Skip to main content

కొరకంచులో ఇనప మేకు ---16

“ జగ్గు డబ్బేం చేసుకొంటాడు భూషణం ! వాడికి ఆ తాంత్రికుడు ఏదో బలి ఇస్తాడు.”

“ బలే బాగుంది శీనూ ! నువ్వు ఆ దృశ్యాన్ని కళ్లారా చూసి , నాకు రిపోర్టు ఇస్తావా ?”

“ అవును,అందుకని ఆ స్పాటు కనిపించేలా,ఎదురుగా నున్న ‘గెస్టు హౌసులో’ రూము బుక్' చేసాను.ఆ స్పాటుకి దగ్గరగానే ఒక కొండ గుట్ట ఉంది. ఆ గుట్ట మీద తాంత్రికుడు ఒక పూరి పాక  వేసాడు. వాడు అక్కడ నుండే జగ్గు ఆత్మని కంట్రోల్ చేస్తాడు.

“ అయితే దాని పని రేపు రేపటికి పూర్తి అయిపోతుందన్నమాట ! శరణ్య పోయినా  ఇంకా నా పీకల మీదకి  ‘మానసి’ తగలడింది. దానిని కూడా ఆ తాంత్రికుడికి చెప్పి, క్లియరెన్సు చేయించు.”

“తప్పకుండా ఆ పని కూడా చేద్దాం. ముందు శరణ్య రాక్షసిని ,మానసి దగ్గరకి పంపి, తీరుబడిగా రెండు ఆడ దెయ్యాలని, జగ్గుకి అప్పచెప్పుదాం.వాడు పండగ చేసుకొంటాడు వాళ్లతో.” అంటూ వాళ్లిద్దరూ పగలబడి నవ్వుకొన్నారు.

ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది.

ఆలీ కారుని ముందుగా ‘షావలీ బాబా  మజార్’ దగ్గరకి తీసుకెళ్లాడు. శరణ్య, నరేంద్ర ఆలీతో బాటు లోపలికి వెళ్లి, బాబాని ప్రార్థించి వచ్చి, కారులో కూర్చొన్నారు.

కారు పంచాగ్ని వైపు బయలుదేరింది. అది ‘ అసుర సంధ్య వేళ, ఆ దుర్ఘటనా స్థలానికి సమీపంగా వెళ్లింది.ఆ స్థలానికి ఆనుకొని ఉన్న ఒక కొండ గుట్ట, ఆ గుట్ట మీద  వెయ్యబడిన ఒక పూరి గుడిశె ముందు  రాజేసిన హోమగుండం దగ్గర ఒక తాంత్రికుడు, జరగబోయే విధ్వంస కాండకి సారథ్యం  వహిస్తున్నాడు.

ముందుగా ఆ తాంత్రికుడు,‘ జగ్గు’  ప్రేతాత్మని అక్కడికి పిలిచాడు. మంత్రించ బడిన నిమ్మకాయ  తీసాడు. దానిని  కోయగానే ‘ఎర్రని రక్తం’ విరజిమ్మింది !

దానిని ప్రేతాత్మ ఆగమన సూచకంగా భావించాడు ఆ తాంత్రికుడు. కాని వానికి తెలియని విషయం ఇంకొకటి ఉంది!

ఇద్దరు  మహా పురుషుల దివ్యాత్మలు అదే  షావలీ బాబా, అతని గురుదేవుల ఆత్మలు, అదే సమయంలో జాగృత మయి, తన సన్నిధికి వచ్చే  ముందే, ‘ జగ్గుని’ తమ ఆదేశంతో బంధించి వేసారనీ, నిమ్మకాయ కోయగానే బయటికి స్రవించిన రక్తం, తన  తాంత్రిక ప్రయోగం వల్ల, దుర్ఘటనకి గురయి మృతి చెందిన, ఇంకొక ప్రేతాత్మ  ప్రవేశానికి చిహ్నమని  తెలుసుకోలేక పోయాడు !!

