Skip to main content

కొరకంచులో ఇనప మేకు--13












గవాక్షములు  సరేసరి!  వృత్తాకారంలో  అలంకరింపబడి,  పూలదండలలా కన్పడు తున్నాయి. ఆ ప్రాసాద  మధ్యంలో  పెద్దపడవలాంటి  పందిరిమంచం, వాటి  పైన  స్వర్ణ కాంతులీనే  పట్టు  ఆవరణముల మధ్య  మృదువైన  హంసతూలికా  తల్పము,  దిండ్లు  అమర్చబడి  ఉన్నాయి.

పారిజాత, సౌగంధికా పుష్పసౌరభాలు ఆ  ప్రదేశాన్నంతా  ఆవరించి  మత్తు  గొలుపుతున్నాయి. పర్యంకము పైన నలకుబేరుడు కూర్చొని ఉన్నాడు. ఇంద్రునితో, చంద్రునితో, మన్మధునితో సరి తూగే  సుందర  యువకు డతడు. సాక్షాత్తు  రంభయే  భార్యయైనను, అతడు నిత్యనూతన యక్షిణీ  కాంతల పరిష్వంగమూ కోరువాడు.  
          
రాజ్యము  అతనిది,  యక్షులు  అతని  పరిపాలిత  ప్రజలు. సుందరులైన  యక్షిణీ  కాంతలు కనుసన్నలలో  మెలగువారు. అదుపాజ్ఞలు  వర్తించని,  సర్వస్వతంత్ర  సుందర  మధుకరుడయిన అతనికి, సౌందర్య సుమ  నివాళు లిచ్చే  స్త్రీలకు  కొదవేమున్నది!
          
ఆ రోజు  యక్షకన్నియ“నీలా సుందరి:”  వంతు.
          
నీలాసుందరి అద్భుత సౌందర్యరాశి! పోత పోసిన  శరశ్చంద్రచంద్రిక!!, అలకాపురికి దిగిన భారతీ తేజోంశము!! మూర్తీభవించిన  ప్రసన్నత!! కుబేరుని కులదైవమైన మాహేశ్వరుని ఆమె అర్చించు  సమయమున, నిత్యమూ  తన  తలపై  మోయు ‘గంగని’  నిరసనతో  చూసాడట ఆ విరూపాక్షుడు ! పూజ చేసే  నీలా సుందరిని  చూసిన పిమ్మట!! అప్పటి  నుంచి  నీలా సుందరి, సాధనా మంత్రము ప్రముఖము అయింది! “బ్లూ వేం వద వద త్రీం హం ఫట్ !” అన్నదే ఆ మంత్రం!
         
నలకుబేరునికి ఈ  విషయం తెలుసు, అందుకే ఆ మంత్రాన్ని మనసులోనే స్మరించాడు అంతే! అందెల  రవళిని, మనసు  ఝల్లుమనేలా  విన్యాసం  చేస్తూ అరుదెంచింది  నీలా సుందరి. 

“తొందరెందుకు  ప్రియా! ఎలాగూ  వచ్చి  మీ ఒడిలో  వాలేదాన్నే  కదా! అంతలోనే  మంత్రజపం  దేనికి” అంది.  ఆ  గదికే  వెలుగునిచ్చేలాంటి  చిరునవ్వుతో!
          
“దేవీ!  నిరీక్షణ అసహనమయిపోయింది. అందుకే  మంత్రంతో  నీకు  బంధం  వేసి......”
          
“మంత్రంతో  వేసే  బంధనాలకు  నేను  పడను, ప్రియా!”
         
“మరి, దేనితో  వేయాలి  దేవీ?”
         
“తంత్రంతో  స్వామీ!” అంది  నీలా సుందరి, అని, తన  చమత్కారానికి  తానే  సిగ్గు  పడింది.
      
 అలాగా! అంటూ  ఆమె  చేయి  పట్టుకొని,  తెల్లని  వెండిమబ్బు వచ్చి, చంద్రుణ్ని  చాటు చేసినట్లు,  నలకుబేరుడు  నీలా సుందరిని  కౌగిలిలోనికి  తీసుకొన్నాడు.
          
“నీలా ! ఇంత  జాప్యం ఎందుకు   చేసావు?”
          
