“శ్యాం ఎల్లుండి జరగ బోయే అవుట్ డోర్ షూటింగులో నువ్వు నాతో రావద్దు. ఎందుకంటే నాకోసం ప్రమాదం పొంచి ఉంది.” అంది.
శ్యాం అర్థం కానట్లు చూసాడు. కారు డ్రైవరు ఆలీ మాత్రం ఆమె మాటలకి స్పందించాడు,
“మీకు ప్రమాదం పొంచి ఉండడం ఏమిటి మేడం ! మీరు ప్రమాదాలకే ప్రమాదమయితే !” అన్నాడు.
“ఆలీ ! పంచాగ్ని వెళ్లే దారిలో ఒక ఏక్సిడెంటు స్పాట్ ఉందట కదా ?” అడిగింది శరణ్య.
“అవునమ్మా!ఘాట్ రోడ్డు మలుపులో ఒక ఏక్సిడెంట్ స్పాట్ ఉంది. అక్కడ ఇంత వరకు 67 దుర్ఘటనలుజరిగాయి ”
“ రేపు జరగబోయే 68వ దుర్ఘటన బహుశా నాదే అవుతుంది ఆలీ !”
“అలాంటిదేమీ జరగ దమ్మా ! షావలీ బాబా భక్తులకి ఆ స్పాట్లో ఎలాంటి అపాయాలూ జరగవు. నేను అతని మజార్’కి తరచు వెళ్తూ ఉంటాను.” అన్నాడు ఆలీ.
“షావలీ బాబా మజార్ ఎక్కడ ఉంది ఆలీ ?”
“చించి పోకిలీ రైల్వే స్టేషను దగ్గర ఉంది మేడం ! ”
“నన్ను, నరేంద్రనీ అక్కడకి తీసుకొని వెళ్తావా ఆలీ !”
“తప్పకుండా తీసుకెళ్తాను మేడం, మనం తిరుగు దారిలో అక్కడకి వెళ్దాం” అన్నాడు ఆలీ.
ఆ తరువాత శరణ్య వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మార్చేసింది. అందరూ కలిసి, నవ్వుతూ, కేరింతాలు కొడుతూ భోజనం చేసారు. లంచి పూర్తయ్యాక శరణ్య , నరేంద్రతో కలిసి, షావలీ బాబా మజారుకి ఆలీతో పాటు వెళ్లింది. దారిలో నరేంద్రకి విషయమంతా చెప్పింది శరణ్య.
“నరేంద్రా ! పంచాగ్నికి వెళ్లే దారిలోని ఆ ఏక్సిడెంటు స్పాటులో నన్ను చంపేందుకు పథకం వేసారు, దున్నపోతు శీను, విభూతి భూషణ్లు. దాని నుంచి తప్పించుకోవడానికే ఈ షావలీ బాబా మజార్’కి వెళ్తున్నాం. అక్కడ భక్తి శ్రధ్ధలతో , బాబా ప్రార్థన చేయాలి, తెలిసిందా ?” అని.
నరేంద్ర సరే నన్నట్లు తల ఊపాడు.
ఆలీతో పాటు , శరణ్య , నరేంద్రలు కూడా బాబా షావలీ సమాధి ప్రక్క, మోకాళ్ల మీద కూర్చొని, చేతులు చాపి, ‘ఇబాదత్’ చేసారు.
“ బాబా ! ఏ పాపమూ ఎరుగని దీనురాలైన ఈ శరణ్య మిమ్మల్ని, చేతులు చాపి ప్రార్థిస్తూంది. నన్ను ‘పంచాగ్ని’ మలుపులోని దుర్ఘటనా స్థలంలో ఇరికించి చంపేయాలని చూస్తున్నారు కొంత మంది దుర్మార్గులు. బాబా ! ఆ స్థలం మీ అధీనంలో ఉన్నమాట నిజమే అయితే, నన్నూనరేంద్రనీ కాపాడండి.. మీకు అదే స్థలంలో మజార్ నిర్మాణం చేయిస్తాను.” అంటు శరణ్య కళ్లు మూసుకొంది.
