మణికంఠ సిధ్ధునికి, నీలా సుందరితో పొందిన అనుభవం ద్వారా, ‘ కుండలినీ జాగరణ ’ జరిగినా, అతడు అసూయనీ , అహాన్నీ జయించ లేక పోయాడు .
‘అసూయ’ , ఆమె తనతో వృధ్ధురాలి వేషంలో వచ్చి, సంభోగించినందుకు ! అహం తనంతటి సాధకుడు ఉండగా ఆమె ఒక ముక్కు పచ్చలారని బాలకుని సాధనని కూడా అంగీకరించినందుకు. అతడు మోసగింప బడ్డాడని తలచాడు, దానితో క్రోధానికి తల వగ్గాడు. అసూయ, క్రోధము, అహము ఎప్పుడైతే అతనిలో చేరాయో అతని వివేకం నశించింది.
పధ్నాలుగేళ్ల బాలుణ్ని,‘కృత్య’ అనే భయంకర పిశాచశక్తి ద్వారా అంతమొందింఛేందుకు దానిని ఆహ్వానించాడు. అది వాని ముందు వచ్చి నిలిచింది. దాని భయంకర రూపం వర్ణణాతీతం. దాని నాలుక అగ్ని జిహ్వలాగ ఉంది, దాని కోరలు ఏదుపంది ముళ్లలా ఉన్నాయి. దాని మిడి గ్రుడ్లు, గుడ్ల గూబకే వణుకు పుట్టించేలాగ ఉన్నాయి. దాని శరీరం సగం విరిగి పడిన అగ్ని పర్వత శిఖరం లాగ ఉంది. కాళ్లు చేతులు తాటి చెట్టు కాండాలలా ఉన్నాయి.
“మణికంఠా ! ఏమాఙ్ఞ ?” అని అడిగిందా భయానక పిశాచం
నీలా సుందరి సాధకుడైన, ‘ ఒక బాలకుణ్ని’ సంహరించాలని చెప్పాడు మణి కంఠుడు.
కృత్య వెంటనే వెళ్లి, సరస్సులో స్నానమాడుతున్న ఆ బాలకుణ్ని చూసింది. మొసలి ఆకారం దాల్చి, ఆ బాలకుని మృదువైన శరీరాన్ని నమిలి, నమిలి భక్షించింది.
నీలా సుందరి, మంత్ర పఠనం వల్ల వివశురాలై, ఆ రాత్రి తన దివ్య సుందర సౌమ్య రూపంతో , అతనిని అలరించింది. ఆ కలయిక, మునుపటి వలె కాక, కామంతో కూడి, కోరికతో జ్వలించి, తనని హింసించే పనులతో ముగియడం ఆమెకి, నచ్చలేదు ! తనతో రతిని సాధనగా తలచిన ఒక ఆరాధకుడు కామంతో తనని బలాత్కారం చేసినట్లు ఆమెకి తోచింది ! ఆమెకి కూడ కోపం వచ్చింది !
అంతే!ఆ రోజు రాత్రి, నీలా సుందరికి , మణి కంఠునికి ఆ బాలకుని హత్య విషయంగా వాగ్వాదం జరిగింది. నీలా సుందరి తన ప్రియుడు , రక్షకుడు రాజు అయిన , నలకుబేరునికి ఈ విషయాన్ని వివరంగా చెప్పింది.
కేవలం సంభోగం కోసం, మంత్ర శక్తికి అధీనురాలై వచ్చిన యక్షిణిని కూడా బలిమిని చెరబట్ట కూడదని అతనికి తోచలేదు !! నీలా సుందరి తనని ఏమీ చేయలేదని, మణి కంఠుడు భ్రమ పడ్డాడు. కాని నలకుబేరుని సంగతి అతనికి తెలియదు ! నలకుబేరుని శాప ఫలితంగా అతడు భూగర్భం లోని, ఒక గుహలో,కర చరణాలు శక్తి హీనమయిన అవిటి వాడుగా మారి, బంధితుడయ్యాడు !!
నీలా సుందరి, తనని ఆరాధించి హత్యకి గురి అయిన బాలకుని, మరుజన్మ కోసం ఎదురు చూసింది . ఆ బాలకుడు, ‘అనిరుధ్ధ్’ నామధేయంతో తిరిగి జన్మించాడు. అనిరుధ్ధ్ తన భార్య రమతో, ఆ గుహలపై, నిర్మింప బడిన ఒక ఇంటికి అద్దె కోసం రావడంతో, మళ్లీ ‘ నీలా సుందరి’ కథ మొదలయంది.
నీలా సుందరి తనకీ, తన సాధకునికీ అడ్డుగా నిలిచిన ,‘ రమని’ ఆ భవనం క్రింద గుహలో బంధించింది. అనిరుధ్ధ్’ని తన మోహ పాశంతో, తన వాడిగా చేసుకొంది !