 మీకు  ఇష్టమైన అలంకరణని  చేసుకోవాలని  ప్రయత్నం  చేసి ఎన్నో  యాతనలు పడ్డాను. అంత లోనే మీరు మంత్రపాశం వేసి లాగేసారు, దాంతో ఏ వన్నెచిన్నెలు లేకుండానే వచ్చేసాను, లోపాలకు భాద్యత వహించాల్సింది  ప్రభు సత్తములే !” అంది.
         
“అటులనా! అయిన  నీ అలంకరణ  చూడవలసినదే  సుమా!” అంటూ   ఆమెని  ఎత్తుకొని  తీసుకెళ్లి  పర్యంకం  పైన  పడేసాడు,  నలకుబేరుడు.  నీలా సుందరి  సిగ్గుతో  ముఖం  దాచుకొంటూ  బోర్లాపడింది. అతడామెని  వెల్లకిలా  త్రిప్పే  ప్రయత్నం  చేయలేదు, కారణం  నీలా సుందరి  పృష్టభాగ  సౌందర్యం!  జఘనాలపైకి  జాలువారే  దీర్ఘకేశాలని  మూడు  ముడతలుగా  ముడిచి,  వర్తులాకారంలో  తలపైకి కట్టింది.అంతవరకు  కేశాలతో కప్పబడి ఉండే  ఆమె  పొడవాటి  మెడ శంఖాకారంలో స్వచ్చంగా  కన్పిస్తోంది.  పయోధరాన్ని  ముడివేసి  బిగించిన  సన్నని పట్టుతాడు  తప్ప  ఆమె  వీపుపై  మరే   ఆచ్ఛాదన  లేదు.  మెడ  క్రిందనుండి  విశాలమై,  మృదువైన  చంద్రశిలా  పలఖం  లాంటి  ఆమె  వీపు, నడుము  దగ్గరకు  వచ్చేసరికి, కృశించి, కోల్పోయిన  తన  వైశాల్యాన్ని  ఖఘనాల  పైకి  పరిచింది. ఆ  జఘనాల   మీదకి  సడలిన  పట్టులంగా, వాటి  ఉన్నత  వర్తులాల  మధ్య  కనీ  కనపడని  చీలికని  కనువిందు చేయగా, తమకంతో  చూసాడతను. వెంటనే  మనసు నిలవరించుకోలేక వాటిని  ముద్దాడాడు.
           

నీలా సుందరి  తన  వీపు  పైన అతని  అధర  స్పర్శకి  బెదిరి  సన్నగా  వణికి. గగుర్పాటుని  సెలయేటి అలల్లా  మేనికంపనలతో  ప్రదర్శించింది. నలకుబేరుడు  ఆ  కదలికల్ని  వరుసగా  చుంబించాడు.  పరవశాన్ని భరించలేక  ఆమె  వెల్లకిలా  తిరిగి  అతనికి  మరింత  కనువిందు  చేసింది.
          
మనోహరమైన  ప్రదేశం.  మత్తు  కలిగించే  పరిమళాలు, మెత్తని  పర్యంకము. రతీ  మన్మథుల వంటి  జంట! అతడా, సురతోపచార  కుశలుడు!   ఆమెయా  పరిపుష్టభోగ  క్షమాంగి! వారి  శృంగారం ఊహాతీతమే కదా, మరి!
         
మరునాటికి  నీలా సుందరి లభించదన్న ఆరాటంతో నలకుబేరుడు ఆమెను  మరల మరల   సంధించాడు.  మరో మండలం  రోజుల  వరకు. తన వంతు  రాదన్న  తలపుతో, నీలా సుందరి  అతనికి  తన మధురిమలను కొసరి-కొసరి  అందించింది.  వారిద్దరి  మదనకేళీ విలాసాలకు  సిగ్గు పడి,  ఆ రేయి  ప్రొద్దుచాటుకి చేరుకొంది.
          
అదే సమయానికి, నీలా సుందరీ మంత్రం  రెండుసార్లు వినిపించింది.
          
మొదటిసారి,  గంభీరమూగాద్గదికమూ  అయిన  కంఠస్వరంతోనూ రెండవసారి,  శైశవమూచపలమూ అయిన  కంఠస్వరంతోనూ  వినిపించింది.
          
“బ్లూ వేం వద వద త్రీం హం ఫట్ !”  అంటూ!
         