నరేంద్ర ఎప్పుడు తన స్థలం నుండి లేచి వెళ్లాడో, శరణ్య గమనించ లేదు.ఆమె మనసంతా బాబా జవాబు కోసం ఎదురు చూస్తోంది. మరుక్షణం ఆజానుబాహుడు, తెల్లని పట్టుకుచ్చుల్లాంటి దీర్ఘ శ్మశ్రు పటలంతో, దివ్య తేజస్సుతో నిండిన , స్ఫురద్రూపి అయిన ఒక వృధ్ధుడు కనిపించాడు. “ బేటీ శరణ్యా ! నరేంద్ర నా మసీదు లోపలికి ప్రవేశించి నీ అవసరాన్నీ, ఆవేదననీ తెలియ జేసాడు. పంచాగ్నిలోని ఆ స్థలం నాకు గురు స్థానం ! అందుచేత నా సంవేదనని అక్కడి ఆత్మలు అర్థం చేసుకో గలవు.! అవి అక్కడ మృతి చెందడం వాటి లలాట లిఖితం ! అలా మరణించిన వారిలో, భక్తులు, పుణ్యాత్ములు ఎవరూ లేరు. కేవలం పాపులు, దుర్మార్గులు మాత్రమే కాలధర్మం చెందారు. నువ్వు నా శరణు జొచ్చావు గనుక నీ కేమీ కాదు ! నిర్భయంగా వెళ్లి రా ” అన్నాడు.
“బాబా ! పాపులని శిక్షించడమే జరిగితే, అది నరకం లాంటి పైలోకాల లోనే జరగాలి.ఒక రోడ్డు చివర మృత్యు దేవత తన స్థావరాన్ని ఏర్పరచుకోవడం ఎంత వరకు న్యాయం? మీరూ మీ గురుదేవులూ దీనిని ఎలా సమర్థిస్తున్నారు?
అక్కడ చనిపోయి ప్రేతాలుగా మారిన అసంఖ్యాక మయిన నిస్సహాయ ఆత్మలకి ముక్తి ఎలా లభిస్తుంది ? వారికి వారి వారి నమ్మకాల ప్రకారం అంత్య క్రియలు ఎవరు చేస్తారు ? నేను మీ మజారుని అక్కడ కడతానన్నది ఈ ప్రశ్నలకి జవాబు కోసమే ! దయచేసి సమ్మతించండి.”
“శరణ్యా ! చాలా ప్రశ్నలు వేసావు. వాటి సమాధానాలు నేను నా గురుదేవుల దగ్గర రాబడుతాను. నువ్వు చేస్తానన్న పని వల్ల నాకు అక్కడ జరగబోయే, జరుగుతున్న దుర్ఘటనలని నా గురుదేవులకి దగ్గరగా ఉండి చూపించి నట్లు అవుతుంది. అలాగే చెయ్యి ! ఇక లేచి రా !” అన్నాడు.
శరణ్య కళ్లు తెరచి లేచింది. ఆంత వరకు ఆమె ముందు నిలబడిన వృధ్ధుడు అదృశ్యమయ్యాడు. నరేంద్ర అక్కడ నిల్చొని చిరునవ్వుతో చూస్తున్నాడు. శరణ్య లేచి నరేంద్రని ముద్దు పెట్టుకొని బయలు దేరింది.దారిలో ఆమె ఆలీతో తనకీ, షావలీ బాబాకీ జరిగిన సంభాషణని చెప్పి, అక్కడ మజారు నిర్మింఛే పక్షంలో తను 5 లక్షలు డొనేషను ఇస్తానని చెప్పింది.
ఆ మాటలు విన్న ఆలీ ఆనందంతో పొంగిపోయాడు సమాజం వారితో , సంప్రదింపులు జరిపి మజారు కట్టే విషయంలో సహమతి తీసుకొస్తానని అన్నాడు.
****
పథిక్ గెస్ట్ హౌసులోని మేనేజరు గదిలోని, ఎ.సి.చల్లదనంలో, విస్కీ సేవిస్తూ, మాట్లాడు కొంటు న్నారు వాళ్లిద్దరూ. ఒకడు భూషణం, రెండవ వాడు దున్నపోతు శీను..,
“శీనూ ! శరణ్య ఏక్సిడెంటు ఎలా ప్లాన్ చేసావ్ ? ఏదైనా ట్రక్కుతో గుద్దిస్తావా, లేక లేండ్ మైన్ డెటినేటర్ పెట్టి, ఆ స్పాటుకి రాగానే దానిని పేల్చేస్తావా ?” భూషణం అడిగాడు.