“ చెప్పు,,ఎవరు నువ్వు?” కోసిన నిమ్మకాయ చిప్పలు విరుధ్ధమైన దిశలో విసిరేసి, అడిగాడు తాంత్రికుడు.,

‘హ,హ,హ నవ్వు !’

“ చెప్పమంటే చెప్పవేం అలా నవ్వుతావెందుకు?” హోమ గుండంలో మరింత గుగ్గిలం వేస్తూ అడిగాడు .

“ నేనురా, క్షుద్ర  పూజారీ, నీ పాలిటి పిశాచాన్ని, ‘ శాంభవిని’ !”

“శాంభవా !” తాంత్రికుడు నివ్వెర పోయాడు.“నువ్వెందుకు వచ్చావ్, నేను జగ్గును పిలిచాను?”

“జగ్గు ఎలా వస్తాడురా ? వాడు షావలీ బాబా చేతిలో గిజగిజ లాడుతున్నాడు. వాడికి బదులు నేను వెళ్తానంటే బాబా  అనుమతిని  ఇచ్చారు.”

“ నేను నిన్ను పిలువలేదు శాంభవీ ! నువ్వు మరలి పో ! కావాలంటే బలి ఇస్తాను.”

“ నన్ను నీ ప్రయోగానికి బలి చేసి, నాకు బలి ఇస్తానంటావా  క్షుద్ర  పూజారీ! నీ పాలిటి పిశాచాన్నై వచ్చాను, నాకు నీ నిమ్మకాయలు, పెరుగు అటుకులు  బలి అక్కర లేదు.”

“మరి నరబలి కావాలా, అలాగే తప్పక పెడతాను. మరి కొంత సేపట్లో, ఈ కొండ మలుపు దగ్గర, ఒక అమ్మాయి వస్తోంది. దాని పేరు శరణ్య. దాని జుత్తు, గోళ్లు, చెమట నీకు వాసన చూపిస్తాను. వెళ్లి దానిని లోయలోకి తోసేసి, నీ ఆకలి తీర్చుకో !.”

“జగ్గు చేయబోయే పనిని నాకు అప్పగిస్తావా క్షుద్ర  పూజారీ, నేను నీ  పాలిటి పిశాచాన్ని, నాకు కావలసింది నా చావుకి ప్రతీకారం ! ఆ అమ్మాయిని చంపితే  నా పగ ఎలా తీరుతుంది ?”

“వద్దు, శాంభవీ ! నన్ను వదిలెయ్యి, కావాలంటే  నీకు ప్రతీ రోజూ బలి ఇస్తాను. నన్ను చంపితే నీకు ప్రతీ రోజూ లభించే బలిని కోల్పోతావు, ఆలోచించు.”

“ నాకు మరో ఆలోచన లేదురా ! క్షుద్ర  పూజారీ, నేను నీ పాలిటి పిశాచాన్ని,” అని  శాంభవి, హోమగుండం  నుండి , మండుతున్న తన రెండు చేతులనీ బయటికి చాపింది. తాంత్రికుడు ఆ చేతులనీ, భగ భగమని  మండుతున్న వాటి గోళ్ల చివర్లనీ  భయంతో చూసాడు.

“ శాంభవీ ! వద్దు, వద్దు, నన్ను వదిలెయ్ !” అంటూ పరుగు తీసాడు.

శాంభవి తాంత్రికుణ్ని వదల లేదు, తన చేతులని , భూగర్భం  లోంచి భూమిని చీల్చుకొంటూ అతను పరుగెడుతున్న  దిక్కు వెంబడి తరమ సాగింది. తాంత్రికుడు భయంతో, పొలికేకలు పెడుతూ పరుగెత్తబోయి, తడబడి నేలపై పడ్డాడు.

అంతే ! భూగర్భం లోని చేతులు రెండూ , అతని కాళ్లని దొరక బుచ్చుకొన్నాయి, ఆ కాళ్లని పట్టుకొని అతనిని భూమిలోకి లాగేసాయి!! తాంత్రికుడు హృదయ విదారకంగా  అరుస్తూ ఆ చేతుల మధ్య గిలగిల లాడాడు ! ఆ తరువాత  ఏమీ జరగనట్లే రెండు పాయలుగా చీలిన భూమి తిరిగి కలిసి పోయింది.
 