రమ ఆధునిక యువతి అయినా పతివ్రత ! పతివ్రతలు ఏ కాలంలో నైనా సమర్థులే ! వాళ్లు ‘సమర్పణ’ అనే సాధన ద్వారా, తమ పతి యందు స్థాపించబడిన భగవంతునితో, సారూప్యం పొంది తరించి, తమతో పాటు తమ భర్తలను కూడా తరింప చేస్తారు.
రమ ఆ పనినే , అంత నిస్సహాయ స్థితిలో కూడ సాధించింది ! అనిరుధ్ద్ తప్పు ఏమీ లేదనీ, నీలిమ అతనిని సమ్మోహన పరచిందని, రమ అర్థం చేసుకొంది. ముందుగా, తన భర్తకి తన గురించి, ఙ్ఞాపకం చేయడం తన కర్తవ్యం అని , ఆ తరువాత తన భర్తే , తక్కిన దంతా చూసుకొంటాడని భావించింది. భర్తకి తనను గుర్తు చేయమని, రాత్రిం పగల్లు ఆమె భర్త నామ జపాన్ని చేసింది.
చివరికి ఒక రోజు, నీలిమ కౌగిలిలో పడుకొని ఉన్న, అనిరుధ్ధ్ కలలో , రమ కనిపించింది. ఆ రాత్రే కాదు, ప్రతీ రాత్రీ తన రూపాన్ని భర్త కలల్లో కనిపించేలా చేసింది. అతనికి కలలోనే , తన దీన గాధని వినిపించింది !
అనిరుధ్ధ్ జాగృతుడయ్యాడు. క్రమ క్రమంగా, నీలిమ మానవ కాంత కాదనీ, ఆమె ‘ రతి ప్రియ’ అయిన యక్షిణి’ అని తెలుసుకొన్నాడు. ఒకనాడు తన మంచం క్రింద ఉన్న, సొరంగ మార్గం సంగతి తెలుసుకొని, దాని గుండా వెళ్లి, ‘ రమని’ కలిసాడు. అప్పుడతనికి విషయమంతా అర్థమయింది.
రమ సలహాతో అతను, నీలిమతో తగవు పెట్టుకోలేదు. ఆమెని మరింత సంతోష పెట్టేందుకు, రతిలోని మరికొన్ని భంగిమలని గురించి అడిగి, తెలుసుకొని, ఆచరించాడు.
ఒక రోజు అతడు పశువుల రూపంలో, సంభోగం చేయాలనే కోరికని వెలిబుచ్చాడు. నీలిమ అతనికి ఒక మంత్రాన్ని ఉపదేశించింది. దాంతో అతను జింకగా మారాడు. నీలిమ ఆడు జింకగా మారి, అతనితో భోగించింది. అలా వారు పాముల లాగ, పశువుల లాగ, పక్షుల లాగ మారి, తమ అనుభవాన్ని పంచుకొన్నారు. అనిరుధ్ధ్ , నీలిమ ద్వారా,‘అణిమాది అష్ట సిధ్ధులని’ ఉపదేశం పొంది , ఆమెతో రక రకాలుగా కేళీ విహారాలు చేసాడు.
అలా మంత్ర సిధ్ధుడైన అనిరుధ్ధ్, ఆ నేలమాళిగలోనే ఉన్న ,‘మణికంఠ’ సిధ్ధున్ని బాగు చేసాడు. అతనికి తన మంత్ర శక్తిని ఇచ్చి,అతడు ‘నీలిమని’ తిరిగి పొందేలా చేసాడు ! మణికంఠుడు , నీలా సుందరిని వశం చేసుకొన్నాక, అనిరుధ్ధ్ , రమని తీసుకొని, ముంబయి వదిలి, పారిపోయాడు.
ఆ తరువాత తనకి లభించిన మంత్ర శక్తితో లోకులకి ఉపకారం చేస్తూ, రమతో పాటు గృహస్థ ధర్మాన్ని నెరవేర్చాడు, కాని మణికంఠ సిధ్ధుడు మరణించడంతో, విడుదల అయిన , నీలాసుందరి కోపాగ్నికి, గురి అయి, యాత్రలో ఉండగా, అపాయానికి లోబడి, ప్రాణాలని పోగొట్టుకొన్నాడు.
తన తల్లి తండ్రుల చరిత్రని తెలుసుకొన్న, ‘శరణ్య’ కళ్ల వెంబడి కన్నీరు ధార కట్టగా, విలపించింది. వాళ్ల పుణ్య ఫలమే తనని అడుగడుగునా రక్షిస్తోందని , తన తండ్రి తిరిగి, ‘నరేంద్రగా’ జన్మించి తనకి అండగా నిలిచాడని అర్థం తెలుసుకొంది. తన తండ్రిని తలచుకొంటూ నరేంద్రని ముద్దులాడింది.