“అవేవీ వర్కవుట్ అవవు ! సపోజ్ అది తన కారును మార్చి, ఇంకో కారులో వచ్చిందనుకో, ఈ రెండు ప్లానులూ పని చేయవు.అందువల్ల వేరే పథకం వేసాను.”
“అదే ఎలాగని ?”
“అక్కడ జరిగిన ఏక్సిడెంట్లకి ప్రేతాత్మలే కారణం అనే నమ్మకం ఉంది కదా ! వాటిలో ఒక ప్రేతాత్మనే నే నీ పనికి ఎన్నుకొన్నాను.”
“ఇంటరెస్టింగ్ ! వివరంగా చెప్పు,” అన్నాడు భూషణ్.
“అక్కడ జరిగిన ఏక్సిడెంటులో మనవాడు ఒకడున్నాడు. వాడి పేరు‘జగ్గు’.వాడి ఆత్మ ఇంకా అక్కడ తిరుగుతూనే ఉంది”
“అది సరే ! ఈ ఆత్మలని ఎలా కంటాక్ట్ చేసావ్ ?”
“శరణ్య, మానసి ఆత్మని కంట్రోల్ చేసి, మనతో ఆటలాడుకోలేదూ ? అలాగే నేను ఒక తాంత్రికుడిని పట్టుకొన్నాను.”
“అలాగా! ఆ తాంత్రికుడు ఏం చేస్తాడు ?”
“జగ్గు ఆత్మని లేపి, కంట్రోల్ చేసి, దాని మీదకి ఉసిగొలుపుతాడు.”
“వర్కవుట్ అవుతుందా ? జగ్గు ప్రేతాత్మ దానిని ఎలా పోలుస్తుంది ?”
“ ప్రేతాత్మలు మనుషుల రూపు రేఖలని బట్టి పోల్చవు ! వాళ్ల చెమట, ఒంటికి పట్టిన మట్టి, జుత్తు, గోళ్లు లాంటి వాటి ద్వారా తమ ‘టార్గెట్’ని గుర్తిస్తాయి.”
“ శెభాష్ శీనూ ! దాని చెమట వగైరా ఎలా సంపాదించావ్?”
“చాలా సులభం భూషణ్ ! అది సినిమా వేషం వేస్తోంది కదా ? దాని మేకప్ మేన్ నుంచి జుత్తు గోళ్లు, అది తొడిగి విడిచిన బట్టల ద్వారా చెమటనీ, దాని హెయిర్ డ్రెస్సర్ ద్వారా జుత్తునీ సంపాదించాను. వాటిని తీసుకెళ్లి ఆ తాంత్రికుడికి ఇచ్చాను, రేపు అది కారు మార్చినా, డ్రెస్సు మార్చినా, చివరికి మేకప్పుతో రూపు రేఖలు మార్చినా , ఏం చేసినా జగ్గు ప్రేతాత్మ తన పని తాను చేసుకొని పోతుంది అది ఖచ్చితంగా చావు నుంచి తప్పించుకోలేదు.”
“బాగుంది శీనూ ! చాలా బాగుంది. ఇది వర్కవుట్ అయితే మనం చాలా మర్డర్లు ప్లాన్ చేయవచ్చు.”
“నా ఉద్దేశంలో అక్కడ జరుగుతున్నది అదే భూషణ్ ! ఆ తాంత్రికుడికి , ఆ స్పాటు వల్ల,‘నిత్య కళ్యాణం,పచ్చ తోరణం’ అయింది. నేనా స్పాటుకి వెళ్లి ఏక్సిడెంట్ల గురించి ఎంక్వైరీ చేస్తూ ఉంటే , వాడు కనబడ్డాడు. నా డబ్బు వాడికి, వాడి అవసరం నాకూ ఉంది, కాబట్టి డీల్ జరిగి పోయింది. ”
"ఎంత ఇస్తున్నావేమిటి ?”
“ లక్ష రూపాయలు. సగం ముందే ఇచ్చాను, తక్కినది పని జరిగాక !”
“ లక్ష రూపాయలు ఆ తాంత్రికుడు ఒక్కడే తీసుకొంటాడా? జగ్గుకేమీ దక్కదా ?”