నీలా సుందరి  తొట్రుపడుతూ  లేచి  పర్యంకంపై  కూర్చొంది.
          
“నీలా సుందరీ !!  నీకు  భూలోకంలో  సాధకులెవరైనా  ఉన్నారా?”
         
“ అవును  స్వామీ!!” నీలా సుందరి  దీనంగా  బదులిచ్చింది  “వారిరువురినీ  తలచుకొంటేనే, నాకు  తల  బ్రద్దలవుతోంది. ఇక  వారి  కోర్కెలను  నే నెలా  తీర్చగలను?”
         
“తలపులలోనే  తలలు  బ్రద్దలు చేసే వారెవరు  దేవీ?”
         
“మీరు  వినలేదా  స్వామీ! గాంభీర్యమూగాద్గదికమూ అయిన  మొదటి  గొంతు, ఒక కాపాలిక  తాంత్రికుడు, “మణికంఠ సిధ్ధుడిది “ వార్థక్యపు  తొలిమెట్టులో ఉన్న ఆ  భీకరాకారుడు  నా  మంత్ర జపం  చేసి  నన్ను పొంద గోరు తున్నాడు. ఇక  రెండవ  వాడు  ప్రాయమైనా  రాని  పదునాలుగేళ్ల  బాలకుడు. ఎక్కడో  తాళపత్ర  గ్రంధాలలో ఉన్న  నా మంత్రాన్ని  చూసి జపిస్తున్నాడు.  నా సమస్య  చిత్రాతి చిత్రంగా ఉంది   కదా!” 
          
“నీ సమస్య  విచిత్రమైనదే  దేవీ! కాని  దానికి  పరిష్కార  మార్గం ఉంది.  నిన్ను  మంత్రశక్తితో  పిలుస్తున్న  ఆ  సాధకుల  కడకు,  వారి వారి  వయోపరిధిలోనే  వెళ్లి  దర్శనమిచ్చి  తప్పించుకో “
          
“అంటే?”
          
“ ఏముంది! అనంగరంగుని  కడకు వృధ్ధనారీ  రూపంలోనే వెళ్లు. వృద్ధురాలివి, వ్యర్ధురాలివని  చెప్పి అతడు  నిన్ను  పొమ్మంటాడు . ఇక ఆ  బాలునికి,  ఒక బాలికగా  దర్శనమియ్యి.”

          
“ స్వామీ!  మంచి ఉపాయం  చెప్పి  నన్ను  ధన్యురాలిని  చేసారు.  మీ కిదే  నా  బహుమతి!” అంటూ  ఆమె  అతని  చెక్కిలిని  ముద్దాడింది.

****

మణికంఠ సిధ్ధుడు   కాపాలిక  సాంప్రదాయానికి  చెందిన  తాంత్రికుడు.  కాపాలికులు, శివుణ్ని, రుద్రభైరవ  రూపంలో ఆరాధిస్తారు.ఆ ఆరాధనలో,”ఫంచ మకారాలు” వారికి ముఖ్యం. మత్స్యం,మాంసం, మదిర, మగువ, మైథునం ఇవే  పంచమకారాలంటే! వాటిలో  చివరి  రెండూ  స్త్రీ  సాధకురాలు  అంటే “భైరవి”  దొరికితేనే సాధ్యమవుతాయి. అందుకే  “భైరవి” కోసం  వాళ్లు  పడరాని  పాట్లు పడతారు.
          
సాధారణంగా  అలాంటి  ఉగ్ర  సాధనకి ఏ పడతీ  ఒప్పుకోదు. అందువల్ల  వాళ్లు  పసి వయసులోని ఆడపిల్లలని అపహరించి క్రమక్రమంగా తమ  అడుగు జాడల లోనికి  మలచుకొంటారు. అందు వల్లనే వాళ్లు దుర్గమారణ్యంలో, గుహలలో  మానవ  సంచారం  లేని చోట తమ సాధనా స్థలాన్ని ఎంచుకొంటారు అజ్ఞానంతో, అనాగరికతతో, దారిద్ర్యంతో  దుర్భర  జీవితాన్ని  గడుఫుతారు, వారి లక్ష్యమల్లా, వారి భైరవీ  సాధన  మాత్రమే!
          