అదే సమయంలో  శరణ్య కారు ఆ కొండ మలుపుని సురక్షితంగా దాటి పోయింది.

దూరంగా, గెస్టుహౌసు మేడ మీద నిలబడి, బైనాక్యులర్లతో ఆ కారు దాటి పోయిన దృశ్యాన్ని చూసిన దున్నపోతు శీను ఆశ్చర్య పోయాడు!

‘ఏమిటిది ? ఎందుకిలా జరిగింది ? ’ అనుకొంటూ వెనక్కి తిరగబోయిన  అతను, ఎవరో తనని పట్టుకొన్నట్లు అనిపించి, ఎవరది, నన్నెందుకు పట్టుకొన్నారు ?” అంటూ పొలికేక పెట్టాడు,      

“నేనేన్రా మానసిని ! నన్ను  నిండు గర్భిణిని  బలవంతంగా  చెరచావు కదా ఆ రోజు, ఇవాళ నా వంతు ! నా కాళ్లు పట్టుకొని, సాగదీసి, నీ మిత్రులకి, నన్ను చెరిచేందుకు సాయ పడ్డావు కదూ, దాని ఫలితం అనుభవించు !” అంటూ అతని కాళ్లని ఎత్తి మేడ మీద నుంచి ఎత్తి కుదేసింది మానసి. అంతే !

దున్నపోతు శీను కాళ్లు రెండూ గాలిలో తేలాయి. అతని శరీరం క్రింద పడింది. తల నేలకి తగిలి, కొబ్బరికాయలా రెండు చిప్పలయింది.


(ఇంకా ఉంది)

Comments

Popular posts from this blog

చిలక రథంలో సరదా షికారు—( పెద్దలకు, పెళ్లైన వారికి మాత్రమే)

     ( ఈ బ్లాగులోనే టపా కొట్టిన కొన్ని సరస శృంగార కథల సమాహారం )     స్వస్తి శ్రీ చాంద్రమాన విరోధి నామ సంవత్సర జ్యేష్ట అమావాస్య , మృగశిరా నక్షత్ర యుత , సోమవార పర్వదినం, రోమన్ కేలండర్ ప్రకారం ఆ రోజు తేదీ 22.06.2009.     రాత్రి రెండు ఝాములు దాటి , ఒంటి గంట అయింది !     రుద్రాభిషేకం జరుగుతోంది.!     అది క్షీరారామ క్షేత్రంగా ప్రసిధ్ధికి ఎక్కిన ‘శ్రీరామ లింగేశ్వర స్వామి వారి ఆలయం. శివుడు తన త్రిశూలపు మొనని, నేలపై ఆనించగా, అక్కడ నుండి, ‘క్షీర ధార’ పైకి ఉబికి,‘ పాలకొలను’ ఏర్పడిందట ! ఆ కొలను గట్టున శ్రీమహా విష్ణువు పూర్ణావతారమైన, శ్రీరామ చంద్ర మూర్తి , సీతమ్మ వారితో కలసి, తమ స్వహస్తాలతో , ‘శ్రీ రామ లింగేశ్వర’ప్రతిష్ట చేసారట !     ఆ విధంగా శివ-  కేశవుల పవిత్ర స్పర్శతో పునీతమయిన క్షేత్ర రాజం అది !     ‘పినాక పాణి’ , అతని కుటుంబ సభ్యులు, శ్రీ రామ లింగేశ్వర స్వామి వారి, అభిషేక కార్యక్రమం ముగించుకొని, మూడవ గంట కల్లా, తనతో పాటు తెచ్చుకొన్న ‘మినీ బస్సులో’ తిరుగు ముఖం పట్టారు.   ...

సత్య సాయి బాబా నన్ను కాపాడిన వైనం.