(ఇంకా ఉంది)
శ్యాం అర్థం కానట్లు చూసాడు. కారు డ్రైవరు ఆలీ మాత్రం ఆమె మాటలకి స్పందించాడు,
“మీకు ప్రమాదం పొంచి ఉండడం ఏమిటి మేడం ! మీరు ప్రమాదాలకే ప్రమాదమయితే !” అన్నాడు.
“ఆలీ ! పంచాగ్ని వెళ్లే దారిలో ఒక ఏక్సిడెంటు స్పాట్ ఉందట కదా ?” అడిగింది శరణ్య.
“అవునమ్మా!ఘాట్ రోడ్డు మలుపులో ఒక ఏక్సిడెంట్ స్పాట్ ఉంది. అక్కడ ఇంత వరకు 67 దుర్ఘటనలుజరిగాయి ”
“ రేపు జరగబోయే 68వ దుర్ఘటన బహుశా నాదే అవుతుంది ఆలీ !”
“అలాంటిదేమీ జరగ దమ్మా ! షావలీ బాబా భక్తులకి ఆ స్పాట్లో ఎలాంటి అపాయాలూ జరగవు. నేను అతని మజార్’కి తరచు వెళ్తూ ఉంటాను.” అన్నాడు ఆలీ.
“షావలీ బాబా మజార్ ఎక్కడ ఉంది ఆలీ ?”
“చించి పోకిలీ రైల్వే స్టేషను దగ్గర ఉంది మేడం ! ”
“నన్ను, నరేంద్రనీ అక్కడకి తీసుకొని వెళ్తావా ఆలీ !”
“తప్పకుండా తీసుకెళ్తాను మేడం, మనం తిరుగు దారిలో అక్కడకి వెళ్దాం” అన్నాడు ఆలీ.
ఆ తరువాత శరణ్య వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మార్చేసింది. అందరూ కలిసి, నవ్వుతూ, కేరింతాలు కొడుతూ భోజనం చేసారు. లంచి పూర్తయ్యాక శరణ్య , నరేంద్రతో కలిసి, షావలీ బాబా మజారుకి ఆలీతో పాటు వెళ్లింది. దారిలో నరేంద్రకి విషయమంతా చెప్పింది శరణ్య.
“నరేంద్రా ! పంచాగ్నికి వెళ్లే దారిలోని ఆ ఏక్సిడెంటు స్పాటులో నన్ను చంపేందుకు పథకం వేసారు, దున్నపోతు శీను, విభూతి భూషణ్లు. దాని నుంచి తప్పించుకోవడానికే ఈ షావలీ బాబా మజార్’కి వెళ్తున్నాం. అక్కడ భక్తి శ్రధ్ధలతో , బాబా ప్రార్థన చేయాలి, తెలిసిందా ?” అని.
నరేంద్ర సరే నన్నట్లు తల ఊపాడు.
ఆలీతో పాటు , శరణ్య , నరేంద్రలు కూడా బాబా షావలీ సమాధి ప్రక్క, మోకాళ్ల మీద కూర్చొని, చేతులు చాపి, ‘ఇబాదత్’ చేసారు.
“ బాబా ! ఏ పాపమూ ఎరుగని దీనురాలైన ఈ శరణ్య మిమ్మల్ని, చేతులు చాపి ప్రార్థిస్తూంది. నన్ను ‘పంచాగ్ని’ మలుపులోని దుర్ఘటనా స్థలంలో ఇరికించి చంపేయాలని చూస్తున్నారు కొంత మంది దుర్మార్గులు. బాబా ! ఆ స్థలం మీ అధీనంలో ఉన్నమాట నిజమే అయితే, నన్నూనరేంద్రనీ కాపాడండి.. మీకు అదే స్థలంలో మజార్ నిర్మాణం చేయిస్తాను.” అంటు శరణ్య కళ్లు మూసుకొంది.