మణికంఠ సిధ్ధుడు  కాస్త  వివేకం  కలవాడు. మానవ  కాంతలు  దుర్లభమని  తెలుసుకొన్న అతను, యక్షిణీ  కాంతను తన లక్ష్యసాధనకిఎంచు కొన్నాడు.ఆ యక్షిణే  నీలా సుందరి! ఆ రోజే 5 లక్షల మంత్ర జపం  పూర్తిచేసి  ధ్యానంలో  కూర్చొన్నాడు,  ఆమె  సాక్షాత్కారానికి  ఎదురుచూస్తూ.
         
నీలా సుందరి  మంత్రపాశ  బద్ధయై, అనంగరంగని  ముందు  ప్రత్యక్షమయింది, తన సౌందర్యాన్ని  కను మరుగు  చేస్తూ,  వృద్ధ  స్త్రీ  వేషంలో. కటువైన  స్వరంతో  అడిగింది,” మణికంఠా ! అలకాపురి
 నుండి  నన్నెందుకు  రప్పించావు.?  నీకేం  కావాలి?” అని.
          
మణికంఠ సిధ్ధుడు  తృప్తితో  ఆమెవంక  చూసాడు.  వృద్ద  స్త్రీ వేషంలో  ఉన్నా నీలా సుందరి, అతని  కంటికి  తన  లక్ష్యసాధన  పూర్తిచేయడానికి  వచ్చిన  భైరవిలాగ  కనిపించింది.  

“దేవీ! నీలా సుందరీ !! నేను నిన్ను  ‘భైరవి’ రూపంలో ఆరాధించడానికి  పిలిచాను. నాతో  సహకరించి నా  సాధనని  పరాకాష్ట  దశకి  తేవాలి.  నా  కుండలినీ  శక్తిని  జాగృతం  చేసి  నన్ను  ధన్యుణ్ని  చెయ్యి,
         
“అనంగరంగా! నేను అబలను,అశక్తురాలను. నీ  లక్ష్య సాధనకి వ్యర్థురాలిని  కాగలను.”
         
“ దేవీ!!  నీవు నా  కోసం  భైరవిగా  మారితే  చాలు! నేను  నిన్ను అసాధ్యమయిన  కోరికలు  కోరను నీవు అబలవు, అశక్తురాలవు.  వృద్ధురాలవు  అయినాఆఢదానివి  అంతే  చాలు.”
         
నీలా సుందరి  మరోదారి లేక  అంగీకరించింది.
         
మణికంఠ సిధ్ధుని  జీవిత  లక్ష్యమయిన,” భైరవీ సాధన “ మొదలయింది.
         
నీలా సుందరి  వృద్ధనారీ  రూపంలో.అతని గుహలోపల ఒక శిలాఫలకం పైన కూర్చొని ఉంది. ఆమె మెడలో  పెద్ద  పూలమాల !చేతులకీ .చెవులకీ  కూడ  పూవులే ఆభరణాలు, అంతెందుకు. పయోధ రాలు, జఘనాలకు కూడ  సుమ  పరిధానాలే అమరాయి. ఆమె  కేశాలు  ఎలాంటి  పాశబంధాలు లేక  విప్పుగా  వీపంతా  పరచుకొని  ఉన్నాయి.
          

మణికంఠ సిధ్ధుడు  ఆమెను  తాంత్రిక  సహస్రనామాలతో, పూవులు- అక్షింతలు, పసుపు, కుంకుమలతో అర్చించాడు. నీలా సుందరికి  ఇదంతా  వింతగా  ఉంది. అర్చనానంతరము,  దోరగా  వేచిన  మత్స్యాన్ని,  మాంసాన్ని  నైవేద్యంలా  తినిపించాడు.  ఆమె  కుతూహలంతో ఆసక్తితో  ఆరగించింది. ఇప్పపూల  సారాయిని  ఆకుదొన్నలతో  ఆమె అధరాలకి  అందించి  త్రాగించాడు.  సోమరసం  కన్న సారాయమే  కమ్మగా ఉందని  తలచిన  ఆమె  ప్రీతితో  తాగి, మత్తకాశిని  అయింది.
          
“మణికంఠ సిధ్ధా! పూజ  ముగిసినట్లే  కదా!!”
         