(ఇంకా ఉంది)
‘అసూయ’ , ఆమె తనతో వృధ్ధురాలి వేషంలో వచ్చి, సంభోగించినందుకు ! అహం తనంతటి సాధకుడు ఉండగా ఆమె ఒక ముక్కు పచ్చలారని బాలకుని సాధనని కూడా అంగీకరించినందుకు. అతడు మోసగింప బడ్డాడని తలచాడు, దానితో క్రోధానికి తల వగ్గాడు. అసూయ, క్రోధము, అహము ఎప్పుడైతే అతనిలో చేరాయో అతని వివేకం నశించింది.
పధ్నాలుగేళ్ల బాలుణ్ని,‘కృత్య’ అనే భయంకర పిశాచశక్తి ద్వారా అంతమొందింఛేందుకు దానిని ఆహ్వానించాడు. అది వాని ముందు వచ్చి నిలిచింది. దాని భయంకర రూపం వర్ణణాతీతం. దాని నాలుక అగ్ని జిహ్వలాగ ఉంది, దాని కోరలు ఏదుపంది ముళ్లలా ఉన్నాయి. దాని మిడి గ్రుడ్లు, గుడ్ల గూబకే వణుకు పుట్టించేలాగ ఉన్నాయి. దాని శరీరం సగం విరిగి పడిన అగ్ని పర్వత శిఖరం లాగ ఉంది. కాళ్లు చేతులు తాటి చెట్టు కాండాలలా ఉన్నాయి.
“మణికంఠా ! ఏమాఙ్ఞ ?” అని అడిగిందా భయానక పిశాచం
నీలా సుందరి సాధకుడైన, ‘ ఒక బాలకుణ్ని’ సంహరించాలని చెప్పాడు మణి కంఠుడు.
కృత్య వెంటనే వెళ్లి, సరస్సులో స్నానమాడుతున్న ఆ బాలకుణ్ని చూసింది. మొసలి ఆకారం దాల్చి, ఆ బాలకుని మృదువైన శరీరాన్ని నమిలి, నమిలి భక్షించింది.
నీలా సుందరి, మంత్ర పఠనం వల్ల వివశురాలై, ఆ రాత్రి తన దివ్య సుందర సౌమ్య రూపంతో , అతనిని అలరించింది. ఆ కలయిక, మునుపటి వలె కాక, కామంతో కూడి, కోరికతో జ్వలించి, తనని హింసించే పనులతో ముగియడం ఆమెకి, నచ్చలేదు ! తనతో రతిని సాధనగా తలచిన ఒక ఆరాధకుడు కామంతో తనని బలాత్కారం చేసినట్లు ఆమెకి తోచింది ! ఆమెకి కూడ కోపం వచ్చింది !
అంతే!ఆ రోజు రాత్రి, నీలా సుందరికి , మణి కంఠునికి ఆ బాలకుని హత్య విషయంగా వాగ్వాదం జరిగింది. నీలా సుందరి తన ప్రియుడు , రక్షకుడు రాజు అయిన , నలకుబేరునికి ఈ విషయాన్ని వివరంగా చెప్పింది.
కేవలం సంభోగం కోసం, మంత్ర శక్తికి అధీనురాలై వచ్చిన యక్షిణిని కూడా బలిమిని చెరబట్ట కూడదని అతనికి తోచలేదు !! నీలా సుందరి తనని ఏమీ చేయలేదని, మణి కంఠుడు భ్రమ పడ్డాడు. కాని నలకుబేరుని సంగతి అతనికి తెలియదు ! నలకుబేరుని శాప ఫలితంగా అతడు భూగర్భం లోని, ఒక గుహలో,కర చరణాలు శక్తి హీనమయిన అవిటి వాడుగా మారి, బంధితుడయ్యాడు !!
నీలా సుందరి, తనని ఆరాధించి హత్యకి గురి అయిన బాలకుని, మరుజన్మ కోసం ఎదురు చూసింది . ఆ బాలకుడు, ‘అనిరుధ్ధ్’ నామధేయంతో తిరిగి జన్మించాడు. అనిరుధ్ధ్ తన భార్య రమతో, ఆ గుహలపై, నిర్మింప బడిన ఒక ఇంటికి అద్దె కోసం రావడంతో, మళ్లీ ‘ నీలా సుందరి’ కథ మొదలయంది.
నీలా సుందరి తనకీ, తన సాధకునికీ అడ్డుగా నిలిచిన ,‘ రమని’ ఆ భవనం క్రింద గుహలో బంధించింది. అనిరుధ్ధ్’ని తన మోహ పాశంతో, తన వాడిగా చేసుకొంది !