నరేంద్ర ఎప్పుడు తన స్థలం నుండి లేచి వెళ్లాడో, శరణ్య గమనించ లేదు.ఆమె మనసంతా బాబా జవాబు కోసం ఎదురు చూస్తోంది. మరుక్షణం ఆజానుబాహుడు, తెల్లని పట్టుకుచ్చుల్లాంటి దీర్ఘ శ్మశ్రు పటలంతో, దివ్య తేజస్సుతో నిండిన , స్ఫురద్రూపి అయిన ఒక వృధ్ధుడు కనిపించాడు. “ బేటీ శరణ్యా ! నరేంద్ర నా మసీదు లోపలికి ప్రవేశించి నీ అవసరాన్నీ, ఆవేదననీ తెలియ జేసాడు. పంచాగ్నిలోని ఆ స్థలం నాకు గురు స్థానం ! అందుచేత నా సంవేదనని అక్కడి ఆత్మలు అర్థం చేసుకో గలవు.! అవి అక్కడ మృతి చెందడం వాటి లలాట లిఖితం ! అలా మరణించిన వారిలో, భక్తులు, పుణ్యాత్ములు ఎవరూ లేరు. కేవలం పాపులు, దుర్మార్గులు మాత్రమే కాలధర్మం చెందారు. నువ్వు నా శరణు జొచ్చావు గనుక నీ కేమీ కాదు ! నిర్భయంగా వెళ్లి రా ” అన్నాడు.
“బాబా ! పాపులని శిక్షించడమే జరిగితే, అది నరకం లాంటి పైలోకాల లోనే జరగాలి.ఒక రోడ్డు చివర మృత్యు దేవత తన స్థావరాన్ని ఏర్పరచుకోవడం ఎంత వరకు న్యాయం? మీరూ మీ గురుదేవులూ దీనిని ఎలా సమర్థిస్తున్నారు?
అక్కడ చనిపోయి ప్రేతాలుగా మారిన అసంఖ్యాక మయిన నిస్సహాయ ఆత్మలకి ముక్తి ఎలా లభిస్తుంది ? వారికి వారి వారి నమ్మకాల ప్రకారం అంత్య క్రియలు ఎవరు చేస్తారు ? నేను మీ మజారుని అక్కడ కడతానన్నది ఈ ప్రశ్నలకి జవాబు కోసమే ! దయచేసి సమ్మతించండి.”
“శరణ్యా ! చాలా ప్రశ్నలు వేసావు. వాటి సమాధానాలు నేను నా గురుదేవుల దగ్గర రాబడుతాను. నువ్వు చేస్తానన్న పని వల్ల నాకు అక్కడ జరగబోయే, జరుగుతున్న దుర్ఘటనలని నా గురుదేవులకి దగ్గరగా ఉండి చూపించి నట్లు అవుతుంది. అలాగే చెయ్యి ! ఇక లేచి రా !” అన్నాడు.
శరణ్య కళ్లు తెరచి లేచింది. ఆంత వరకు ఆమె ముందు నిలబడిన వృధ్ధుడు అదృశ్యమయ్యాడు. నరేంద్ర అక్కడ నిల్చొని చిరునవ్వుతో చూస్తున్నాడు. శరణ్య లేచి నరేంద్రని ముద్దు పెట్టుకొని బయలు దేరింది.దారిలో ఆమె ఆలీతో తనకీ, షావలీ బాబాకీ జరిగిన సంభాషణని చెప్పి, అక్కడ మజారు నిర్మింఛే పక్షంలో తను 5 లక్షలు డొనేషను ఇస్తానని చెప్పింది.
ఆ మాటలు విన్న ఆలీ ఆనందంతో పొంగిపోయాడు సమాజం వారితో , సంప్రదింపులు జరిపి మజారు కట్టే విషయంలో సహమతి తీసుకొస్తానని అన్నాడు.
****
పథిక్ గెస్ట్ హౌసులోని మేనేజరు గదిలోని, ఎ.సి.చల్లదనంలో, విస్కీ సేవిస్తూ, మాట్లాడు కొంటు న్నారు వాళ్లిద్దరూ. ఒకడు భూషణం, రెండవ వాడు దున్నపోతు శీను..,
“శీనూ ! శరణ్య ఏక్సిడెంటు ఎలా ప్లాన్ చేసావ్ ? ఏదైనా ట్రక్కుతో గుద్దిస్తావా, లేక లేండ్ మైన్ డెటినేటర్ పెట్టి, ఆ స్పాటుకి రాగానే దానిని పేల్చేస్తావా ?” భూషణం అడిగాడు.