“అయినది   భైరవీ!!   ఇక నీ  కటాక్షమే  మిగిలింది. “
         
“కటాక్షమా!!  అంటే?!”
         
“సెలవిచ్చెదను భైరవీ !! “అంటూ అతడామె వీపు వెనకకి  వెళ్లాడు. ఆకు దొన్నెలోని ఒక లేహ్యాన్ని తెచ్చి, ఆమె  ముఖాన్నివెనకకి  వంచి, చిబుకాన్నిఎత్తి  పట్టుకొని, ఆమె అధరాలకి  రాసాడు. ఆమె  కుతూహలంతో  చప్పరించింది. 
           
“ఏమిటిది ? మణికంఠ సిధ్ధా “ అని  అడిగింది.
         
“ఇది  మదనభైరవీ  లేహ్యం, “శిలాజిత్తుతోను,  సహస్ర  మహువా పుష్ప మకరంద రసంతోనూ చేయబడింది “ భైరవీ!!  మరొక్కసారి.”... అంటూ  మరల మరల  ఆమె  అధరాలకు  రాసాడు. ఆమె  జిహ్వను  బయటకు  తీసి  చప్పరించింది. మణికంఠ సిధ్ధుడు ఆ  లేహ్యన్ని  తన  పెదవులకి  రాసుకొని, ఆమె  జిహ్వకు అందించాడు. 

నీలా సుందరి  సందేహించలేదు, అతని  అధరాలను అందుకొంది. అతనామెకి  అభిముఖంగా  కూర్చొని.  ఆమెను  పీఠంపైనుంచి  లేవనెత్తి,  తన అంక  పీఠం  మీద  కూర్చోపెట్టు కొన్నాడు. ఆమె  వారించలేదు. ఆమెకదంతా  వినోదంగా  ఉంది.
          
మణికంఠ సిధ్ధుడు ఆమెకి మరల మత్స్యాన్ని,మాంసాన్ని,మదిరనూ అందించాడు. ఆమెను తన సర్వాంగాల తోనూ  దగ్గరగా  తీసుకొని  హత్తుకొన్నాడు.“”భైరవీ!!  కటాక్షించు,  కర్కాటక  బంధంలో నాతో కలిసి పో!! అన్నాడు.
          
నీలా సుందరి  అప్పటికే  వివశురాలయింది.  మదిర  లోపలికి  చేరి  మత్తకాశని  అయింది. 
          
“మణికంఠ సిధ్ధా  కర్కాటక  బంధం అంటే ఏమిటి?”అని  అడిగింది.
         
“భైరవీ!!  నీ  చేతులు  నా మెడమీద  వెయ్యి.” అంటూ  ఆమెను  ఆ  భంగిమకి  అనుకూలంగా మార్చుకొని  బిగికౌగిలిలో  బిగించాడు.” 

"భైరవీ!! ఇదే  కర్కాటక  బంధం!!”
         
“కామకేళిలో  ఇలాంటి  బంధాలు  కూడా ఉంటాయా?” అమాయకంగా  అడిగింది, ఆ  అలకాపురి  సుందరి.
         
“ అవును  భైరవీ!! మా  భూలోకంలో, వాత్సాయనుడనే  మహర్షి, ఇలాంటి  బంధలెన్నింటినో  కల్పించి  వాటిని  గ్రంధస్థం  చేసాడు. తరువాత  కాలంలో  కొంతమంది,  శిల్పాచార్యులు  దేవాలయ  ప్రాకారాల  పైన ఆ  భంగిమలను  శిలలతో  మలచి,  అందరికీ అందుబాటులో ఉండేలా  చేసారు. ఇక్కడకి  దగ్గరగా, నీలకంఠ  మహదేవ  మందిరం ఉంది.  అక్కడ  వాటిని  చూడవచ్చు.”
          
“నాకు  చూపిస్తావా?”
         
“ తప్పక  చూపిస్తాను  భైరవీ!!  రేపటి  భైరవీ  సాధన  అక్కడే  చేసుకొందాము. “
         
“రేపు కూడా  సాధిస్తావా, మణికంఠ సిధ్ధా ! అయినా  ఈ  కామకేళిని  ‘సాధన’  అనిఎందుకు పిలుస్తున్నావు?”
         