రమ ఆధునిక యువతి అయినా పతివ్రత ! పతివ్రతలు ఏ కాలంలో నైనా సమర్థులే ! వాళ్లు ‘సమర్పణ’ అనే సాధన ద్వారా, తమ పతి యందు స్థాపించబడిన భగవంతునితో, సారూప్యం పొంది తరించి, తమతో పాటు తమ భర్తలను కూడా తరింప చేస్తారు.
రమ ఆ పనినే , అంత నిస్సహాయ స్థితిలో కూడ సాధించింది ! అనిరుధ్ద్ తప్పు ఏమీ లేదనీ, నీలిమ అతనిని సమ్మోహన పరచిందని, రమ అర్థం చేసుకొంది. ముందుగా, తన భర్తకి తన గురించి, ఙ్ఞాపకం చేయడం తన కర్తవ్యం అని , ఆ తరువాత తన భర్తే , తక్కిన దంతా చూసుకొంటాడని భావించింది. భర్తకి తనను గుర్తు చేయమని, రాత్రిం పగల్లు ఆమె భర్త నామ జపాన్ని చేసింది.
చివరికి ఒక రోజు, నీలిమ కౌగిలిలో పడుకొని ఉన్న, అనిరుధ్ధ్ కలలో , రమ కనిపించింది. ఆ రాత్రే కాదు, ప్రతీ రాత్రీ తన రూపాన్ని భర్త కలల్లో కనిపించేలా చేసింది. అతనికి కలలోనే , తన దీన గాధని వినిపించింది !
అనిరుధ్ధ్ జాగృతుడయ్యాడు. క్రమ క్రమంగా, నీలిమ మానవ కాంత కాదనీ, ఆమె ‘ రతి ప్రియ’ అయిన యక్షిణి’ అని తెలుసుకొన్నాడు. ఒకనాడు తన మంచం క్రింద ఉన్న, సొరంగ మార్గం సంగతి తెలుసుకొని, దాని గుండా వెళ్లి, ‘ రమని’ కలిసాడు. అప్పుడతనికి విషయమంతా అర్థమయింది.
రమ సలహాతో అతను, నీలిమతో తగవు పెట్టుకోలేదు. ఆమెని మరింత సంతోష పెట్టేందుకు, రతిలోని మరికొన్ని భంగిమలని గురించి అడిగి, తెలుసుకొని, ఆచరించాడు.
ఒక రోజు అతడు పశువుల రూపంలో, సంభోగం చేయాలనే కోరికని వెలిబుచ్చాడు. నీలిమ అతనికి ఒక మంత్రాన్ని ఉపదేశించింది. దాంతో అతను జింకగా మారాడు. నీలిమ ఆడు జింకగా మారి, అతనితో భోగించింది. అలా వారు పాముల లాగ, పశువుల లాగ, పక్షుల లాగ మారి, తమ అనుభవాన్ని పంచుకొన్నారు. అనిరుధ్ధ్ , నీలిమ ద్వారా,‘అణిమాది అష్ట సిధ్ధులని’ ఉపదేశం పొంది , ఆమెతో రక రకాలుగా కేళీ విహారాలు చేసాడు.
అలా మంత్ర సిధ్ధుడైన అనిరుధ్ధ్, ఆ నేలమాళిగలోనే ఉన్న ,‘మణికంఠ’ సిధ్ధున్ని బాగు చేసాడు. అతనికి తన మంత్ర శక్తిని ఇచ్చి,అతడు ‘నీలిమని’ తిరిగి పొందేలా చేసాడు ! మణికంఠుడు , నీలా సుందరిని వశం చేసుకొన్నాక, అనిరుధ్ధ్ , రమని తీసుకొని, ముంబయి వదిలి, పారిపోయాడు.
ఆ తరువాత తనకి లభించిన మంత్ర శక్తితో లోకులకి ఉపకారం చేస్తూ, రమతో పాటు గృహస్థ ధర్మాన్ని నెరవేర్చాడు, కాని మణికంఠ సిధ్ధుడు మరణించడంతో, విడుదల అయిన , నీలాసుందరి కోపాగ్నికి, గురి అయి, యాత్రలో ఉండగా, అపాయానికి లోబడి, ప్రాణాలని పోగొట్టుకొన్నాడు.
తన తల్లి తండ్రుల చరిత్రని తెలుసుకొన్న, ‘శరణ్య’ కళ్ల వెంబడి కన్నీరు ధార కట్టగా, విలపించింది. వాళ్ల పుణ్య ఫలమే తనని అడుగడుగునా రక్షిస్తోందని , తన తండ్రి తిరిగి, ‘నరేంద్రగా’ జన్మించి తనకి అండగా నిలిచాడని అర్థం తెలుసుకొంది. తన తండ్రిని తలచుకొంటూ నరేంద్రని ముద్దులాడింది.
(ఇంకా ఉంది)
Comments
Post a Comment