“అవేవీ వర్కవుట్ అవవు ! సపోజ్ అది తన కారును మార్చి, ఇంకో కారులో వచ్చిందనుకో, ఈ రెండు ప్లానులూ పని చేయవు.అందువల్ల వేరే పథకం వేసాను.”
“అదే ఎలాగని ?”
“అక్కడ జరిగిన ఏక్సిడెంట్లకి ప్రేతాత్మలే కారణం అనే నమ్మకం ఉంది కదా ! వాటిలో ఒక ప్రేతాత్మనే నే నీ పనికి ఎన్నుకొన్నాను.”
“ఇంటరెస్టింగ్ ! వివరంగా చెప్పు,” అన్నాడు భూషణ్.
“అక్కడ జరిగిన ఏక్సిడెంటులో మనవాడు ఒకడున్నాడు. వాడి పేరు‘జగ్గు’.వాడి ఆత్మ ఇంకా అక్కడ తిరుగుతూనే ఉంది”
“అది సరే ! ఈ ఆత్మలని ఎలా కంటాక్ట్ చేసావ్ ?”
“శరణ్య, మానసి ఆత్మని కంట్రోల్ చేసి, మనతో ఆటలాడుకోలేదూ ? అలాగే నేను ఒక తాంత్రికుడిని పట్టుకొన్నాను.”
“అలాగా! ఆ తాంత్రికుడు ఏం చేస్తాడు ?”
“జగ్గు ఆత్మని లేపి, కంట్రోల్ చేసి, దాని మీదకి ఉసిగొలుపుతాడు.”
“వర్కవుట్ అవుతుందా ? జగ్గు ప్రేతాత్మ దానిని ఎలా పోలుస్తుంది ?”
“ ప్రేతాత్మలు మనుషుల రూపు రేఖలని బట్టి పోల్చవు ! వాళ్ల చెమట, ఒంటికి పట్టిన మట్టి, జుత్తు, గోళ్లు లాంటి వాటి ద్వారా తమ ‘టార్గెట్’ని గుర్తిస్తాయి.”
“ శెభాష్ శీనూ ! దాని చెమట వగైరా ఎలా సంపాదించావ్?”
“చాలా సులభం భూషణ్ ! అది సినిమా వేషం వేస్తోంది కదా ? దాని మేకప్ మేన్ నుంచి జుత్తు గోళ్లు, అది తొడిగి విడిచిన బట్టల ద్వారా చెమటనీ, దాని హెయిర్ డ్రెస్సర్ ద్వారా జుత్తునీ సంపాదించాను. వాటిని తీసుకెళ్లి ఆ తాంత్రికుడికి ఇచ్చాను, రేపు అది కారు మార్చినా, డ్రెస్సు మార్చినా, చివరికి మేకప్పుతో రూపు రేఖలు మార్చినా , ఏం చేసినా జగ్గు ప్రేతాత్మ తన పని తాను చేసుకొని పోతుంది అది ఖచ్చితంగా చావు నుంచి తప్పించుకోలేదు.”
“బాగుంది శీనూ ! చాలా బాగుంది. ఇది వర్కవుట్ అయితే మనం చాలా మర్డర్లు ప్లాన్ చేయవచ్చు.”
“నా ఉద్దేశంలో అక్కడ జరుగుతున్నది అదే భూషణ్ ! ఆ తాంత్రికుడికి , ఆ స్పాటు వల్ల,‘నిత్య కళ్యాణం,పచ్చ తోరణం’ అయింది. నేనా స్పాటుకి వెళ్లి ఏక్సిడెంట్ల గురించి ఎంక్వైరీ చేస్తూ ఉంటే , వాడు కనబడ్డాడు. నా డబ్బు వాడికి, వాడి అవసరం నాకూ ఉంది, కాబట్టి డీల్ జరిగి పోయింది. ”
"ఎంత ఇస్తున్నావేమిటి ?”
“ లక్ష రూపాయలు. సగం ముందే ఇచ్చాను, తక్కినది పని జరిగాక !”
“ లక్ష రూపాయలు ఆ తాంత్రికుడు ఒక్కడే తీసుకొంటాడా? జగ్గుకేమీ దక్కదా ?”
(ఇంకా ఉంది)
Comments
Post a Comment