“భైరవీ!! ఈ  కామకేళిలో  స్కలనం ఉంఢదు.  రేతస్సును ఊర్థ్వ  ముఖంగా లేపి, మెదడులో ఉండే  కామకేంద్రం వైపు  తీసుకెళ్లాలి.ఆ  ప్రయత్నంలో కుండలినీ శక్తి జాగృతమవుతుంది. దానివల్ల  సమాథి  స్థితి  లభిస్తుంది. 

అందుకే  దీనిని  సాధన అని అన్నాను. “భైరవీ!!  రేపు మాత్రమే  కాదు, ఈ సాధన నవరాత్రులు జరగాలి. ఆ పైన నిన్ను కష్టపెట్టను, నీ కటాక్షంవలన నాకు లభ్ధి కలిగి  తీరుతుంది. అలా కలగనప్పుడు ఈ  జీవితానికి ఇంతే  అని సరిపెట్టుకొంటాను, కాని  నిన్ను మరల  కష్టపెట్టను.”
          
“మణికంఠ సిధ్ధా! పురుషులే  తప్ప  స్త్రీలు ఈ  సాధనకి  అనర్హులా?”
          
“ స్త్రీలు సమర్పణ  ద్వారా ఈ  సాధనా  పలితాలు  పొందగలరు  భైరవీ!!”
          
“ సమర్పణ అంటే ఏమిటి?”
          
“ భైరవీ!! ఒకే  పురుషునికి  తన   తనువును, మనసుని, తన సర్వస్వాన్నీ  సమర్పించడం ద్వారా! దానినే  మా  లోకంలో  పాతివ్రత్యం  అంటారు”
          
“అలాగా!!  మానవ కాంతల  గురించి  నీ  ధగ్గర  చాలా  విషయాలు  తెలుసుకోవాలి.,ఈ నవ రాత్రులూ  వచ్చి  నీకు  సహకరిస్తాను.”
          
“ధన్యున్ని,  భైరవీ!! అంటూ అతడామె  బుగ్గలను  ముద్దాడాడు.”
         
ఆమె  సమర్పణనే  లక్ష్యంగా  పెట్టుకొని అతనికి  పూర్తిగా  సహకరించింది.

(ఇంకా ఉంది)


















Comments

Popular posts from this blog

చిలక రథంలో సరదా షికారు—( పెద్దలకు, పెళ్లైన వారికి మాత్రమే)

     ( ఈ బ్లాగులోనే టపా కొట్టిన కొన్ని సరస శృంగార కథల సమాహారం )     స్వస్తి శ్రీ చాంద్రమాన విరోధి నామ సంవత్సర జ్యేష్ట అమావాస్య , మృగశిరా నక్షత్ర యుత , సోమవార పర్వదినం, రోమన్ కేలండర్ ప్రకారం ఆ రోజు తేదీ 22.06.2009.     రాత్రి రెండు ఝాములు దాటి , ఒంటి గంట అయింది !     రుద్రాభిషేకం జరుగుతోంది.!     అది క్షీరారామ క్షేత్రంగా ప్రసిధ్ధికి ఎక్కిన ‘శ్రీరామ లింగేశ్వర స్వామి వారి ఆలయం. శివుడు తన త్రిశూలపు మొనని, నేలపై ఆనించగా, అక్కడ నుండి, ‘క్షీర ధార’ పైకి ఉబికి,‘ పాలకొలను’ ఏర్పడిందట ! ఆ కొలను గట్టున శ్రీమహా విష్ణువు పూర్ణావతారమైన, శ్రీరామ చంద్ర మూర్తి , సీతమ్మ వారితో కలసి, తమ స్వహస్తాలతో , ‘శ్రీ రామ లింగేశ్వర’ప్రతిష్ట చేసారట !     ఆ విధంగా శివ-  కేశవుల పవిత్ర స్పర్శతో పునీతమయిన క్షేత్ర రాజం అది !     ‘పినాక పాణి’ , అతని కుటుంబ సభ్యులు, శ్రీ రామ లింగేశ్వర స్వామి వారి, అభిషేక కార్యక్రమం ముగించుకొని, మూడవ గంట కల్లా, తనతో పాటు తెచ్చుకొన్న ‘మినీ బస్సులో’ తిరుగు ముఖం పట్టారు.     పినాక పాణి బహు కుటుంబీకుడు ! అతనికి ఆరుగురు చెల్లెళ్లు, ముగ్గురు తమ్ముళ్లు ఉన్నారు ! అమ్మయిలు మువ్వురికీ , అతనికీ, పెళ్లిల