నేను ‘క్షీరగంగ’ బ్లాగర్’గా మీ అందరికీ తెలుసు. నా అన్నయ్య , వదినలు ‘భగవాన్ శ్రీ సత్యసాయి బాబా’ గారి పరమ భక్తులు. వాళ్ల ఇంట్లో ఎప్పుడూ లక్ష్మివారం భజనలు జరుగుతూ ఉంటాయి. ఆ భజనల్లో ఎన్నో చమత్కారాలు , ‘విభూతి పడడం, తేనె కారడం’ లాంటివి జరుగుతూ ఉండేవి. వాళ్ల ఇల్లు, ‘విజయ నగరంలోని అయ్యన్న పేటలో ఉండేది. ఆ ఇల్లుని బాబా నిలయంగా అందరూ పేర్కొనే వారు. ఆ ఇంటికి వెళ్లిన నేను నాభార్య ఒకరోజు భజనలో పాల్గొన్నాం. ఆ తరువాత సహజంగానే మేము కూడ సత్యసాయి బాబా అనుగ్రహం కోసం అతని నామజపం మొదలు పెట్టాం. నాకు శ్రీ సత్య సాయి అనుగ్రహం కలిగిన అనుభవం చాల విచిత్రమైనది. నేను చాల సన్నిహితులైన వారితోనే దానిని పంచుకొన్నాను. ఈ రోజు శ్రీ సత్యసాయి అవతార సమాప్తి గురించి విన్న తరువాత నా బ్లాగు మిత్రులతో ఆ అనుభవాన్ని పంచుకోవాలని అనిపించింది. పది సంవత్సారాల క్రిందటి మాట ! నేను ‘ ఎస్.ఇ.సి.ఆర్. రైల్వే బిలాస్’పూర్’లో , సెక్షన్ ఇంజనీయరుగా పని చేస్తున్న రోజులవి. ‘ హౌరా,కుర్లా ఎక్స్’ప్రెస్ రాత్రి మూడు గంటలకి బిలాస్’పూరు ఫ్లాట్’ఫారం చేరుకొంది. అది చేరుకోవడానికి రెండు గంటల ముందే, నాకు కంట్రోల్ ద్వారా వర్తమానం అందింది. ఆ ట్రైను ఇంజనులో ఒ...

రక్కసి కందని రాచిలుక

‘సంపూర్ణ,’ అందాల చిలక లాంటి కన్నెపిల్ల.. పరిపూర్ణ సౌందర్యవతి. ఆమె విశాలమైన నీలి కళ్లు కలువల కొలనులాగ ఉంటాయి. ఆమె ముక్కు ఎక్కుపెట్టిన బాణంలాగ, నూటముఫ్ఫైయి అయిదు (90+45) డిగ్రీల అధిక కోణంలో నిటారుగా సంపెంగ రంగులో ఉండి, చిన్న కమ్మీని తగిలించుకొని, ఆ ముఖాని కంతటికీ తానే రాణినని విర్రవీగుతూ ఉంటుంది. ఆమె పెదవులు బొటన వ్రేలుతో మూయగలిగినంత చిన్నవి, వాటి రంగు పగడాలని తల దన్నేవే కాక గుండ్రని ముఖానికి, చూపులు తిప్పుకొనేటంతటి ఆకర్షణని తెచ్చి పెడుతూ ఉంటాయి.ముఖానికి రెండు వైపులా రెండు శ్రీకారాలు రాసినట్లుండే చెవులు, వాటి దిగువ వ్రేలాడే బుట్ట జుంకాలకే శోభనిస్తున్నట్లు ఉంటాయి. ఇక ఆమె పరువం, ఆమె యవ్వనం సరే, సరే ! పేరుకి తగినట్లే ఉంటాయి. అలాంటి అమ్మాయిని స్వంతం చేసుకోవాలని ఎవరికుండదు ! ఆ ఉద్దేశంతోనే సంపూర్ణ తండ్రి దగ్గరకి వచ్చాడా యువకుడు ! సంపూర్ణ తండ్రి ఒక రాక్షసి అధీనంలో ఉన్నాడు. ఆ రక్కసి అతనిని అతనికి తెలియకుండానే అడుగు లేని అగాధం లోకి రోజురోజుకీ అతనిని నెట్టుకుంటూ పోతోంది ! దాంతో అతను తనలోని ...