింబం లాగ కనిపించే కుంకుమ బొట్టు, దాని క్రింద ధనస్సుల లాంటి కనుబొమలు, ఆ క్రింద మీనాల లాంటి కళ్లు. ఆ కళ్ల మధ్య నుండి ఎత్తుగా, ఠీవిగా నిటారుగా ఉండే ముక్కు, దానిక్రింద రుచులూరించే అధరాలు, పచ్చని బంతి పూవు లాంటి మేని ఛాయ, పొడవుకి తగ్గ శరీర సౌష్టవం, కలిగిన ఆమె, చూపరులకు చెయ్యెత్తి నమస్కరించాలనిపించే దేవీ కళలు ఉట్టి పడుతూ ఆకర్షణీయంగా ఉంటుంది. ఆమె నా భార్య కావడం నేను చేసుకొన్న అద