నీల గ్రహ నిదానము 3

నీల గ్రహ నిదానము 3 (రెండవ దృశ్యము.) ( దక్ష వాటిక ) ( దక్షుడు ఒంటరిగా ఒక శిలా ఫలకం మీద కూర్చొని ఉంటాడు.) దక్షుఢు --- “ ఓం నమో నారాయణాయ ! ఓం నమో నారాయణాయ !! ఓం నమో నారాయణాయ !!! ” (అని జపిస్తూ ఉంటాడు ) ( తెర లోంచి కూడా “ ఓం నమో నారాయణాయ “ అని వినిపిస్తుంది.) ( దక్షుడా ప్రతి ధ్వని విని, నామ జపాన్ని ఆపి చూస్తాడు ) ( ప్రవేశం--- నారదుడు, నారాయణ మంత్రం పఠిస్తూ ) నారదుడు --- దక్ష ప్రజాపతీ ! బ్రహ్మ మానస పుత్రుడైన ఈ నారదుడు, ఉపబ్రహ్మవు, పితృ తుల్యులైన మీకు నమస్కరిస్తున్నాడు. దక్షుడు --- దీర్ఘాయురస్తు ! నారదా ! ఎచటి నుండి నీ రాక ? నారదుఢు ---- బాబాయి ! నా రాక మాటకేం గాని, మీ పోకడలు మాత్రం విచిత్రంగా ఉన్నాయి. ఇలా ఒంటరిగా ఆరు బయట కూర్చొని, నారాయణ స్మరణ చేయాల్సిన అవసరం మీ కేమొచ్చింది ? దక్షుడు --- సంసార జంజాటం లేని బ్రహ్మచారివి. సంతానం తెచ్చి పెట్టే సమస్యలు నీ కేమి అర్థమవుతాయి. నారదుడు --- మీ సంతానం నాకు సోదర తుల్యులు కారా బాబాయి ! అయినా నారాయణ స్మరణతో సమస్యా పరిష్కార

వేణీ సంహారము

వేణీ సంహారము (1ఈ కథానిక ఆంధ్రభూమి శనివారం తేది 11.2.2011 దిన పత్రికలో ప్రచురించ బడింది) నా భార్య ‘నీలవేణి’ చాలా అందమైనది. ముఖ్యంగా పేరుకి తగ్గట్లుండే ఆమె కబరీ భరం ! వర్తులాకారంలో ఎత్తుగా నిర్మించిన రెండు ఇసుక తిన్నెల లాంటి జఘనాల మధ్య, సన్నని పాయ లాంటి చీలికని స్పృశిస్తూ పొడవుగా ఒత్తుగా , జడలా బిగించినప్పుడు ‘త్రాచుపాములాగ’ విచ్చుకొన్నప్పుడు నెమలి వింజామరలా కనిపించే ఆ నీలవేణి సౌందర్యం బాపూ బొమ్మకే ఉంటుంది ! ఆమె చంద్రవదనాన్ని ఏ సినిమా దర్శకుడైనా చూసి ఉంటే,తప్పకుండా ఆమెకి ‘అమ్మవారి ’ పాత్రలు దక్కి ఉండేవి ! వెడల్పైన ఫాలభాగం మీద బాలారుణ సూర్య బింబం లాగ కనిపించే కుంకుమ బొట్టు, దాని క్రింద ధనస్సుల లాంటి కనుబొమలు, ఆ క్రింద మీనాల లాంటి కళ్లు. ఆ కళ్ల మధ్య నుండి ఎత్తుగా, ఠీవిగా నిటారుగా ఉండే ముక్కు, దానిక్రింద రుచులూరించే అధరాలు, పచ్చని బంతి పూవు లాంటి మేని ఛాయ, పొడవుకి తగ్గ శరీర సౌష్టవం, కలిగిన ఆమె, చూపరులకు చెయ్యెత్తి నమస్కరించాలనిపించే దేవీ కళలు ఉట్టి పడుతూ ఆకర్షణీయంగా ఉంటుంది. ఆమె నా భార్య కావడం నేను చేసుకొన్న అద